Unanimous Selection in Gokul Village
ఊరంతా కలిసి..
ఏకగ్రీవం చేశారు.
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికలు వేడెక్కాయి. పలు గ్రామాల్లో పోటీతత్వం ఉన్నప్పటికీ కొన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో గ్రామానికి చెందిన పాతూరి భాను ప్రసాద్ రెడ్డి ని గ్రామస్తులంత ఏకమై ఏకగ్రీవం చేశారు. ఈ సందర్భంగా భాను ప్రసాద్ మాట్లాడుతూ.. చిన్న వయసులోని ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
