రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన పారునంది అక్షిత ఇటివల వెలువడిన ఆరవ తరగతి నవోదయ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించారు. ఈవిషయం తెలిసిన గుండి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ పొన్నం శ్రీనివాస్ గౌడ్ విద్యార్థినిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో పొన్నం అభిషేక్, కత్తి సాయి కుమార్, పారునంది శంకర్, మంది రాజశేఖర్, గ్రామస్థులు పాల్గొన్నారు.