తప్పుడు మైనింగ్ అనుమతులు పై చర్యలు తీసుకోవాలి
కొత్తగూడ, నేటిధాత్రి:
ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారిని కలిసి మెమొరండా ఇవ్వడమైనది. అనంతరం దనసరి రాజేష్ రాష్ర్ట జాయింట్ సెక్రటరీ ఆదివాసి సంక్షేమ పరిషత్ మాట్లాడుతూ. పూర్తి ఏజెన్సీ మండలం అయినటువంటి బయ్యారం మండల పరిధిలోని ధర్మాపురం రెవేన్యూ గ్రామం నామలాపాడు గ్రామపంచాయతీ పరిధిలో గిరిజన రైతులు మట్టితోలకాలకు అనుమతులు కావాలని గనులు మరియు భూగర్భ శాఖకు దరఖాస్తు చేసుకున్నారని వారు 6000 మెట్రిక్ టన్నుల మట్టి తోలకాలకు పెసా గ్రామసభ తీర్మానం చేసి పంపమని చెప్తున్నా మైనింగ్ AD చెప్తున్నారు తప్ప ఆ మట్టిని రైతు పొలాల్లోకా లేక వ్యాపారవేతలకా అని చెప్పకపోవడం వారిచ్చే సర్కిలర్ లొ ఎంత లోతు మట్టి తవ్వకాలు జరుగుతాయి అని ఏం తెలుపకుండా పేసా కమిటీ ద్వారా తీర్మానం చేసి పంపండి అని చెప్పడం దురదృష్టకరం. ఇక్కడ మైనింగ్ అధికారులు మట్టి తోలకాల అనుమతులపై పూర్తి సమాచారం ఇవ్వకుండా ఒక సర్కులర్ పంపి ఆ తీర్మానం ఇవ్వండి అంటున్నారే తప్ప ఇప్పటివరకు మట్టి తోలకాలు చేసినటువంటి వారు మట్టి తోలకాల ద్వారా ఆ ఆదాయం ద్వారా ఆ గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు చెల్లించాలి అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతూ గిరిజనుల పేరుతో ఈ మట్టి దందలో గిరిజనేతరులను ప్రోత్సహించడం సిగ్గుచేటు ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమ మట్టి దంద పైన ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరలకు అనుమతులు ఇస్తున్న గనులు మరియు భూగర్భ శాఖ అధికారులను తప్పుడు గ్రామ సభ తీర్మానాలు ఇస్తున్న గ్రామపంచాయతీ సెక్రటరీలను విధుల నుండి తొలగించాలని ఈ అక్రమ వ్యాపారం పైన గత రెండు సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్ గారికి రెండు సంవత్సరాల నుండి దరఖాస్తులు ఇచ్చినా కూడా అక్రమ మట్టి తోలకాల పైన అక్రమ ఇటుక బట్టీల పైన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్ తో మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపినారు.
అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టానికి విరుద్ధంగా ధర్మపురం రెవెన్యూ, కొత్తపేట రెవేన్యూ, గంధంపల్లి రెవేన్యూ మరియు కాసినపల్లి రెవేన్యూ పరిధిలో గిరిజనేతరులు అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను తొలగించాలి జిల్లా అధికారులు చిత్తశుద్ధితో అనుమతులు లేని ఇటుక బట్టీల పై ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్,ఉపాధ్యక్షులు మంకిడి సురేష్ డివిజన్ అద్యక్షులు తాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు