సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయండి.

congress congress

సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయండి..

పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ సిపిఐ పార్టీ కార్యాలయం లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయాల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ లు హాజరై మాట్లాడారు. సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మున్సిపాలిటీలోని 22 బస్తి శాఖల సమావేశాలు నిర్వహించి అన్నీ బస్తి శాఖల నూతన కమిటీ లను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.ఈ కమిటీ మూడు సంవత్సరాలు కొనసాగుతుందన్నారు. జూన్ 1 న జరిగే పట్టణ మహాసభలో పట్టణ కమిటీ నీ ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కార్మిక కర్షకుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి అనేక హక్కులు సాధించింది అని గుర్తు చేశారు.ఈ మహాసభలకు ముఖ్య అతిథిలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి పౌలు, పెర్క సంపత్, పెండ్యాల కమలమ్మ, గాజుల మణెమ్మ, మరపెల్లి రవి, కుక్క దేవానంద్, గోడిసెల గురవయ్య, ఎగుడ మొండి, మాదాస్ శంకర్, షేకీర్, కౌడగని సాంబయ్య తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!