జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఏ కోర్సులో చేరితే ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయో కెరీర్ పై అవగాహన కల్పించారు. చదువుపై శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పాఠశాల విద్యార్థి విద్యార్థులకు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి. సత్యనారాయణ ఎంపీడీవో, యు. ఉపేందర్ రావు జైపూర్ ఎస్సై, విద్యాసాగర్ రావు ఏఈ ఆర్డబ్ల్యూఎస్, మార్క్ గ్లాడ్ సన్ ఏవో, సింధూర మెడికల్ ఆఫీసర్, ఆర్. కవిత ఐసిడిఎస్ సూపర్వైజర్, ఫణి బాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.