Headlines

అప్పగించిన పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయండి

అప్పగించిన పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయండి

వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

విధి నిర్వహణలో భాగంగా అధికారులకు చేయాల్సిన విధుల పట్ల నిర్ణీత గడువులో పూర్తి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.

 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం పెండింగ్ లో వున్న దర్యాప్తు కేసులు, వివిధ కేసుల్లో మెడికల్, రిపోర్ట్స్, పోస్తుమార్టం , ఏఫ్.ఎస్.ఎల్, డయల్ 100, సన్నిహిత పిటిషన్లుతో పాటు ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్దు ప్రమాదాల నివారణ, బ్లాక్ స్పాట్స్ పై విశ్లేషణ , దోంగతనాల నియంత్రణ మరియు సైబర్ నేరాలపై అవగాహన, కేసుల నమోదు తీరుతెన్నులపై వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పెండింగ్ లోని నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకుగాను అవలంబించాల్సిన తీరు పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. 

డిసిపిలు, అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అధికారులు పోలీస్ స్టేషన్ లొ నమోదయ్యే కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనసరించి దర్యాప్తు చేయాల్సి అవసరం వుండని. ముఖ్యంగా నేరస్తుడి నేరాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించడం కోసం అధికారులు వ్యక్తిగత శ్రధ్దతో విధులుబనిర్వహించాల్సి వుంటుంది.కేసు సంబంధించి పోలీస్ అనుబంధ విభాగాల నుండి అందాల్సిన పత్రాలు రావడంలో ఆలస్యం జరిగితే నా దృష్టికి తీసుకరావాలని. ముఖ్యంగా ప్రజావాణి సందర్బంగా ప్రజలు చేసే ఫిర్యాదులపై అధికారులు త్వరితగతిన పూర్తిచేసి సమగ్రమైన నివేదిక అందజేయాలని. రోడ్డుప్రమాదాల నివారణకై అధికారులు ప్రత్యేక శ్రద్ద కనబర్చడంతో పాటు రోడ్దు ప్రమాదాలకు గల కారణలపై పోలీస్ అధికారులు సంబంధిత అధికారులతొ విశ్లేషణ చేసి తగుచర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో డిసిపిలు అశోక్ కుమార్, వెంకటలక్ష్మి , సీతారాం, అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *