ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు : నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

“ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు” నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

నర్సంపేటకు పెద్ద బిడ్డగా ఉంటా ..

ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత.

నర్సంపేటలో భారీగా ర్యాలీ రోడ్‌ షో

వేలాదిగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు

నర్సంపేట, నేటిధాత్రి : మహాబూబాబాద్‌ పార్లమెంటు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోరుతూ నర్సంపేట నియోజకవర్గస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భారీగా ర్యాలీ, రోడ్డు షో నిర్వహించారు. మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు రోడ్డు షోలో పాల్గొని కోలాటాలు, డప్పుచప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందఠంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పదహారు సీట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశ రాజకీయాల్లో కీలకం కానున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకులకు ముందు సమన్వయం లేకపోవడం వలనే ప్రచారాలు కూడా చేసుకోలేక పోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం బలవంతంగా సీటు కేటాయించాలని పత్రికల ప్రకటనలు బలరామ్‌నాయక్‌ చెసుకుంటున్నారని తెలిపారు. ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారని, ఎన్నికల్లో మాలోతు కవిత గెలుపు ఖాయమని అన్నారు.ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పార్టీ గెలుపు కోసం కషి చేయాలని సూచించారు .

పార్లమెంట్‌ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గానికి పెద్ద బిడ్డగా ఉంటానని తెలిపారు. ఆడబిడ్డగా ఆదరించి ఓట్లు వేయాలని కోరారు .నర్సంపేట నియోజకవర్గ అభివద్ధి కోసం నర్సంపేట కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపాల్టీ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ పొన్నం మొగిలి, టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి సానబోయిన రాజకుమార్‌, మనోహర రెడ్డి, సంజీవరెడ్డి, రాణా ప్రతాప్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడి, గుంటి కిషన్‌, పుట్టపాక కుమారస్వామి, దార్ల రమాదేవి, ఆకుల శ్రీనివాస్‌, బానోతు సారంగపాణి, అజయ్‌ కుమార్‌, రాయిడి రవీందర్‌రెడ్డిలతోపాటు అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతిధులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *