వరంగల్ ఆర్ డి డి ఎం
పద్మావతి
జమ్మికుంట: నేటి ధాత్రి
ఉత్తర తెలంగాణలోనే రెండవ అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందినకరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్ లో కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని వరంగల్ ఆర్ డి డి ఏం పద్మావతి అన్నారు. పదోన్నతి పొందిన తర్వాత మొదటిసారిగా జమ్మికుంటకు వచ్చిన పద్మావతికి మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం తోపాటు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరంగల్ ఆర్ డి డి ఎం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైన చర్యలను తీసుకోవాలని, నాణ్యమైన పత్తికి మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు వ్యాపారులతో పాటు సిసిఐ సైతం కొనుగోలు చేసేందుకు ఇప్పటికే అధికారులతో సంప్రదింపులు జరపడం జరిగిందని రానున్న రోజుల్లో జరిగే సిసిఐ విక్రయాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ప్రతినిత్యం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు వస్తున్న పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.