పొలిటికల్‌ హోం గార్డు డ్యూటీకి రెడీనా!?

`కోమటి రెడ్డి దారికొచ్చారా! దారికి తెచ్చారా!!

`కోమటి రెడ్డి మనసు మార్చుకున్నారా?

` గాంధీ భవన్‌ మెట్లెక్కనన్న వెంకట రెడ్డి వచ్చారు…

` రేవంత్‌ రెడ్డి ని కలిశారు?

`పార్టీ బలోపేతంపై చర్చించారు?

`మళ్ళీ ముసిముసి నవ్వులు కురిపించారు?

` ఇతర సీనియర్లు అవాక్కయ్యారు?

` వెంకట రెడ్డికి మద్దతుగా నిలిచిన వాళ్లు డైలమాలో పడ్డారు?

` కోమటి రెడ్డిపై అదును చూసి కొండా సురేఖ విరుచుకుపడ్డారు?

`వెంకన్నను సస్పెండ్‌ చేయాలని పట్టుబడుతున్నారు?

`వెంకట రెడ్డికి వ్యతిరేక గళం పెరుగుతుందా?

` కోమటి రెడ్డి ఆత్మ రక్షణలో పడ్డారా?

` కేవలం రెడ్డి కావడం వల్లనే వెంకట రెడ్డికి చెల్లుతోందా?

` ఇంతకీ కాంగ్రెస్‌ లో ఏం జరుగుతోంది?

` రెడ్లు తప్పు చేసినా మాఫ్‌ చేస్తారా?

`ఇతర వర్గాల మాటకు విలువలేదా?

`విరుచుకుపడడం…సర్థుకుపోవడం అంతా రెడ్ల ఇష్టమే…నా?

`వెంకట రెడ్డి సారీ చెప్పాల్సిన పని లేదా?

`బంతి తన కోర్టుకొచ్చింది!….రేవంత్‌ రెడ్డి చాలనుకుంటున్నాడా…!!

`కొత్త ఇన్చార్జ్‌ ఎటు వైపు అన్నది కాదు?

`సర్థుబాటు చేయడమా? సరిదిద్దడమా!?

`సీనియర్లు దారికొచ్చినట్లేనా!

`జూనియర్లతో సఖ్యత సాగేనా!!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 నేనంటే…నేనే…నాకంటే ఎక్కువ ఎవరు? లేరు! నా అంత త్యాగధనలు ఎవరూ కాంగ్రెస్‌ పార్టీలో లేరు…తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవికి రాజీనామా చేశాను…పిసిసి ప్రెసిడెంటు కావడానికి అన్నీ అర్హతలున్న నాయకుడిని…నన్ను పిపిసి అధ్యక్షుడిని చేస్తే నా తఢాకా చూపిస్తా….నేనేంటో చూపిస్తా…నా రాజకీయ అనుభవం రంగరిస్తా…తెలంగాణ మొత్తం కదిలిస్తా…పార్టీ శ్రేణులను ఏకం చేస్తా…తెలంగాణలో వున్న కాంగ్రెస్‌ నాయకులందరినీ నేను గుర్తుపడతాను…నన్ను అందరూ ఓన్‌ చేసుకుంటారు…నాకే పిపిసి…నేనే పిపిసి…! ఇలా అనుకోవడం…కలలు గనడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అలవాటైనట్లుంది…ఆ ఆశలు తీరడం మాట దేవుడెరుగు? మాట మీద నిలబడని నాయకుడౌతున్నాడు…ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాని నాయకుడౌతున్నాడు…అందరి చేత ఒకనాడు శభాష్‌ అనిపించుకున్న వెంకన్న…నిత్యం తిట్లు పడుతున్నాడు…శాపనార్ధాలు పడుతున్నాడు…అవమానాలు ఎదుర్కొంటున్నాడు…కానీ…ఇదంతా స్వయం కృతాపరాధమే…తనుకు తానుగా చేసుకున్నదే…అహం చూపిన దారిలో కోమటిరెడ్డి సోదరులు నడవడమే…తమకు తాము గొప్పగా ఊహించుకోవడమే…తమకంటే ఎవరూ ఎక్కువ కాదన్న అహంభావం ప్రతి క్షణం మదిలో నింపుకోవడమే…ఈ మోసానికి కారణం వ్యక్తిగత స్వార్ధమే…అయినా ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మారిండని ఎవరూ అనుకోవడం లేదు…అసలు గాంధీ భవన్‌ మెట్లు కూడా ఎక్కనని చేసిన శథపం ఏమైంది…ఒట్టు తీసి గట్టున పెట్టేశాడా? మళ్లీ మనసు మార్చుకొని పాత పాటే పాడుతాడా? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతాడా? అన్న సందేహం మాత్రం అందిరిలోనూ మెదలుతోంది. ఇంతకీ కోమటిరెడ్డిలో వచ్చిన మార్పుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిజేపి దారులు మూసుకున్నాయన్నది కొందరు చెప్పే మాట….ఇంత చేస్తే బిజేపిలో తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని లెక్క చేస్తున్నవారే లేరక్కడ! అన్నది మరో మాట…తాను కూడా బిజేపిలో చేరి వున్న పరువు తీసుకోవడం…రాజకీయ భవిష్యత్తు అంధకారం చేసుకోవడం కన్నా, కాంగ్రెస్‌లో వుండి ఈ మాత్రం పరువు కాపాడుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఆవేశం ఎన్ని అనర్ధాలను తెచ్చిపెడుతుందో అర్ధమైనట్లుంది….అయితే ఇప్పటికైనా వెంకటరెడ్డికి తత్వం బోధపడిరదని అనుకోవచ్చో…లేదో మాత్రం ఎవరికీ అర్ధం కావడంలేదు….

 ఓ దశలో పిపిసి ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ వెంకటరెడ్డి, మేం హోంగార్డులమా అంటూ ఫైర్‌ అయ్యారు. 

కాని ఇప్పుడు అదంతా బుస్సు…బుస్సు..తుస్సు…తుస్సే అని నిరూపించారు. నిజంగా మాటా మీద నిలబడే వ్యక్తిత్వమే వెంకటరెడ్డిది అయితే పదవి కోసం ఇంతలా పాకులాడాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం మంత్రి పదవే వదలుకున్నానన్నప్పుడు పార్టీ పదవులు అంతకన్నా పెదవి కాదు…పైగా గాంధీ భవన్‌లో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా మరీ విచిత్రంగా వున్నాయి….కాంగ్రెస్‌ పార్టీలో జిల్లా అధ్యక్షులకు పార్టీయే అవసరమైన మేరకు నిధులు సమకూర్చాలని ఉచిత సలహా ఒకటి పడేశారు…ఒక జాతీయ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులకు పార్టీ నిధులు పంపించే తప్ప పార్టీ నడిచే స్ధితిలో వుందన్న సంకేతాలు పంపడం అంటే అర్ధమేమిటి? పార్టీ దీన స్ధితిలో వుందన్న సత్యాన్ని చెప్పడంలో ఆంతర్యమేమిటి? కనీసం బస్సు కిరాయలు కూడా లేని వారిని డిసిసి అధ్యక్షులు చేయాలని సూచించెందెవరు? సరే పార్టీయే ఆదుకోవాలన్న మాటను ఒప్పుకున్నా…వారికి సాయం చేయడానికి తానెంత సహకరిస్తానో అన్నది మాత్రం వెంకటరెడ్డి చెప్పలేదు. పార్టీమీద తోసేసి, పార్టీని బలోపేతం చేసే బాధ్యత పిపిసిదే అని తప్పుకుంటే సరిపోతందా? సీనియర్‌గా ఆయనకు బాధ్యత లేదా? తనవ ంతు సాయం చేస్తానని చెప్పడం అవరసరం లేదా? ఇంకా కోమటి రెడ్డి మారరా? అని ప్రశ్నిస్తున్నవారు కూడా వున్నారు…

    కోవటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి కొండాసురేఖ సంచనల వ్యాఖ్యలు చేశారు.

 ఆమె చేసిన డిమాండ్‌లో కూడా న్యాయం వుందనే చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందే ఆ కుటుంబం. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి, బలపడిన తర్వాత రాజగోపాల్‌రెడ్డి చేసిందేమిటో! అందరికీ తెలుసు. అలాంటి నాయకుడికి అన్నగా మద్దతు తెలుపుతూ…కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేసిన నాయకుడు వెంకటరెడ్డి. మునుగోడు ఎన్నికల ముందు వెంకటరెడ్డి చేసిన ప్రచారం ఎలాంటిదో చూశాం….అసలు కాంగ్రెస్‌పార్టీకి తెలంగాణలో ఉనికే లేదన్నంతగా వెంకటరెడ్డి కూడా మాట్లాడాడు…నిన్నటిదాకా గోడమీద పిల్లిగా వున్నాడు…ఇప్పుడు తత్వం బోధ పడి దారికొచ్చారు…! అయితే తాను హోంగార్డు డ్యూటీకి సిద్ధమని ఒప్పుకున్నట్లేనా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమౌతోంది…ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. కోమటిరెడ్డి తిరుగుబాటులో గట్టిగా వున్నారన్న నమ్మకంతో పాపం సీనియర్లు ఎంతో మంది ఆయనకు మాట మద్దతునిచ్చారు. కోమటిరెడ్డిని బలపర్చారు. రేవంత్‌ రెడ్డి మీద నిత్య అసమ్మతి వాదులుగా ముద్ర పడ్డారు. అంతే కాదు కోవర్టులుగా కూడా పిలిపించుకుంటున్నారు. మరి అలాంటి నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది. నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సపోర్టుగా నిలిచిన వారిలో అనేక మంది సీనియర్లు వున్నారు. వారిలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డిలుకూడా వున్నారు. మరో సీనియర్‌ నాయకుడు హనుమంత రావు ఎంతో గట్టిగా వెంకటరెడ్డికి మద్దతుగా నిలిచారు. కాని వాళ్లంతా ఇప్పుడు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్‌ మెట్లెక్కారు…రేవంత్‌రెడ్డిని కలిశారు… పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు…ఇదంతా నమ్మశక్యంగా వుందా? అంటే నమ్మాలి…నాయకులు,కార్యకర్తలు పిచ్చోళ్లు కావాలి…ఇదేనా కాంగ్రెస్‌ రాజకీయం…!

రెడ్డీలకే ఈ వెసులుబాటు వుంటుందా? 

అన్న పార్టీలో సర్వత్రా వినిపిస్తోంది. ఇతర సామాజిక వర్గాల నేతలకు లేని ప్రాధాన్యత ఒక్క రెడ్డి వర్గానికికే కాంగ్రెస్‌లో ఇంతలా ఎందుకు పెరిగిపోయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెడ్డి…రెడ్డి ఎంత పెద్ద మాటలు అనుకున్నా! కలిసిపోతారు…కలిసి సాగుతారు….ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు…అన్నీ మర్చీపోతారా? పార్టీ కంటే వారికి వ్యక్తిగత సాన్నిహిత్యాలే అవసరమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అవమానిస్తున్నవారిలో ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువ. అయినా వారిపై రేవంత్‌రెడ్డికి ప్రేమ ఎక్కువ. ఇంత జరిగినా రేపటి రోజు మనం బరం పురం అన్నట్లు వాళ్లు చెప్పిన నేతలకు పదవుల కోసం అందరూ కలిసి ఒక్కటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు…కాని పార్టీ కోసం పనిచేస్న్నువారికి ఇలాంటి నేతలు ఇస్తున్న సందేశం ఏమిటన్నదానిపై కూడా ప్రజలు గమనిస్తారన్నది మర్చిపోయారు…పార్టీ అధికారంలోకి రావాలన్న ఆలోచన అసలు కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు. కష్టపడి పనిచేద్దామన్న సోయి లేదు… కలిసికట్టుగా వుందామన్న ఐకమత్యం లేదు…పొరుగున కర్నటకలో పార్టీ బలోపేతంపై అనేక వార్తలు వస్తున్నాయి. అక్కడి నేతలను చూసైనా మారుదామన్న ఆలోచన ఎవరూ చేయడం లేదు…విబేధాలు…సహజం…పైకి రాజకీయాలు అసహజం…అంతా ఆ తాను ముక్కలే…అంతా ఒక్కటే…కాని ఎవరికి వారే…యమునా తీరే…ఇదే కాంగ్రెస్‌ తీరు…ఎవరు మార్చినా మారరు…ఎంత మంది ఇన్‌చార్జిలొచ్చినా..వారు మారాల్సిందే గాని, వీళ్లు మారరు…పార్టీని బతికి బట్ట కట్టనివ్వరు…అందతే…!

చమురు సంస్థల స్థాపనలో భద్రతే కీలకం

స్టడీ టూర్ లో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు 

గోవాలోని ప్రఖ్యాత శిక్షణా కేంద్రం సందర్శన

ఖమ్మం, జనవరి, 23:

ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో చమురు సంస్థల స్థాపనలో భద్రత, రక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని.. వీటి విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని రాజ్యసభ ఎంపీ, పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా సూచించారు. పెట్రోలియం సహజవాయువు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అధ్యయన యాత్రలో భాగంగా చివరి రోజు కమిటీ సభ్యులు గోవాలో పర్యటించారు. కమిటీ చైర్మన్ రమేష్ బిధూరి నేతృత్వంలో సభ్యుల బృందం గోవాలో ప్రతిష్టాత్మక ఓ ఎన్ జీసీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రఖ్యాత IPSHEM శిక్షణా కేంద్రాన్ని సందర్శించింది. అక్కడ పలు చమురు కంపెనీల ప్రతినిధులు, వాటి నిపుణులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోని చమురు సంస్థల్లో ఇప్పటికే అమలవుతున్న భద్రత, రక్షణా చర్యలపై సమీక్షించారు. అనంతరం కమిటీ సభ్యులు పలు సూచనలు చేసి వాటి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యయన యాత్ర ముగించుకుని ఎంపీ రవిచంద్ర రాత్రికి హైదరాబాద్ నగరం చేరుకున్నారు.

వారసులు కాదు…సైనికులు!

హైదరాబదాద్‌,నేటిధాత్రి:  

వాళ్లు వారసులు కాదు…సైనికులు…అవును…తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో ఆ నలుగురు వున్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను విశ్వవ్యాప్తం చేయడంలో ముందున్నారు. తెలంగాణ ఉద్యమ రూపాలను, స్వరూపాలను భుజాన కెత్తుకున్నారు. దశాబ్ధ కాలం పాటు అవిశ్రాంత పోరాటం చేశారు. రాజకీయాల కోసం ఏం మాట్లాడినా చెల్లుతుందన్న భావనతో కొందరు కుత్సిన నాయకులు చేసే వ్యాఖ్యలు పక్కన పెడితే, ఉద్యమ రాజకీయ, పోరాట పంధాను ఎంచుకొని వారు సాగించిన పోరాటం అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరు ఒక్కొరకంగా తెలంగాణ ఉద్యమాన్ని పరివ్యాప్తం చేయడం కోసం విశేష కృషి చేశారు. ఆ నలుగురు… పార్టీకి నాలుగు మూల స్ధంభాలు. కల్వకుంట్ల తారక రామారావు,హరీష్‌రావు, కవిత,సంతోష్‌రావు. వీళ్లను రాజకీయ వారసులు అంటే ఏ తెలంగాణ వాది ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్లు పార్టీకి క్రమశిక్షణ గల సైనికులుగా పనిచేశారు. ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ విధాత, ప్రగతి ప్రధాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనో బలం ఆ నలుగురు. తెలంగాణ ప్రగతి కాంక్షకు వారు ప్రతీకలు. తెలంగాణ ఉద్యమ ప్రస్ధానం ఉవ్వెత్తున సాగేందుకు సహకరించారు. ఒక్కొక్క అడుగు తెలంగాణ కోసం వేశారు. తెలంగాణ కోసమే తమ జీవితాలను మమేకం చేసుకొని దశాబ్ద కాలం పాటు ఉద్యమానికి అంకితమయ్యారు. ఉద్యమమే ఊపిరిగా బతికారు. అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వారి గురించి ఆసక్తికరమైన విషయాలు అనేకం వెళ్లడిరచారు. ఒక ఉద్యమకారుడు మరో ఉద్యమ కారుడికి కితాబివ్వడం అంటేనే గొప్ప విషయం. తాను ఓ సీనియర్‌ నాయకుడిగా, సీనియర్‌ ఎమ్మెల్యేగా, క్రియాశీలక తెలంగాణ ఉద్యమ కారుడిగా, పోరాటయోధుడుగా, ప్రస్తుతం మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న కొప్పుల ఈశ్వర్‌ ఆ నలుగురు ఉద్యమ ప్రస్ధానంపె నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుకు చెప్పిన ఆసక్తికరమైన వివరాలు ఆయన మాటల్లోనే పాఠకుల కోసం….

