తెలంగాణ జన సమితి పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి నేటిదాత్రి : తెలంగాణ జన సమితి 6 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ ,అంబేద్కర్. తెలంగాణ జాతిపిత జయశంకర్ చిత్రపటాల కు పూలమాల వేసి నివాళులర్పించిన టి.జె.ఎస్ జిల్లా అధ్యక్షులు య౦ఏ ఖాదర్ పాష అర్పించారు
ఈ సందర్భంగా ఖాదర్ మాట్లాడుతూ.
గత 5 సంవత్సరాలుగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి.
డబ్బులే కేంద్రంగా జరుగుతున్న నేటి రాజకీయాల్లో తెలంగాణ జన సమితి మాత్రం ప్రజలతో మమేకమై, ప్రజల సమస్యలను నిరంతరం రాజకీయ ఎజెండా మీద నీలపగలిగిందని. అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద అవిశ్రాంత పోరాటం చేసి.. భూనిర్వాసితుల పక్షాన 317 జీవో పై పోరాడి వారికి ధైర్యంగా జన సమితి నిలబడింది
ప్రజలు ఎదర్కొన్న అనేక సమస్యల మీద స్పందించి, వాటిని రాజకీయ ఎజెండా మీద నిలపడంలో జన సమితి ప్రధాన పాత్ర వహించింది.
ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్య మీద లోతుగా అధ్యయనం చేసి అనేక సదస్సులు నిర్వహించి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఎజెండా మీద నిలిపిందని అన్నారు
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడగల ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి, రాబోయే రోజుల్లో పైసల రాజకీయాలను అధిగమించాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని, టి.జె.ఎస్ శ్రేణులకు ఖాదర్ అన్నారు .
ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కె బాలకృష్ణ.
జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ శెట్టి
మండల అధ్యక్షులు పిక్కిలి బాలయ్య. వినోద్ కుమార్. రాము షేక్ సోప్ అలీ . పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!