తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన తంగళ్ళపల్లి మండల మాజీ బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్.అధ్యక్షులు నిన్న రాత్రి 8:30కు పరమపదించినా రు ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు వారి మరణం పార్టీకి తీరని లోటు అని తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీలో 2009 నుంచి పార్టీలో పని చేస్తూ పని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మండలంలోని ఎన్నో పదవులు చేసిన రఘువర్మ ఈరోజు మాలో లేకపోవడం చాలా దురదృష్టకరమనితెలియజేస్తూ పార్టీపరంగా ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ పార్టీలో పెద్దలతో మాట్లాడి ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ పరంగా చనిపోయిన రఘు వర్మ కుటుంబాన్ని అన్ని అన్ని విధాలుగాఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ మాజీ ఎంపీపీ పడిగల మానస రాజు మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు