రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్లు స్కామ్

అధిక లోడ్ తో వెళ్తున్న ప్లె యాష్ లారీలను అడ్డ గింత……

ప్లై యాష్ అక్రమ రవాణాలో మంత్రి పొన్నం రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారు…..

మంత్రి పొన్నం ను భర్త రఫ్ చేయాలి…..

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి….

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.శనివారం వే బిల్లు లేకుండా, రూల్ ప్రకారం 32 టన్నులతో పోవాల్సిన లారీలు 80 టన్నుల అధిక లోడ్ తో వెళ్తున్న ఫ్లై యాష్ లారీలను అడ్డుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రోజుకి రెండు మూడు వందల ఫ్లై యాష్ లారీలు రామగుండం ఎన్ టి పి సి నుంచి ఖమ్మం వైపు వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. మంత్రి కనుసన్నల్లోనే ఈ అక్రమ ఫ్లై యాష్ రవాణా జరుగుతుందన్నారు. ఒక్కో లారీలో సుమారు 70 నుంచి 100 టన్నులు కూడా ఉంటుందని అన్నారు. ఈ రవాణా ద్వారా వందల కోట్ల స్కాం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు ఉందన్నారు. ఇంత పెద్ద స్కాం ను లైవ్ లో పట్టుకున్నామని అన్నారు. ఒక లారీ వెళ్లడానికి సుమారు 25 వేల వరకు ఖర్చు అవుతుందని, అందులో కేవలం 32 టన్నులు వెళ్లడానికి మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు. 32 టన్నులు మాత్రమే పోవాలి అలాంటిది 70 నుంచి 100 టన్నులతో వరకు తీసుకువెళ్తున్నారని అన్నారు. అక్రమంగా తరలిస్తున్న దానిపై వచ్చే ఆదాయం ఒక్కోలారికి 40,000 వరకు ఉంటుందని రోజుకు రెండు నుంచి 300 లారీలు వెళ్తే సుమారు 50 లక్షలు వరకు అవుతుందని అన్నారు. మంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఇప్పటి వరకు 100 కోట్లు స్కామ్ చేసారని ఆయన అన్నారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ ను పదవి నుంచి భర్త రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!