ఆరోగ్య వైద్యశాఖ నాణ్యత ప్రమాణంలో మొదటి స్థానం భూపాలపల్లి

అవార్డు అందుకున్న డిఎం అండ్ హెచ్ ఓ మధుసూదన్

భూపాలపల్లి నేటిధాత్రి

NQAS 2022-2023 రాష్ట్రంలో 87.5% నాణ్యత ప్రమాణాలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలిచినది. రాష్ట్రంలో విజేతలుగా పిహెచ్సి కాటారం, పి హెచ్ సి మహా ముత్తారం, పీహెచ్సీ గన్ పూర్, పీహెచ్సీ రేగొండ, పీహెచ్సీ ఆజాంనగర్, పీహెచ్సీ మొగుళ్లపల్లి, సిహెచ్ సి చిట్యాల , హెచ్ డబ్ల్యు సి మీనాజీపేట, హెచ్ డబ్ల్యు సి ధన్వాడ, హెచ్ డబ్ల్యు సి ములుగు పల్లి, హెచ్ డబ్ల్యు సి జంగేడు, హెచ్ డబ్ల్యు సి బయ్యారం, హెచ్ డబ్ల్యు సి కనకనూరు, హెచ్ డబ్ల్యు సి గిద్దే ముత్తారం, హెచ్ డబ్ల్యూ సి గుండ్ల బుద్ధారం , నాణ్యత ప్రమాణాలలో రాష్ట్రంలో ఎంపిక చేయడం జరిగినది.
దీవి ఈ నెల 24న హైదరాబాదులో సెక్రెటరీ మేడం క్రిస్టినా చొంగ్టు. కమిషనర్ ఆర్ వి కర్ణన్ చేతుల మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్ అవార్డును అందుకోవడం జరిగినది
కలెక్టర్ భవిష్ మిశ్రా ఆదేశానుసారం ఆరోగ్య వైద్యశాఖ నాణ్యత ప్రమాణాలలో రాష్ట్రంలో మొదటి స్థానంలో అవార్డు పొందినందుకుగాను కృతజ్ఞతలు తెలియజేశారు
డిస్టిక్ క్వాలిటీ మేనేజర్ డాక్టర భాను కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ డాక్టర్ కొమురయ్య, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ శ్రీదేవి, పిఓ డాక్టర్ ఉమాదేవి, పి ఓ డాక్టర్ అన్వేషిని, డిపిఓ చిరంజీవి, డి డి ఎం మధు పాల్గొనినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!