Disability Can’t Stop Determination: Narsinlu
అంగ వైకల్యం శరీరానికే, మనోధైర్యానికి కాదు: నర్సింలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణ కేంద్రంలోని కె పెతినిక్ హోటల్ లో కొనిటీ నర్సింలు ఎం.ఏ (తెలుగు), ఎల్.ఎల్.బి పూర్తి చేసిన సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ జేఏసీ జహీరాబాద్ చెర్మెన్ డా.పెద్ద గొల్ల నారాయణ, నర్సింలును సన్మానించి, “అంగ వైకల్యం శరీరానికే గానీ, మనోధైర్యానికి కాదు” అని అన్నారు. చిన్నప్పటి నుంచీ అంగ వైకల్యంతో బాధపడుతున్నా, విద్యాప్రేమ, పట్టుదలతో నర్సింలు రెగ్యులర్ డిగ్రీ, ఎం.ఏ తెలుగు, ఎల్.ఎల్.బి. విద్యను విజయవంతంగా పూర్తి చేశారని, ఆయన యువతకు ఆదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు బీసీ జేఏసీ, జాగో తెలంగాణ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
