ఎస్ ఎస్ సి ఉత్తీర్ణత తర్వాత పై చదువుల కొరకు అవగాహన కల్పించిన అధికారులు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఏ కోర్సులో చేరితే ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయో కెరీర్ పై అవగాహన కల్పించారు. చదువుపై శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పాఠశాల విద్యార్థి విద్యార్థులకు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి. సత్యనారాయణ ఎంపీడీవో, యు. ఉపేందర్ రావు జైపూర్ ఎస్సై, విద్యాసాగర్ రావు ఏఈ ఆర్డబ్ల్యూఎస్, మార్క్ గ్లాడ్ సన్ ఏవో, సింధూర మెడికల్ ఆఫీసర్, ఆర్. కవిత ఐసిడిఎస్ సూపర్వైజర్, ఫణి బాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *