చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలమండల కేంద్రాలలో మంగళవారం రోజున శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళుతున్న భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ సర్వీసులను భక్తులు ఉపయోగించుకొని సమ్మక్క సారలమ్మ మొక్కులు చెల్లించుకోవాలని భక్తులను కోరారు.