సేఫ్టీ తో కూడిన బొగ్గు రవాణానే ముఖ్యం….

మందమర్రి జిఎం మనోహర్…

రామకృష్ణాపూర్, మార్చి 26, నేటిధాత్రి:

మందమర్రి ఏరియాలోని ఆర్కెపి సిహెచ్ పి నీ మంగళవారం మందమర్రి ఏరియా జిఎం మనోహర్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….. 2023 – 2024 వ వార్షిక సంవత్సరానికి ఇచ్చిన 22.3 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు బదులుగా అదనంగా ఏడు లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినందుకు కార్మికులను అధికారులను అభినందించడం జరుగుతుందని తెలియజేశారు. మిగిలిన వారం రోజులు ఇదేవిధంగా కష్టపడి సేఫ్టీ తో రవాణా చేయాలని కార్మికులకు సూచించారు. జిఎం మనోహర్ తో పాటు ఏజిఎం నాగరాజు లు కార్మికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్బి ఎస్ఈ చంద్రమౌళి, సూపర్వైజర్స్, టెక్నీషియన్స్ కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *