భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల గణ సర్వే చేయిస్తున్న వాటిలో కొంత మంది కాటిపాపల,బాలసంత కులస్థులు బెడ బుడగ జంగం కులానికి చెందిన వారమని తప్పుగా ఇంటి కి వచ్చిన కుల గణ సర్వే అధికారులకు చెప్పివ్రాయిస్థున వాటిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ టేకుమట్ల మండల తహశీల్దార్ విజయలక్ష్మి చొరవ చూపి అస్లైన్లో చేయవద్దని, అలాగే 59 ఉప కులస్థులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య కోరారు.
శని వారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లమండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు అరకొండ రాజయ్య అద్యక్షతన తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు అనంతరం ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ గతంలో కాటిపాపల బాలసంత కులస్థులు బిసి కులానికి వస్తారని ,వారే ఇప్పుడు సర్వే అధికారులకు మేమే బెడ బుడగ జంగం కులానికి చెందిన వారమని తప్పుగా కులం పేరు చెప్పి వ్రాయిస్తున్నారని తెలిపారు. . వారు బిసి కులానికి చెందిన వారని బెడ్ బుడగ జంగం కాదని గతంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు ర్యాలీలు నిర్వహించి సంబంధించిన అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని అన్నారు. కానీ బెడ్ బుడగ జంగం కులస్థులు ఎస్సీల కెటగిరికి వస్తారని,రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా బెడ బుడగ జంగం తక్కువ మంది ఉన్నాందున మేమే బెడ బుడగ జంగం కులస్థులమని వారికి వారే నిర్ణయం తీసుకున్నారని , కాలనీ లో బోర్డులు పెట్టుకున్నారని చెప్పారు. మండల , జిల్లా సంబంధించిన అధికారులను తప్పుదోవ పట్టించి రెవెన్యూ కార్యాలయాల నుంచి ఎస్సీ కులం పేరుతో సర్టిఫికేట్లు తిసుకున్నారని అన్నారు ఎస్సీ కులస్థులకు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలతో పాటు రిజర్వేషన్లను అడ్డుకుని వారిని దెబ్బ తీయాలని చూస్తున్నారని అన్నారు ఎస్సీ కులంలో 59 ఉప కులాలు ఉన్నాయని తెలిపారు టేకుమట్ల మండల తహశీల్దార్ విజయలక్ష్మి కుల గణ సర్వే లో తప్పుగా అధికారులు నమోదు చేసిన వాటిని తొలగించి వాటిని ఆన్లైన్ చేయకుండా సర్వే అధికారులపై చర్య తీసుకోవాలి డిమాండ్ చేశారు అసలైన కులం పేరు ఆన్లైన్ చేయించి అసలైన బెడ బుడగ జంగం కులస్థులకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మారపెల్లి కొంరయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ టౌన్ అద్యక్షుడు మచ్చ ప్రభాకర్ మాజీ ఉప సర్పంచ్ మచ్చ రాజయ్య ,బండ సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.