రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ.

Farmers Farmers

 రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ

నిజాంపేట నేటి ధాత్రి:

రైతులు వర్షాకాలం పంట కు లఘు ఏర్పడడానికి జీలుగు విత్తనాలు ఎంతగానో ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రనీకి 200 క్వింటల్ల జీలుగు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకొని వ్యవసాయ విస్తరణ అధికారులు కూపన్స్ జారీ చేస్తారని ఆ కూపన్స్ ఆగ్రోస్ మరియు డిసిఎంఎస్ సెంటర్లో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 30 కేజీల జీలుగు ధర రూ,, 2137. 50 ఉందన్నారు. మండల వ్యాప్తంగా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!