ఆధునిక వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి..

Modern medicine should be accessible to everyone Modern medicine should be accessible to everyone

ఆధునిక వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి

సూర్య హాస్పిటల్ డాక్టర్స్ ఎం. గీతా పావని ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు మరియు ఎన్.ఎస్. పవన్ రెడ్డి జనరల్ ఫిజీషియన్ ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు…*

నేటి ధాత్రి:మణుగూరు

పినపాక మండలం జానంపేట గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు భద్రాచలం సూర్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది..
ఈ వైద్య శిబిరానికి భద్రాచలం సూర్య హాస్పిటల్ కు చెందిన ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం గీతా పావని మరియు జనరల్ ఫిజీషియన్ ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎన్ఎస్ పవన్ రెడ్డి మరియు హాస్పటల్ సిబ్బంది హాజరయ్యారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో హాజరైన పినపాక మండలంలోని పలు గ్రామాలకు చెందిన రోగులను ఉద్దేశించి డాక్టర్ ఎం. గీతాపావని మాట్లాడుతూ ప్రారంభ దశలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే నిరుపేద కుటుంబాల్లో ఈ కిడ్నీ వ్యాధి బారిన ఎక్కువ మంది పడుతున్నారని కిడ్నీ సమస్యలతో అనేక రకాలుగా బాధించబడుతున్నారని, వీరందరికీ సరైన చికిత్స అందించడానికి భద్రాచలంలోనే సూర్య హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని, ఏజెన్సీ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని… నిరుపేదల సేవే భగవంతుని సేవగా భావించి అందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు…
తదుపరి డాక్టర్ ఎన్ ఎస్ పవన్ రెడ్డి మాట్లాడుతూ షుగర్ వ్యాధిగ్రస్తులు సరైన ఆహార నియమాలు పాటిస్తూ సక్రమంగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడినట్లయితే షుగర్ గాని బీపీ గాని కంట్రోల్లో ఉంటాయి వాటి వల్ల ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. షుగర్ మరియు బిపి కంట్రోల్ లో లేకపోతే కిడ్నీ వ్యాధి బారిన ఇప్పుడు ఎక్కువమంది పడుతున్నారని.. వైద్యంలో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని ఎవరు ఎలాంటి జబ్బులకు భయపడవలసిన అవసరం లేదని తెలియజేశారు… భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని తెలియజేశారు వస్తున్నారు

ఈ కార్యక్రమంలో దరిదాపు 300 మంది రోగులను డాక్టర్లు పరీక్షించి వారికి తగు సలహాలు సూచనలతో పాటు సుమారు నాలుగు లక్షల రూపాయల మందులను ఉచితంగా పంపిణీ చేశారు…

ఈ కార్యక్రమంలో భద్రాచలం సూర్య హాస్పిటల్ సిబ్బంది మరియు ఇతర గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!