దేశవ్యాప్త సంఘటితంగా అందరూ పాల్గొనాలి .!

Nationwide Nationwide

దేశవ్యాప్త సమ్మెలో సంఘటితంగా అందరూ పాల్గొనాలి

ఏ ఐ సి టి యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు

కేసముద్రం నేటి ధాత్రి :

 

 

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో కో-పరేటివ్ సెంటర్లో పనిచేస్తున్న హమాలీల వద్దకు ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న వెళ్లి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన జరిగేటువంటీ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా చేసిందని దీని ద్వారా పెట్టుబడిదారి,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండడానికె ఈ విధంగా చేయడం జరిగిందని, ఇది కార్మికులకు ఎంతో నష్టదాయకమని ఆయన అన్నారు. వాటిని రద్దు చేయాలని అదేవిధంగా అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం,అసంఘటిత రంగాల కార్మికులకు సమగ్ర చట్టం చేయకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు;వేటగాని శ్రీనివాస్,కలపాక వంశీ,జల్లే జాన్సన్,యాటగాని రాములు,గడ్డం నరసయ్య,పానుగంటి రాములు,అయినల శ్రీనివాస్,చాగంటి రాములు,కలపాక శ్రీను,మునుగోడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!