రసాభాసగా మారిన ప్రజాభిప్రాయ సేకరణ..
.. 40 ఫీట్ల రోడ్డు ఒప్పుకోమంటున్న బాధితులు..
రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్):
రామయంపేట మెదక్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు మంజూరైన రోడ్డు 40 ఫీట్ల వెడల్పుతో వేయడం మానుకోవాలని బాధితులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని మహంకాళి దేవస్థానంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు వ్యాపారులు, ఇండ్లను కోల్పోతున్న బాధితులు పాల్గొన్నారు. 40 ఫీట్ల రోడ్డు కాకుండా అందరిని దృష్టిలో పెట్టుకొని వెడల్పు చేయాలని అన్నారు. తాము అభివృద్ధికి అడ్డుపడమని కానీ విచ్చలవిడిగా రోడ్డు వెడల్పు చేస్తే చాలామందిని నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మైనoపల్లి రోహిత్ రావు కల్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేవలం కొంతమంది తమ స్వార్థం కోసం 40 ఫీట్ల రోడ్డు చేయాలని పట్టు పట్టడం సమంజసం కాదన్నారు. కొంతమంది లేనిపోని కారణాలు చెప్పి 40 ఫీట్ల రోడ్డు కోసం పట్టు పట్టడం జరుగుతుందని ఇది ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వచ్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని పట్టణానికి చెందిన వ్యాపారి ఎనిశెట్టి సంతోష్ అన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమంది బాదితులకు వాగ్వాదం జరిగింది.