2K Run for Unity Held in Veernavanka
పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 2కే రన్ విజయవంతం
వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:
వీణవంక మండలకేంద్రంలో పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31వ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎక్తా దివాస్ ను పురస్కరించుకొని పోలీసు విభాగం ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ,ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన తాసిల్దార్ అనుపమ రావు పచ్చ జెండా ఊపి వీణవంక నుండి నర్సింగాపూర్ గ్రామం వరకు 2కే రన్ ప్రారంభించారు

దేశ ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని ప్రతిబింబించే విధంగా స్ఫూర్తితో మన దేశం అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,విద్యార్థులు, మండల నాయకులు, పత్రికా మిత్రులు పోలీస్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.
