
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కోసుర్ పల్లి చిట్యాల ఫోర్త్ కేంద్రాలను గురువారం రోజున అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతుల బాలింతల గృహ సందర్శనలు చేసి తల్లులకి కుటుంబ సభ్యులందరికీ గర్భవతి దశ నుండి రెండు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇవ్వవలసిన ఆహార పదార్థాలు వ్యక్తిగత శుభ్రత త్రాగే నీరు ప్రతినెల ఆరోగ్య పరీక్షలు టీ కాలు బరువులు తీయించుకోవడం చేయడంవల్ల తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు, అలాగే ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలని సూచించి తల్లి పిల్లల బరువులు తీసి గ్రోత్ కార్డులను ఉపయోగించి పిల్లల ఆరోగ్యంగా ఉండడానికి మూడు సూచికల ద్వారా తెలుసుకోవాలని గ్రోత్ కార్డ్స్ పై అవగాహన కల్పించనైనది, ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సుజాత భాగ్యలక్ష్మి తల్లులు పాల్గొన్నారు