కేటిఆర్‌…ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో డైనమిక్‌ మంత్రి, యువకుడు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురించి ఈ తరం ప్రజలకు తెలియాల్సిన విషయాలు అనేకం వున్నాయి. ఉన్నత విద్యావంతుడు. పైగా సమాజం మీద ఎంతో అవగాహన వున్న నాయకుడు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసిన నాయకుడు. మన రాష్ట్రంలో ఎలాంటి ప్రగతి కావాలో తెలిసిన నాయకుడు. ప్రజలకు ఎలాంటి పథకాలు కావాలో అవగాహన వున్న నాయకుడు. ముఖ్యంగా తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న నాయకుడు. పురపాలికలను పరుగులు పెట్టిస్తున్న ప్రగతి సాధకుడు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, మన దేశంలోనే ఇంతటి డైనమిజమ్‌ వున్న నాయకుడు మరొకరు లేరు. ఆయన ఆంగీకం, వాచకం, పెద్దట పట్ల ఆయనకుండే గౌరవం గురించి కూడ చెప్పుకోవాలి. అనేక బాషలలో ఆయన దిట్ట. అనర్గళంగా సాత్విక తెలుగు బాషే కాదు, తెలంగాణ యాసతోపాటు, గ్రాంధికం కూడా మాట్లాడడంలో దిట్ట. ఇక ఇంగ్లీషు బాషలో మంచి పట్టున్న నాయకుడు. జాతీయ భాష హిందీతోపాటు, ఉర్ధూలో కూడా గుక్క తిప్పుకోకుండా మాట్లేడేవక్త. ఎక్కడికెళ్తే అక్కడ ఆ ప్రజలకు అర్ధమయ్యే భాషలో మాట్లాడడం కేటిఆర్‌కే చెల్లింది. ఈ తరం యువ నాయకుల్లో ఇంత పరిణతి వున్న నాయకుడు మరొకరు కనిపంచరు. ఎంత ఎదిగినా ఒదిగి వుండే నాయకుడు కేటిఆర్‌. అమెరికాలో ఉన్నతమైన ఉద్యోగం. విలాసవంతమైన జీవితం. అయినా అవేమీ ఆయనకు నచ్చలేదు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టం చూసి ఆయన కూడా చలించిపోయారు. తెలంగాణ ప్రజలు నిత్యం అర్ధాకలితో బతుకుతూ, సాగు కష్టమై, ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తూ, అభివృద్ధిలో వివక్షను ఎదుర్కొంటూ, అన్ని రంగాల్లో వెనకబాటును అనుభవిస్తున్న తెలంగాణ కోసం నావంతు కృషి నేను చేస్తానని వచ్చారు. తెలంగాణ ఉద్యమానికి తోడుగా నిలిచారు. ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించారు. అమెరికా జీవితాన్ని వదిలేసి వచ్చి, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. ఎండనక, వాననక, పగలు,రాత్రి లేడా లేకుండా ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో ఉద్యమ సైనికుడిగా నిరంతరం ఉద్యమంలో మమేకమై ప్రజల్లో చైతన్యం నింపారు. తెలంగాణ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. తండ్రి కేసిఆర్‌ సాగిస్తున్న తెలంగాణ ఉద్యమంలో తాను భాగస్వామ్యమై ఉద్యమాన్ని, పోరాటాన్ని వారసత్వంగా పుచ్చుకున్నాడు. పోరాట యోధుడు అనిపించుకున్నాడు. తెలంగాణ ఉద్యమం ఒక యజ్ఞంలా సాగించిన వారిలో కేటిఆర్‌ ఒకరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడూ తాను కేసిఆర్‌ కొడుకును అన్నది ఎక్కడా కనిపించకుండా, సామాన్యుడిగా ప్రజలతో మమేకమైన నాయకుడు కేటిఆర్‌. ఉద్యమ సమయంలో అనేక సార్లు నిర్భందాలను ఎదుర్కొని, జైలుకెళ్లిన సందర్భాలు అనేకం వున్నాయి. తాను కేసిఆర్‌ కుమారుడైనా, ఉద్యమ నాయకత్వపాత్రతోనే తన అస్ధిత్వాన్ని నిరూపించుకున్న నాయకుడు కేటిఆర్‌. 2014 వరకు ఆయన సామాన్యకార్యకర్తగానే వ్యవహరించేవారు. కేటిఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఒకరుగానే మసలుకున్నారే గాని, తాను గొప్ప అన్నది ఎక్కడా చూపించుకోలేదు. తెలంగాణలో ఉద్యమ కాలంలో జరిగిన వంటా వార్పు వంటి వినూత్నమైన కార్యక్రమాల నిర్వహనలో కేటిఆర్‌ ముందు వరసలో వున్నారు. అందరికంటే ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాల నిర్వహన చేపట్టారు. అంతే కాదు కేటిఆర్‌ సతీమణి శైలిమ, కేటిఆర్‌ మాతృమూర్తి శోభమ్మ, చివరికి చిన్న పిల్లాడైన హిమాన్షును వంటా వార్పు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ విషయం చాల మందికి తెలియదు. మొత్తం కుటుంబం తెలంగాణ ఉద్యమానికి అంకితమైంది. టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు అయిన తర్వాత పార్టీ కార్యకర్తల శ్రేయస్సును కూడా చూసుకున్నాడు. రాజకీయం అంటే కనీస అవగాహన, అర్ధం కూడా తెలియని వాళ్లు ఎంతోమంది మిడిసిపడుతున్న రోజులవి. కాని కేటిఆర్‌ ఎంత ఎదిగినా, ఎంత ఒదిగి వుంటారో ప్రజలకు తెలుసు. ఒక్కసారి ఆయన ప్రజల్లో మమేకమైన తీరును చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రజల్లో ఎంతో అవలీలగా కలిసిపోతారు. అది ఉద్యమ స్వరూపం నేర్పిన మంచి ఆదర్శంలో ఒకటని కూడా చెప్పొచ్చు. ఇక మంత్రిగా జిల్లా పర్యటనల్లో వున్నప్పుడు ప్రభుత్వం తరుపున అందుతున్న పధకాలపై కూడా ఆయన నేరుగా ప్రజల స్పందన తెలుసుకుంటారు. కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో ఇళ్లనుంచి బైటకు రావడానికి ఎంతోమంది జంకిన సమయంలో మంత్రిగా, కేటిఆర్‌ చూపిన చొరవ సామాన్యమైంది కాదు. ఉద్యమ సమయంలో ఎంత ధైర్యంతో పోరాటం చేశారో…కరోనా సమయంలో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు భరోసా నింపడం కోసం పనిచేశారు. ప్రజలకు వైద్యం అందేందకు కృషి చేశారు. ప్రజలను ఇళ్లనుంచి బైటకు రావొద్దని ప్రభుత్వం తరుపున చెప్పి, వారికి అవసరమైన సదుపాయల కల్పనను స్వయంగా పర్యవేక్షించిన ఏకైక నాయకుడు కేటిఆర్‌. మేం కూడా ప్రజలకు ఆ సమయంలో ఎంతో చేసినా, కేటిఆర్‌ చూపించిన తెగువ మాత్రం అనితరసాధ్యమైంది. అర్ధరాత్రి కరోనా సమయంలో ఓ బిడ్డ పాల కోసం ఏడుస్తున్నాడని తెలిసి, జిహెచ్‌ఎంసి డిప్యూటీమేయర్‌ను పంపి వారికి పాలు అందించిన మానవతా మూర్తిగా అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. అందుకే ఆయనను యువత డైనమిక్‌ లీడర్‌ అంటారు. నిజానికి తెలంగాణ ఉద్యమం ఉదృతమైన తర్వాత జాతీయ స్ధాయిలో తెలంగాణ ఉద్యమానికి అవసరమైన చేదోడు వాదోడుగా కేసిఆర్‌కు ఉన్నత విద్యావంతుడైన ఉద్యమకారుడు అవసరమయ్యాడు. ప్రపంచ జ్ఞానం మెండుగా వుండడమే కాదు, ప్రపంచ దేశాలలో ఏం జరుగుతోందన్న దానిపై పూర్తి స్ధాయి అవగాహన వున్న నాయకుడు కేటిఆర్‌. అందుకే దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు తెలంగాణ ఉద్యమానికి అవసరమైనప్పుడు కేటిఆర్‌ ఆ రకంగా కూడా కృషి చేశారు. ఇటు క్షేత్ర స్ధాయిలో ఉద్యమం..మరో వైపు దేశ వ్యాప్తంగా నాయకులతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని గురించి విశదీకరించే పని కూడా కేటిఆర్‌ చూసుకోవడం జరిగింది. అంతే కాని ఉన్న ఫళంగా వచ్చి కుర్చీలో కూర్చోలేదు. ప్రజల ఆశీర్వాదంతో ఎదిగారు. ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నారు. గొప్ప నేతగా ఎదిగారు.

హరీష్‌రావు: ముఖ్యమంత్రి కేసిఆర్‌ అడుగు జాడల్లో నడుస్తూ, తెలంగాణ ఉద్యమ పోరాటంలో తొలి అడుగులు వేసిన ఉద్యమ సైనికుడు హరీష్‌రావు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడానికి ముందు కొన్ని నెలల ముందునుంచి సిద్దం చేసిన యాక్షన్‌ ప్లాన్‌లో భాగస్వామి హరీష్‌రావు. తొలి కార్యకర్త కూడా ఆయనే అని చెప్పాలి. అప్పటికే కేసిఆర్‌తో ఎంతో మంది మేధావులు కలిసి వచ్చినా పార్టీపరంగా క్రియాశీలకపాత్ర పోషించిన వారిలో హరీష్‌రావు మొదటి వ్యక్తి అనే చెప్పాలి. ఆ తర్వాతే ఎవరైనా అన్నది కూడా అందరికీ తెలిసిందే. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ కొన్ని నెలల పాటు సాగించిన చర్చలు, సంప్రదింపులు, అధ్యయనాలలో హరీష్‌రావు సహాకారం చాలా విలువైంది. కేసిఆర్‌ చెప్పిన ప్రతి పనిని తుచ తప్పకుండా అనుసరించి, పాటించి అమలు చేసిన నాయకుడు హరీష్‌రావు. సహజంగా యుక్త వయసులో ఏ వ్యక్తికైనా తన వ్యక్తి గత జీవితం, సంతోషం, సరదాలు మీద కలలు కంటుంటారు. కాని హరీష్‌రావు జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమమే కనిపిస్తుంది. తెలంగాణ ఆకాంక్షనే వుంటుంది. నిజానికి ఆయనకు ఊహ తెలిసినప్పటికే తెలంగాణ భావన మది మొత్తం నిండిపోయింది. ఆది నుంచి కేసిఆర్‌తో వుండడం, ఆయనతో సాన్నిహిత్యం, కేసిఆర్‌భావజాలం చూస్తూ పెరిగిన వ్యక్తి హరీష్‌రావు. అందువల్ల ఆయనకు సహజంగానే తెలంగాణ అన్నది నరనరనా జీర్ణించుకుపోయి వుంటుంది. అందుకే ఎంతో గొప్ప గుణం, విభిన్నమైన మనస్తత్వం, ప్రజలతో మమేకమయ్యే జీవన విధానం అలవడిరది. అంతే కాదు అలాంటి జీవితాన్ని ఎంచుకోవాలంటే కూడా ఎంతో దైర్యం కావాలి. పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలి. అన్నింటికీ సిద్దపడి ముందుకు రావాలి. ఎంతో విజ్ఞత వుంటే తప్ప యుక్తవయసులో ఉద్యమ స్వరూపానికి తోడుగా నిలవడ లేరు. ఇక కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం పూర్తి స్దాయిలో మొదలుపెట్టాక, హరీష్‌రావు కూడా తన జీవితాన్ని ఉద్యమానికే అంకితం చేశాడు. విమర్శల కోసం ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా, హరీష్‌రావుసాగించిన ఉద్యమ ప్రస్ధానం ఇప్పటికీ, ఎప్పటికీ కళ్లముందు కదులుతూనే వుంటుంది. ఎప్పుడు ఇంటికి వెళ్లేవారో..ఎప్పుడు నిద్రపోయేవారో…ఎప్పుడు నియోజకవర్గంలో వుండేవారో…ఎప్పుడు ఉద్యమంలో పాల్గొనేవారో అంతా కలగా వుండేది. ఎక్కడ చూసినా హరీష్‌రావే కనిపించేవారు. ఎంత ఉద్యమం చేసినా ఏనాడు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అభివృద్ధి మా ప్రాంత హక్కు…తెలంగాణ మా జన్మ హక్కు అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు హరీష్‌రావు అని చెప్పడంలో సందేహంలేదు. తెలంగాణ ఉద్యమంలో నేనూ ఆది నుంచే వున్నప్పటికీ, మా పాత్ర జిల్లా వరకు, ఉత్తర తెలంగాణ వరకు పరిమితమైంది. కాని హరీష్‌రావు పాత్ర మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సాగింది. ప్రతి విషయాన్ని , సందర్భాన్ని స్వయంగా పంచుకున్న అనుభవం నాకు వుంది. ఉద్యమ ప్రస్ధానంలో ఎన్నికల బాధ్యత అన్నది ఎంతో కీలమైంది. దాన్ని హరీష్‌రావు ఎంత బాద్యతగా నిర్వర్తిస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం వేరు…ఉద్యమ కాలంలో ఎన్నికల ప్రచారం వేరు. అడుగుడుగునా ఆటంకాలు. తెలంగాణ ఉద్యమం లేదని నిరూపించే ప్రయత్నం చేసేవాళ్లు కాచుకొని కూర్చునే వాళ్లు… పైగా తెలంగాణలో కూడా తెలంగాణ వ్యతిరేకులు చేసే కుట్రలు… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భం కత్తి మీద సామే…ముఖ్యంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సందర్భాలలో హరీష్‌రావు పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. తాను రాజీనామా చేసినా, తన గెలుపే కాదు…మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకొని, ముందుకు నడిచిన నాయకుడు హరీష్‌రావు. ఏ మాత్రం బ్యాలెన్స్‌ తప్పినా పరిస్ధితులు తారుమారయ్యే అవకాశాలున్న రోజులవి. ప్రజలను ఎంతో నమ్మకంగా తెలంగాణ ఉద్యమం వైపు మళ్లిస్తున్న కాలంలో అటు తెలంగాణ వాదులు, ఇటు మేధావులతో మమేకమైన సాగడం అన్నది ఎంతో ఓర్పుతో కూడుకున్నది. అప్పటికే తెలంగాణ ఉద్యమాన్ని ఉప్‌మని ఊదేద్దామని చూసే వారూ చూస్తూనే వున్నారు. జలదృష్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడాన్ని కూడా జీర్ణించుకోలేని అప్పటి ప్రభుత్వం ఏకంగా ఆ నివాసాన్ని కూడా కూల్చేసింది. పార్టీకి నీడ లేకుండా చేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో కేసిఆర్‌ ముందకు సాగడంలో హరీష్‌రావు పోషించిన పాత్ర చాలా విలువైంది. ఏ మాత్రం అవకాశం చిక్కినా ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు , నాయకులను పలుచన చేద్దామని డేగ కళ్లతో అప్పటి పాలక, ప్రతిపక్ష పార్టీలు చూసేవి. వాటిని తట్టుకుంటూ, ఎదుర్కొంటూ, నాయకులను కాపాడుకుంటూ , వారి ఆటలు సాగకుండా పార్టీని సైతం రక్షించుకున్నవారిలో హరీష్‌రావు ఒకరు. టిఆర్‌ఎస్‌ పార్టీ టిక్కెట్టు మీద గెలిచి, తెలంగాణ వాద ముసగు వదిలసే ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్లు కూడా వున్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా వుండడంలో హరీష్‌రావు క్రియాశీలకపాత్ర పోషించారు. అనేక మందిని పార్టీలోకి తీసుకురావడంలో కూడా ఎంతో కృషి చేశారు. అందుకే ఆయనను ట్రబుల్‌షూటర్‌ అంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటన తర్వాత వచ్చిన తొలి స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలో కేసిఆర్‌ విసృతం ప్రచారంలో వుంటే, హరీష్‌రావు ఊరూర తెలంగాణ జెండా ఎగరేసే పనిలో నిమగ్నమై, పార్టీ ఊరూరికి విస్తరించడంలో హరీష్‌రావు బలమైన ముద్ర వేశారు. మొదటిసారి కేసిఆర్‌ సిద్దిపేట నుంచి వరంగల్‌కు సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఆ సమయంలో ముందు ప్రతి ఊరిలో హరీష్‌రావు పార్టీ జెండా ఆవిష్కరిస్తూ వెళ్లడం, కేసిఆర్‌ సైకిల్‌ యాత్ర సాగడం ఇప్పటికీ నాటి ఉద్యమారులకు గుర్తే వుంటుంది. ఆ తర్వాత సభల నిర్వహణ బాధ్యతలు కూడా హరీష్‌రావు మీదే పడేది. తొలిసారి కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సింహ గర్జన్‌ దగ్గర నుంచి మొన్న జరిగిన ఖమ్మం బిఆర్‌ఎస్‌ తొల సభ వరకు ఆయన చేపట్టిన సభలన్నీ విజయవంతమైనవే. ఇక వరంగల్‌లో మహాగర్జన పేరుతో సుమారు 15 లక్షల మందితో సభ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ఆ సభ ఒక చరిత్ర. భవిష్యత్తులో కూడా అలాంటి సభల నిర్వహన ఎవరూ చేయలేదు. అలాంటి గొప్ప సభల ఏర్పాటులో హరీష్‌రావు తీసుకున్న చొరవను అందరూ ప్రశంసించాల్సిందే…ఉద్యమ ప్రస్ధానంలో ప్రతిపాత్రలో, ప్రతి యాత్రలోనూ హరీష్‌రావు చూపే ఆసక్తి అందరినీ ఆకట్టుకునేది. ఆయనను ఆదర్శంగా తీసుకొని అందరూ సభలు నిర్వహించిన వారే…హరీష్‌రావు మూలంగా తొలి నాళ్లలో పెద్దఎత్తున యువత పార్టీ వైపు ఆకర్షితులయ్యారంటే అతిశయోక్తికాదు. అంతే కాదు అభివృద్ధి విషయంలో కూడా హరీష్‌రావు పాత్ర మమ్మల్నందరినీ ఆశ్చర్యానికి గురి చేసేది. నిత్యం ప్రజల్లో వుండడమే ఆయనకు ఇష్టం. అటు ప్రజాక్షేత్రంలోఉద్యమం, ఇటు శాసన సభలో అభివృద్ధిపై పట్టుపట్టడం, అనేక అంశాలపై ప్రభుత్వంతో పోరాటం చేయడం రెండు రకాల వైవిధ్యభరితమైన పాత్ర ఆయన పోషించారు. అయినా ఎక్కడా అలసిపోయేవారు కాదు. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ ఆక్టివ్‌గా వుండడం ఆయనను చూసి నేర్చుకోవాల్సిందే. అటు శాసన సభ సమావేశాలు జరుగుతున్న సేపు సభలో, సభ విరామం ప్రకటించగానే ప్రజా క్షేత్రంలో వుండడం అందరి వల్ల అయ్యే పని కాదు. ఉద్యమ కాలంలోనే సిద్దిపేట అభివృద్ధికి హరీష్‌రావు బలమైన పునాదులు వేశారు. ప్రగతి బాటలు తెరిచారు. ఇక మంత్రిగా ఆయన ఎనలేని సేవలు చేస్తున్నారు. ఉద్యమం చేశాం…తెలంగాణ సాధించాం అని రెస్టు తీసుకున్న సందర్భం లేదు. ఊపిరి పీల్చుకున్న గడియ లేదు. తీరికన్నది లేకుండా ప్రజలకు సేవ చేయడమే హరీష్‌రావుకు ఇష్టం. అభివృద్ధిని కూడా ఉద్యమ ఆకాంక్షలకు ప్రతీకగానే నిర్వర్తిస్తున్నారు. ఇక ఇతర నేతలతో ఆయన ఒదిగిపోయి వ్యవహరించే హుందాతనం మంచినేతగా, మనసున్న మనిషిగా ఎదిగేందుకు ఎంతో దోహడపడిరది. సిద్ధిపేటలో ఏకంగా ఏడువందల రోజులకు పైగా దీక్షా సదస్సులు నిర్వహించిన ఘనత ఒక్క హరీష్‌రావుకే దక్కింది. అలాంటి నేతను వారసుడు అనడం కన్నా, ఉద్యమ కారుడుగానే తెలంగాణ సమాజం గుర్తించి గుండెల్లో పెట్టుకున్నది. సిద్ధిపేట అంతగా ఆయనను ప్రేమిస్తోంది.

కల్వకుంట్ల కవిత: తెలంగాణ బాషలోని కమ్మదనాన్ని ఉద్యమానికి అద్దారు. బతుకమ్మ ప్రపంచానికి పరిచయం చేశారు. , యాస ఆమెకు కొట్టిన పిండి. పూల పండుగకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నింపిన నిండుదనం ఆమె. ప్రకృతిని పూజించే పండుగను ఉద్యమానికి తోడు చేసి, బతుకమ్మను ఉద్యమ స్వరూపంచేసింది ఆమె. పాటలతో చైతన్యాని, బతుకమ్మ ఆటలతో పోరాట పటిమను కలగలపి, చరిత్రలో కనీవినీ ఏరగని రీతిలో ట్యాంక్‌ బండ్‌ను పూల వనం చేసి, ఉద్యమ స్వరూపానికి నిలువెత్తు సాక్ష్యమైన నిలిచింది ఆమె. సాదాసీదా ఆహార్యానికి నిదర్శం ఆమె. ఆపన్నులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. అక్కా అని పిలిస్తే చాలు ఆదుకుంటుంది. మానవత్వానికి ప్రతిరూపం. మంచి తనానికి నిలువెత్తు రూపం. తెలంగాణ ఆకాంక్షకు బలమైన నిర్వచనం. తెలంగాణ కోసం మడమ తిప్పనిపోరాటం. దూం దాం కార్యక్రమాలైనా, వంటా వార్పులైనా, దేశ దేశాల్లో బతుకమ్మలైనా, తెలంగాణ జిల్లాలకు బతుకమ్మ వేదికలైనా అన్నీ ఆమె…అన్నింటా ఆమె…తెగువకు ప్రతిరూపం. తెగించి కొట్లాడిన నిలువెత్తు పోరాట రూపం… ఆమె కల్వకుంట్ల కవిత. మహాళా తెలంగాణ పోరాట గీతిక. తెలంగాణ ఉద్యమ పతాక ఆడ పిల్లలు ఆస్ధుల్లో వాటాలు కోరుతుంటారు. కాని ఈ ఆడపిల్ల తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కోరారు. పోరాటంలో భాగంకోరారు. తాను తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు. తండ్రిని మెప్పించారు. ఒప్పించారు. తెలంగాణ ఉద్యమ కదన రంగాన దూకారు. ఉద్యమం అంటే, పోరాటం అంటే కళ్లకు చానా చిన్నదిగా కనిపించొచ్చు. దిగితే గాని లోతు తెలియదు. మహిళలు రాజకీయాల్లో సాగడం వేరు. ఎన్నికల రాజకీయాల్లో ప్రచారాలు వేరు. కాని ఉద్యమ పంధాలో కొనసాగడం అంటే కత్తి మీద సాములాంటిది. ఓ వైపు కుటుంబం. మరో వైపు సామాజిక బాధ్యత. ఇలా రెండిరటినీ సమత్యుల్యం చేసుకుంటూ ఉద్యమ కదనరంగంలో నిలవడం అంటే మాటలు కాదు. అలాంటి పోరాటంలో తనేంటో నిరూపంచుకొని, తెలంగాణ బతకమ్మకు పర్యాయంగా మారిన కల్వకుంట్ల కవిత…తెలంగాణ ఉద్యమ పతాక… అమెరికానుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అమెరికాలో వుంటున్న కవిత తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమ నాయకుడిగా ఆయన ఆధ్వర్యంలో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమం చూసి, తాను కూడా తన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనుకున్నది. తెలంగాణ ఉద్యమంలో తాను పాలుపంచుకుంటానని నిర్ణయించుకున్నది. ఈ విషయం అందరకీ చెప్పి, అందిర్నీ ఒప్పించి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది. అయితే ఆమె ఓ వైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. కేవలం కేసిఆర్‌ కూతురుగా కాకుండా ఆమె ప్రత్యేక ఉద్యమ స్వరూపాన్ని నిర్మించుకున్నది. అందులో భాగంగా తొలుత నల్లగొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం, అక్కడ మౌలిక సదుపాయల కల్పన వంటివాటిపై దృష్టిపెట్టింది. కొన్ని గ్రామాల పిల్లలకు ఉచిత విద్యనందించే బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. ఇదే సమయంలో తెలంగాణ యువత ఇంజనీరింగ్‌ విద్య పూర్తి చేసుకున్నప్పటికీ సరైన అవకాశాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె గ్రహించారు. అసలు తెలంగాణ ఉద్యమం సాగుతున్నదే నియామాకాలలో జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ…రాష్ట్రంలో ద్వితీయ శ్రేణిపౌరులుగా తెలంగాణలోనే వారికి సరైన అవకాశాలు లేకుండాపోవడంతో వారికి ఎలాగైనా ఉద్యోగ కల్పనకు కృషిచేయాలని నిర్ణయించున్నారు. ఐటి కంపనీలు తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పనలో చెప్పే ఏకైక సాకు స్కిల్‌డెవలప్‌ మెంటు.. అందుకే ఆమె పెద్దఎత్తున తెలంగాణ యువతకు స్కిల్‌ డెవలప్‌ మెంటు కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఎంతో మంది ఇంజనీరింగ్‌ విద్య పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కలిగేలా చేశారు. ఇలా సాగుతున్న తరుణంలో ఆమె స్వచ్ఛంధ స్వంస్ధ ‘తెలంగాణ జాగృతి’ విస్తరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆ సంస్ధకు ప్రతినిధుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఓ వైపు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వుంటూనే, నిత్యం జాగృతి కార్యక్రమాలకు హజరౌతూ, తెలంగాణపై యువతలో చైతన్యం నింపారు. వారిలో సామాజిక బాధ్యత వైపు నడిపించారు. ఆ సమయంలో తెలంగాణ జాగృతి అన్నది గొప్ప శక్తిగా మారింది. ప్రతి సమస్యపై స్పందించడం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం తెలంగాణ జాగృతి వంతైంది. ఇక తెలంగాణ యాసకు, బాషకు జరుతున్న అన్యాయంపై ఆమె గళమెత్తింది. సినిమాల్లో తెలంగాణయాసను విలన్లకు ఆపాదించడం, లేక కమెడియన్లతో ఎద్దేవాలు చేయించడం వంటివి చేస్తుండేవారు. అదే సమయంలో కొన్ని సినిమాల్లో తెలంగాణపై వాడిన పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సినిమాల విడుదలను సైతం శాసించగలిగారు. అప్పటినుంచి సినిమాల్లో హీరోలకు సైతం తెలంగాణయాసను జోడిరచే సినిమాలు రావడం అన్నది కవిత చేసిన పోరాటంలో బాగమనే చెప్పాలి. 2006 ఉప ఎన్నికలతో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమ స్వరూపాలు, జాగృతితో పల్లె జీవనంలో వెలుగులు, యువతకు ఉద్యోగ కల్పనలో నైపుణ్య శిక్షణలు చేస్తూ వచ్చిన కవిత, 2006 కేసిఆర్‌ రాజీనామా చేయడంతో వచ్చిన కరీంనగర్‌ పార్లమెంటు ఉప ఎన్నిక సమయంలో ఆమె విసృత ప్రచారం సాగించారు. ఇల్లూ ఇల్లు తిరిగి తెలంగాణ ఆవశ్యకత గురించి వివరించారు. ఆనాడు మంత్రి సత్యనారాయణ చేసిన ఛాలెంజ్‌ అన్నది తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి చేసిన కుయుక్తులను ఎత్తిచూపిస్తూ, కేసిఆర్‌ గెలుపు తెలంగాణకు మలుపు అన్న స్లోగన్‌తో అటు ఉద్యమ పథం, ఇటు రాజకీయచదరంగాన్ని చూశారు. బతుకమ్మకు నిండుదనం: ప్రకృతిని కొలవడం సహజం. ప్రకృతి అందించే ఆహారాన్ని తినడం తెలుసు. కాని ప్రకృతి అందించే పువ్వును గౌరమ్మగా చేసి, తెలంగాణ మహిళా సమాజం భక్తిప్రపత్తులతో బతుకమ్మను పేర్చి ఆడుకోవడం అన్నది ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. పంటలు చేతికొచ్చి, ప్రకృతి పచ్చని సోయగాన్ని నింపుకొని, చెరువులన్నీ నీళ్లతో నిండుకొని వున్న వేళ ప్రకృతి ప్రసాదించే పూలవనాన్ని ఒక్క దగ్గర చేర్చి ఆటలాడి, పాటలు పాడి, కొలిచి, వాటిని చెరువులో నిమజ్జనం చేయడం అంటే చెరువు కలుషితం కాకుండా, చెరువును మంచినీటికి కోసం సిద్ధం చేయడం అన్న సైన్స్‌ను కనుగొన్న గొప్ప సంస్కృతి మనది. ప్రతి ఏటా ప్రకృతిని పదిరోజుల పాటు కొలుచి, పోయిరావామ్మా అంటూ…మళ్లీ మళ్లీ పిలుచుకంటూ పండగ నిర్వహించుకోవడం ఆనవాయితీ. అలాంటి బతుకమ్మను ఉద్యమ స్వరూపం చేసిన ఘనత కవితకే దక్కింది. అంతకు ముందు బతుకమ్మను ఒక పండుగానే చూసేవారు. కాని కవిత మాత్రం బతుకమ్మను ఉద్యమానికి ప్రతీక చేశారు. మహిళలను చైతన్యపరిచారు. ఐక్యం చేశారు. తెలంగాణ మహిళా సమాజంలో తెలంగాణ ఉద్యమానికి సన్నద్దంచేశారు. ప్రత్యక్ష్యంగా తెలంగాణ మహిళలు తెలంగాణ కోసం కొట్లాడేలా చేశారు. తెలంగాణ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో బతుకమ్మ పండగను ట్యాంక్‌ బండ్‌ మీద నిర్వహించిన ఘనత మాత్రం కవితకే దక్కుతుంది.

 

జోగినపల్లి సంతోష్‌ రావు: తెలంగాణ ఉద్యమకారులలో సంతోష్‌ రావు ఒకరు. తెలంగాణ ఉద్యమంలో 2001లోనే అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి అటు పార్టీ బాధ్యతలు కూడా చూస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి మీడియా ఆవశ్యకత అవసరం ఏర్పడడంతో నమస్తే తెలంగాణ దిన పత్రిక, టి. న్యూస్‌ ఛానల్‌ నిర్వహణ బాధ్యత కూడా చేపట్టారు. తెలంగాణ సాంస్కృతిక విప్లవానికి ప్రాణం పోశారు. అటు క్షేత్ర స్థాయి ఉద్యమ పర్యవేక్షణతో పాటు, మీడియా పరంగా ఉద్యమాన్ని ఉరకలెత్తించడంలో తనదైన పాత్ర పోషించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా నడు చుకుంటూ, ఆయన పర్యవేక్షణ అంతా సంతోష్‌ రావు చూసుకునే వారు. హైదరాబాదు లో అయినా, డిల్లీలో అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎవరెవరిని కలవాలి అన్న విషయాలు చూసుకునే వారు. నిత్యం కేసిఆర్‌ తోనే వుండేవారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు తోడుగా వుంటున్నారు. ప్రగతి భవన్‌ కార్యకలాపాలను చక్కదిద్దుతూ వుంటారు. అదే సమయంలో ఆయన గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం ఎంతో గొప్పది. 2018లో ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యే వరకు మీడియా బాధ్యతలు పూర్తి స్థాయిలో చూసుకునే వారు. ఇప్పుడు అటు కేసిఆర్‌ నిర్ణయాల అమలు బాధ్యత తో పాటు, రాజ్యసభ సభ్యుడిగా విధులు కొనసాగిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సంతోష్‌ రావు ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌ కు విశేషమైన గుర్తింపు వచ్చింది. ఆయన విసిరే గ్రీన్‌ ఛాలెంజ్‌ కు స్పందించి, సెలబ్రిటీలు విరివిగా మొక్కల పెంపకం చేపట్టడం గమనార్హం. తెలంగాణ కు వచ్చే ప్రతి సెలబ్రిటీ కూడా మొక్కలు నాటకుండా వెళ్లరు. ఇదే సంతోష్‌ రావు వృక్ష వేదం పుస్తకం రూపొందించాడు. దానిని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే హరిత హారం ఒక విప్లవంగా విజయవంతం కావడంలో సంతోష్‌ రావుది కీలకపాత్ర. మేడ్చల్‌ జిల్లాలోని కీసర ప్రాంతంలో సుమారు రెండు వేల ఎకరాల ఫారెస్ట్‌ ను దత్తత తీసుకొని మొక్కలు నాటే యజ్ఞం మొదలుపెట్టారు. ఇలా ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిని ఆరాధించడం అందరికీ అలవాటు చేయడంలో సంతోష్‌ రావు వేసిన బాటలు సత్పలితాలిస్తున్నాయి. భవిష్యత్తు తెలంగాణకు వరంగా మారుతున్నాయి.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు

తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు

కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలని, తెలంగాణ మాదిరిగానే దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేసిన రవిచంద్ర, విజయలక్ష్మీ గార్లు

రవిచంద్రతో పాటు స్వామివారిని దర్శించుకున్న పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు 

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి శుక్రవారం ఉదయం కలియుగ ఇష్ట దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు.ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభ విజయవంతం అయినట్లుగానే పార్టీ ఆధ్వర్యంలో జరిగే సభలు, సమావేశాలన్నీ కూడా దిగ్విజయం కావాలని, తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించాలని కోరుతూ భగవంతున్ని వేడుకున్నారు.అలాగే మహానేత కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ మాదిరిగా యావత్ దేశం సుభిక్షంగా వర్థిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.ఎంపీ రవిచంద్రతో పాటు పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు మంత్రోచ్ఛరణాల మధ్య అంక్షితలు వేసి రవిచంద్ర, విజయలక్ష్మీ గార్లను,ఇతర ఎంపీలను ఆశీర్వదించారు, శాలువాలతో సత్కరించారు.

పొలిటికల్‌ ఆల్‌ రౌండర్‌ హరీష్‌ రావు.

`హరీష్‌ వ్యూహం పన్నితే ప్రతిపక్షాలకు పద్మవ్యూహమే.

`వ్యూహాల అమలులో దిట్ట హరీష్‌ రావు.

`ఉద్యమకాలంలో తొలి సింహ గర్జన కరీంనగర్‌ సభ ఏర్పాట్లు….

`ఉద్యమ సమయంలో అనేక సభలు హరీష్‌ రావు పర్యవేక్షణలోనే…

`అన్ని ఉప ఎన్నికలకు హరీష్‌ రావే ప్రధాన ప్రచార కర్త.

`అప్పట్లో ఉద్యమం, పార్టీ బలోపేతం బాధ్యతలన్నీ హరీష్‌ రావుకే…

`2018 ముందస్తు ఎన్నికల సమయంలోనూ ప్రజాశీర్వాద సభలకు హరీష్‌ రావే ప్రాతినిధ్యం.

`ఎన్నికల ప్రచారంలో అనేక నియోజకవర్గాలలో సుడిగాలి ప్రచారం.

`గజ్వేల్‌ ప్రచార బాధ్యతలు కూడా హరీష్‌ రావుకే…

`కొడంగల్‌ లో రేవంత్‌ ను ఓడిరచిన ఘనత.

`బిఆర్‌ఎస్‌ తొలి సభ సక్సెస్‌ క్రెడిట్‌ హరీష్‌ దే…

`ఖమ్మం సభ విజయంతో బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌.

`జాతీయ స్థాయిలో బిఆర్‌ఎస్‌ సభ నభూతో నభూతో నభవిష్యతి.

`వేధిక సాక్షిగా సిఎం. కేసిఆర్‌ ప్రశంసలు.

`పది రోజులపాటు నిర్విరామ కృషి.

`పండగ నాడు కూడా పార్టీ సభ పనుల్లోనే…

`పార్టీలో ఆల్‌ ఇన్‌ వన్‌ లీడర్‌ హరీష్‌ రావే… 

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయం, ప్రజా సేవ, సామాజిక సేవ, ఏక కాలంలో నిర్వర్తించే పొలిటికల్‌ ఆల్‌ రౌండర్‌ తెలంగాణ ఉద్యమకారుడు, మంత్రి హరీష్‌ రావు. నమ్మకం అనే పదానికి పర్యాయం మంత్రి హరీష్‌ రావు. తను నమ్మిన వారందరికీ అభయం అందిస్తాడు. పార్టీకి ఎల్లవేళలా అండగా వుంటాడు. పార్టీ తొలి అడుగు పడడానికి ముందు నుంచే ఉద్యమ కార్యాచరణలో మమేకమైన నాయకుడు మంత్రి హరీష్‌ రావు. అలాంటి హరీష్‌ రావు రాజకీయ ప్రస్థానం విశిష్టమైనది. స్పూర్తి దాయకమైనది. ఆచరణాత్మకమైనది. ఒక వ్యక్తి అంకిత భావం ఎంత ఉన్నత స్థాయికైనా తీసుకెళ్తుందని చెప్పడానికి హరీష్‌ రావు వ్యక్తిత్వమే నిదర్శనం. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ రాజకీయంలో అడుగులు వేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు. పండగైనా, పబ్బమైనా, పగలైనా, రాత్రైనా, ఎండనక, వాననక ప్రజల్లోనే ప్రజలతోనే ఆయన జీవితం… నిత్య జీవన యానం. ఇలాంటి నాయకులు చాలా తక్కువగా వుంటారు. ప్రజలకు ఒక్క పూట కూడా ఆయన దూరంగా వుండరు. సరిగ్గా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కరోనా సోకినా కూడా విశ్రాంతి తీసుకోకుండా, ఇంటి నుంచి కూడా అవిశ్రాంతంగా పని చేసిన నాయకుడు హరీష్‌ రావు. ఇదే సమయంలో ప్రజలకు అవసరమైన ఇమ్యూనిటీ కిట్లను అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే హరీష్‌ రావు ప్రజలకు చేసే సేవలు లెక్కలేనన్ని… సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎవరు ఫోన్‌ చేసినా, సామాన్యుడు కష్టం చెప్పుకోవడానికి వచ్చినా వెంటనే స్పందిస్తారు. అవసరమైన సాయం వెంటనే అందేలా చూస్తారు. అది అనారోగ్య సమస్యలైనా, కొన్ని సార్లు ఆర్థికపరమైన ఇబ్బందులైనా స్పందించడం ఆయనకే చెల్లింది. ఉద్యమ సమయంలో కూడా అభివృద్ధికి నమూనాగా సిద్దిపేటను తీర్చిదిద్దారు. ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట ను అన్ని రంగాలలో ముందుంచారు. అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటే సిద్దిపేట అని చెప్పుకునేలా చేశారు. హరీష్‌ రావు అంటే జనానికే కాదు, పశు, పక్షాదులకు కూడా ఇష్టమే….సిద్దిపేట లో ఓ కార్పొరేటర్‌ ఇష్టంగా పెంచుకునే కోళ్లు, మంత్రి హరీష్‌ రావు వస్తున్నాడని అంటే పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాయట…అంతగా హరీష్‌ రావు పేరు సిద్దిపేటకు ఇష్టమైంది. ఆయన నాయకత్వం వరమైంది. అలాంటి హరీష్‌ రావు పార్టీ కోసం, తెలంగాణ కోసం చేసిన కృషి అనితర సాధ్యమైనది. 

పొలిటికల్‌ ఆల్‌ రౌండర్‌ హరీష్‌ రావు అని చెప్పడం కూడా ఇంకా ఏదో వెలితిగానే వుంటుంది.

 అసలు రాజకీయాలలో వున్న వాళ్లు ఎలా వుండాలి. ప్రజలకు ఎలా చేరువ కావాలి. ఎలా సేవ చేయాలి. అందుకు నాయకులు పడే శ్రమ ఎంత? అన్న దానిపై పుస్తకం రాస్తే హరీష్‌ రావు నిత్య జీవితం ఒక రాజకీయ నిఘంటువు అవుతుంది. అలాంటి హరీష్‌ రావు రాజకీయంగా వేసే అడుగులు ప్రత్యర్థులు అంచనా వేయలేరు. సిద్దిపేట రాజకీయాలలో ఆయన అడుగుపెట్టిన తరుణం నుంచి ఇప్పటి వరకు ఆయనకు ఎదురుగా నిలబడేందుకు ప్రతిపక్షాలకు ధైర్యం చాలదు. పార్టీల పరంగా పోటీ చేయాలన్నదే తప్ప, హరీష్‌ రావు మీద గెలవడం అన్నది సాధ్యం కాదన్నది వాళ్లకు కూడా తెలుసు. అంతే కాదు సమీప భవిష్యత్తులో హరీష్‌ రావు ను రాజకీయంగా ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు. అంతగా ప్రజల్లో మమేకమయ్యారు. ప్రతి ఇంటిలో తానో సభ్యుడయ్యాడు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఆయనను ఒక నాయకుడిగా కన్నా, ఒక ఆత్మీయుడిగానే అందరూ చూస్తారు. అంతలా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు హరీష్‌ రావు. ఇక ఇతర నియోజకవర్గాలలో కూడా ఎన్నికల బాధ్యతలు హరీష్‌ రావుకు అప్పగిస్తే చాలు…అక్కడ విజయమే…అలా ఆయన అనేక ఎన్నికలు, ఉప ఎన్నికలలో ముందుండి ప్రచారం చేసి గెలిపించారు. హరీష్‌ వ్యూహం పన్నితే ప్రతిపక్షాలకు పద్మవ్యూహమే. వ్యూహాల అమలులో దిట్ట హరీష్‌ రావు.

ఉద్యమకాలంలో తొలి సింహ గర్జన కరీంనగర్‌ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు.

