మహబూబ్ నగర్ జిల్లా ::నేటిధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన గుండు రాములమ్మ అనారోగ్య కారణాలవల్ల శనివారం రోజు మృతి చెందడం జరిగింది.
ఆమె మరణ వార్త తెలుసుకున్న పోలీసు యాదగిరి గౌడ్ ఆమె మృతికి సంతాపం తెలిపి అంతక్రియ ఖర్చుల నిమిత్తం 10000/ రూపాయలు యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాచన మోని నీ లక్ష్మయ్య ద్వారా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాచన మోని లక్ష్మయ్య , మాజీ సర్పంచ్ ఆశన్న, మక్సుద్ అలీ, బి నర్సింలు,కోస్గి సత్యనారాయణ, కోస్గి నరసింహులు,తదితరులు పాల్గొన్నారు.