రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మరిన్ని సదుపాయాల కల్పన
రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునే అవకాశం
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలకు మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి
డాక్యుమెంట్లు కూడా దరఖాస్తు దారులే నింపే సదుపాయం
కేవలం పది, పదిహేను నిముషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ పూర్తి
ధరణి పోర్టలో అక్రమాల నేపథ్యంలో భూభారతి అమల్లోకి
పొంగులేటి నాయకతమంటే సంస్కరణలకు కొత్తబాట వేసినట్టే
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ మరియు ఐÊ బి శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు సం బంధించిన శాఖల్లో సమూలమైన మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందాలన్న లక్ష్యంతో ఈ సంస్కరణలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే శాఖ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ కావడంతో, అమ్మకాలు కొనుగోళ్లు జరిపే ప్రజలకు అన్నిరకాల సదుపాయాలు, సత్వరమే పనులు పూర్తవడానికి వీలుగా ఈశాఖలో మార్పులను అమల్లోకి తెచ్చారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లకోసంవచ్చేవారు ,కార్యాలయాల్లో తగిన సదుపాయాలు లేకపోవడంతో బయట ఎక్కడో చెట్లకింద, హోటళ్లలో కూర్చొని నానా అగచాట్లు పడుతున్నారు. అదీకాకుండా రాతపోతలు, స్టాంపుల కొనుగోలు వంటి వాటికోసం సమీపంలోని డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించడం, పని పూర్తయ్యేవరకు బjట రోడ్లపై కాలక్షేపం చేయాల్సి వస్తోంది. ఇటువంటి దుస్థితిని నివారించేందుకు పొం గులేటి శ్రీని వాసరెడ్డి రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు అధికార్లకు ఆదేశాలు జారీచే శారు. ఇదేసమయంలో రాష్ట్రంలో చాలా రిజిస్ట్రార్, సబ్`రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇప్పుడు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సొంతభవనాలను దశలవారీగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు కొత్తగా నిర్మించే కార్యాలయాల్లో విజిటర్స్ కోసం ప్రత్యే కంగా విశాలమైన హాలు వుండేలా చూస్తున్నారు. దీనివల్ల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిరిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయానికి వచ్చేవారు ఈ హాల్లో కూర్చోవచ్చు. అదేవిధంగా తాగునీరు మరియు ఇతర సదుపాయాల కల్పనకు పొంగులేటి చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలావుండగా రిజిస్ట్రేషన్ శాఖలో కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా పొంగులేటి ఆదేశాలతో అధికార్లు స్లాట్ బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వ్యవసాయేతర స్థిరాస్తుల అమ్మకాలు`కొనుగోళ్లకు సంబంధించి ఈ స్లాట్ బుకింగ్ సబ్`రిజిస్ట్రార్ మరియు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో వుంటాయి. అయితే దీన్ని దశలవారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పుడు అమలు జరుపబోయే స్లాట్ విధానంలో మొత్తం పనిగంటలను 48 స్లాట్లుగా విభజించారు. ముఖ్యంగా దరఖాస్తుల వెల్లువను, విపరీతమైన రద్దీని నివారించేందుకు ఈవిధానం పనికొస్తుందని మంత్రి పొంగులేటి తెలి పారు. ఇదే సమయంలో ఒకే ఆస్తిని రెండు రిజిస్ట్రేషన్లు చేసే అవకాశాలను నిరోధించేందుకు కూడా ఈ స్లాట్ వ్యవస్థ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చ ట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ సరికొత్త విధానం కింద రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు కేవలం 10 నుంచి 15 నిముషాల్లో పూర్తికానున్నాయి. అయితే అత్యవసరంగా రిజిస్ట్రేషన్ అవసరమైన వారు, స్లాట్ బుక్ చేసుకునే అవకాశం వుండదు కనుక, అటువంటివారు సాయంత్రం 5 నుంచి 6 గంటలలోపు తమ రిజిస్ట్రేషన్లను పూర్తిచేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిం చింది.
దరఖాస్తు దారులు తెలంగాణ ప్రభుత్వ పోర్టల్లోకి వెళ్లి తమకు అనుకూలమైన తేదీలో స్లాట్ను బుక్చేసుకోవాల్సి వుంటుంది. తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం 144 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో24 కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ను అమలు చేయనున్నారు. ఈ 24 కార్యాలయాలు వరు సగా అజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి, సదాశివపేట, ఖుద్బుల్లాపూర్, వల్లభ్నగర్, షంషాబాద్, సరూర్నగర్, చంపాపేట్, పెద్దపల్లి, రామగుండం, కూసుమంచి, ఖమ్మం (ఆర్.ఒ), మేడ్చెల్ (ఆర్.ఒ), మహబూబ్నగర్ (ఆర్.ఒ), జగిత్యాల్, నిర్మల్, వరంగల్ కోట, వరంగల్ రూరల్, కొత్త గూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్ మరియు నాగర్కర్నూల్.
పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు, మేడ్చెల్, ఖుద్బుల్లాపూర్ రిజిస్ట్రార్ కార్యాలయల్లో పని ఒత్తిడి అధికంగా వుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒత్తిడిని తట్టుకు నేందుకు మరో ఇద్దరు`సబ్ రిజిస్ట్రార్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు కార్యాయాల్లో స్లాట్లను 144కు పెంచారు. ఇదేసమయంలో సబ్`రిజిస్ట్రార్లకు సమానంగా పని బాధ్యతలు అప్పగించడం వల్ల, ఏ ఒక్కరిమీదో పని ఒత్తిడి పూర్తిగా పడే అవకాశముండదు. ఉ దాహరణకు చంపాపేట్, సరూర్నగర్ రిజిస్ట్రార్లను అనుసంధానం చేయడం ద్వారా వేగంగా రిజిస్ట్రేషన్లు పూర్తికావడమే కాదు, ఎంతో సమయం కలిసొస్తుంది. ఈ అధునిక విధానంలో పొంగులేని నేత్వృంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం దరఖాస్తుదారులే తమ డాక్యుమెంట్లను పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు మంత్రి నిర్దేశం మేరకు రిజి స్ట్రేషన్ శాఖకు చెందిన వెబ్సైట్లో ఒక మాడ్యూల్ను కూడా ఏర్పాటు చేశారు. దీని ప్రకారం దరఖాస్తుదారులు తమ డాక్యుమెంట్లను పూర్తిచేసుకోవచ్చు. ప్రారంభంలో దీన్ని సేల్డీడ్లకు వ ర్తింపజేస్తారు. అయితే ఆవిధంగా పూర్తిచేయడం ఐచ్ఛికం కూడా. దీనివ్ల డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం డాక్యుమెంట్లపై అన్లైన్ లో సంతకం చేసే విధానాన్ని (ఇ`సైనింగ్) అందుబాలోకి తెచ్చింది. దీనివల్ల సమయాభావం బాగా తగ్గుతుంది. దీనివల్ల పార్టీలు, సాక్షుల సంతకాల సేకరణ మరింత సులువు కాగలదు.
అంతకుముందు ఈ ఏడాది మొదట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వం వహిస్తున్న రెవెన్యూ శాఖలో కూడా ‘భూభాతి’ పేరుతో పూర్తి సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం గత శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందింది. గవర్నర్ జిష్నుదేవ్వర్మ భూభారతి (రికార్డు హక్కులు) చట్టానికి ఆమోదముద్ర వేయ డంతో ఇది అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు అమల్లో వున్న రెవెన్యూచట్టం`2020 రద్ద యింది. దీనికింద అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ ధరణి పోర్టల్పై అనేక ఫిర్యాదులు రావడంతో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాని స్థానంలో ‘భూభారతి’ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇప్పటివరకు వు న్న ధరణి డిజిటల్ ప్లాట్ఫాం స్థానంలో భూభారతి డిజిటల్ ప్లాట్ఫామ్ అమల్లోకి వచ్చింది. పొంగులేటి మంత్రిగా వున్న రెవెన్యూ, రిజ్రిస్ట్రేషన్ మంత్రిత్వశాఖల్లో విప్లవాత్మక మార్పులు రావడంవిశేషం.
సంస్కరణాభిలాషి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంజిల్లా వాసి. ఆయన 2014లో వైఎస్ఆర్సీపీ తరపున ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎం.పి.గా ఎన్నికయ్యారు. తర్వాత కెసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రసమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్స్ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన లింగాల కమలరాజుకు మద్దతు ఇచ్చారు. అయితే 2023లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ పార్టీనుంచి సస్పెండ్ చేశారు. తర్వాత 2023 జులై 2 ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేరోజు ఖమ్మంలో ‘తెలంగాణ జన గర్జన’ పేరుతో ఖమ్మంలో పెద్ద బహిరంగసభ జరిగింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ హాజరయ్యారు. ఆయన సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి 56,650 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ, హౌజింగ్ మరియు సమాచార మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్నారు.