nanyatha patinchali, నాణ్యత పాటించాలి

నాణ్యత పాటించాలి

కమ్యూనిటీ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి తెలిపారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డులో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనాన్ని పురపాలక సంఘం కమిషనర్‌ పర్యవేక్షించారు. అనంతరం ఇందిరా, నెహ్రూ పార్కులను సందర్శించి పార్క్‌, స్విమ్మింగ్‌ పూల్‌లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను గోడలపై చిత్రీకరించడంతోపాటు లైఫ్‌ గార్డ్స్‌, సెఫ్‌ బెలూన్స్‌, ట్యూబ్లను సిద్దంగా ఉంచుతూ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ క్లోరినేషన్‌ చేయాలని సూచించారు. అదేవిధంగా మాస్‌ డ్రైన్‌ క్లీనింగ్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *