వరంగల్,నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరంగల్-1 డిపోలో ప్రయాణికుల సౌకర్యార్ధం కోసం ఈ నెల 31(నేడు) ఆదివారం డయల్ యువర్ డి.ఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు.బస్సు సర్వీసుల పట్ల ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9959226047 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు.
హైదరాబాద్,నిజమాబాద్,సిద్ధిపేట, పాలకుర్తి,తరిగొప్పుల రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సలహాలు, సూచనలు తెలియ జేయవలసిందిగా డిపో మేనేజర్ కోరారు.ఈ రూట్లలో ఏమైనా సమస్యలు ఉంటె నేరుగా 9959226047 ఫోనులో సంప్రదించాలని డిపో మేనేజర్ మోహన్ రావు కోరారు.