 నిజానికి అలాంటి సభ ఏర్పాటు వ్యవహారం హరీష్‌ రావు కు కొత్త. అయినా పట్టుదలతో ఆయన చేసిన కృషి ఎలా వుంటుందనేది అప్పుడే నిరూపితమైంది. ఉద్యమ సమయంలో అనేక సభలు హరీష్‌ రావు పర్యవేక్షణలోనే జరిగాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిన వరంగల్‌ సభ కూడా ఆ రోజుల్లో హరీష్‌ రావు నాయకత్వంలోనే జరిగింది. తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికలకు హరీష్‌ రావే ప్రధాన ప్రచార కర్త. ఎమ్మెల్యేలు రాజీనాలు చేసిన సందర్భంతో పాటు, సార్వత్రిక ఎన్నికలను కూడా తన భుజాన వేసుకొని, పార్టీకి విజయాలు అందించిన నాయకుడు హరీష్‌ రావు. అప్పట్లో ఉద్యమం, పార్టీ బలోపేతం బాధ్యతలన్నీ హరీష్‌ రావుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అప్పగించేవారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలోనూ ప్రజాశీర్వాద సభలకు హరీష్‌ రావే ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికల ప్రచారంలో అనేక నియోజకవర్గాలలో సుడిగాలి ప్రచారం చేశారు. గజ్వేల్‌ ప్రచార బాధ్యతలు కూడా హరీష్‌ రావుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అప్పగించారు. కొడంగల్‌ లో రేవంత్‌ ను ఓడిరచిన ఘనత కూడా హరీష్‌ రావుకే దక్కింది. ఆ నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటుకు నోటు కేసులో పాత్రదారి రేవంత్‌ రెడ్డిని ఓడిరచి తన రాజకీయ వ్యూహాత్మక చాణక్యం ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించారు. దటీజ్‌ హరీష్‌ రావు అనిపించారు. 

బిఆర్‌ఎస్‌ తొలి సభ సక్సెస్‌ క్రెడిట్‌ హరీష్‌ దే…

ఈ మాట బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులంతా ముక్త కంఠంతో అంటున్న మాట. ఆ సభకు ముందు పార్టీ శ్రేణుల్లో కొంత ఎక్కడో అసంతృప్తి వుందనే వాదనలు వినిపించాయి. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం మీద వున్న నమ్మకం ప్రజల్లో మరింత పెరిగిందన్నది బిఆర్‌ఎస్‌ సభ తో రుజువైందని అనుకుంటున్నారు. 

ఖమ్మం సభ విజయంతో బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. జాతీయ స్థాయిలో బిఆర్‌ఎస్‌ సభ నభూతో నభూతో నభవిష్యతి అనే మాటనే హజరైన డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి విజయ్‌ లు కితాబిచ్చారు. వేధిక సాక్షిగా హరీష్‌ రావుపై సిఎం. కేసిఆర్‌ ప్రశంసలు కురిపించారు. అదే వేధిక నుంచి ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా సభ విజయంపై పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు. 

పది రోజులపాటు నిర్విరామ కృషి.

బిఆర్‌ఎస్‌ తొలి సభ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగిన నుంచి హరీష్‌ రావు అదే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆదేశాల మేరకు దాదాపు పది రోజుల పాటు నిర్విరామంగా పని చేశారు. అంతే కాదు ఆరోగ్య శాఖ మంత్రిగా అదే రోజు జరిగే కంటి వెలుగు కార్యక్రమం కూడా ప్రారంబించారు. అందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకోవడానికి అవసరమైన రివ్యూ మీటింగులు ఏర్పాటు చేశారు. అదే రోజు ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభోత్సవ పనులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఏక కాలంలో చరిత్రలో నిలిచిపోయేలా జరగిన ఖమ్మం తొలి బిఆర్‌ఎస్‌ సభ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే, తీరిక లేకుండా ఇతర పనులను దగ్గరుండి చూసుకోవడం అంటే అందరి వల్ల అయ్యే పని కాదు. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకమైన పనులన్నీ హరీష్‌ రావు మాత్రమే చూసుకుంటారు. 

పండగ నాడు కూడా పార్టీ సభ పనుల్లోనే…

ఓ వైపు బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులందరూ సంక్రాంతి పండుగ వేళ కుటుంబంతో గడిపితే హరీష్‌ రావు ఖమ్మం సభ ఏర్పాట్లలోనే నిమగ్నమై వున్నారు. బిఆర్‌ఎస్‌ తొలి సభ కావడంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. టిఆర్‌ఎస్‌ స్థాపన తర్వాత జరిగిన తొలి బహిరంగ సభను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో, అంతకు మించి హరీష్‌ రావు ఖమ్మం సభ మీద దృష్టి సారించారు. అందుకే ఖమ్మం సభ అంత విజయవంతమైంది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక పండగలు కూడా ప్రజలతో చేసుకున్న నాయకుడు హరీష్‌ రావు. ప్రజలు ఎక్కడుంటే అక్కడే హరీష్‌ రావుకు పండగ. అందుకే పార్టీ లో ఆల్‌ ఇన్‌ వన్‌ లీడర్‌ హరీష్‌ రావే…అన్నది అందరూ ఒప్పుకునే మాట. అందరూ చెప్పుకునే మాట.

Elections are the ultimate answer for every question.

 

So KCR wants to align Telangana movement with elections.

Separate state movement is a milestone in the history of Tealangana.

KCR created history by achieving Telangana. 

His leadership itself created a history.

HYDERABAD,NETIDHATHRI : 

KCR has never feared the elections. He directly involved in student politics while he was in studies. His plans are very strategic and successful in nature which gives desired results. The strategy he followed to contain the opponents from moving forward, made him to achieve success. Like that he became MLA. He emerged victories against strong leader like Madanmohan shows how much is his couragious. It also depicts the self confidence of KCR in emerging success in reaching the goals which are difficult to achieve. While he was in Telugudesam he continued to exhibit his specific and unique character by playing a role director to the party workers. He is not only an excellent orator but also great analyst. This ability made him to acquire boldness required to lead the Telangana movement. Telangana regions with drying up lands, defunct wells made his heart to burn with anger. 

His eyes filled with tears when he looked into the traces of streams in the region.

 Once upon a time those steams caused the land to become fertile. Now the left over traces remain as mark of previous history. In those days while travelling people used to drop coins in any stream whenever they happens to cross praying it to flow in the fields of this region. Really speaking we won’t see KCR like leader who has great zeal towards his native land. He likes the land and crop. He used to sit continuously just by looking towards the crop that growing. Even the crop does not yield as expected; he never stopped his farming activity. There is a general opinion that, there is no gain in agriculture, ultimate result is loss! But KCR wanted to reverse this trend, by making agriculture a profitable one. This strong passion moved him towards the Telangana movement which he launched in the year 2000 and continued till it achieved in 2014. Nobody was in confidence that Telangana state can be achieved. Then how can they expect Kaleswaram. In order to prevent the migrations to other states it is necessary to achieve the separate state. At the same time transforming Telangana into richest water source for performing cultivation activity with confidence. Then everybody those went on migration to other states will return back and indulge in agricultural activities. These were the thoughts of KCR while taking the Telangana movement into his hands. With this aim he resigned to his MLA post in 2000 and launched TRS in 2001. Immediately after launching the party, he toured in every inch of Telangana. He aligned this movement with politics and fought in the local election and emerged victorious. Next time he contested in Siddipet by-elections for which he resigned earlier and get elected. Number of leaders constantly tried to control KCR but in vain. He assured the people that Telangana can be achieved. If it is not possible he asked them to hit him with stones. He introduced a new trend during the Telangana agitation. Just he aligned the agitation with politics. This is new style followed by KCR which is his brain child. In those days everybody was in strong opinion that the TRS party founded by KCR will never stand for longer period. But finally it is proved that TRS stood in strong position by eliminating all parties in the state. By 2018 KCR again proved that there is no opposition to him. When Chandrababu became Chief Minister of United Andhra Pradesh, he banned the use of ‘Telangana’ word in the Assembly. Telangana is backward area, he commented. But KCR said that Telangana is kept in backward status and moved his movement forward. KCR fought every elections during his separate state agitation was going on. But it took some time for Telangana people to trust KCR. He followed the strategy to align with Congress party to send the Telangana Resolution from Assembly to Delhi. Then he contested in 56 seats and won in 26. While KCR was striving hard to achieve Telangana, some leaders betrayed the movement in lust on minister posts. Then KCR understood the betrayal role of Congress and cut off his alliance with that party. At that time KCR took the challenge posed by Congress leader M. Satyanarayana, resigned to his MP seat and again contested from Karminagar and won with two lakh votes majority. Then he immediately asked his 16 MLAs to resign and again went to poll. Even though those election results discouraged, he consoled himself that for any movement up and downs are common and again moved forward with more aggressive manner. In the next elections ‘Great Alliance’ was formed. He joined it and retained the existence of Telangana. 

In 2009 he took final decision. 

‘Either to die or achieve Telangana’ he decided to sit for fast unto death. In the month of December he continued his fast unto death and finally Central Government obeyed the KCR demand and announced the formation of separate Telangana state. But Telugudesam leaders were against the Telangana. They opposed the centre’s announcement and Congress and Telugudesam leaders get readied to resign their posts. Like that they want to blackmail the Centre. This pressure tactics caused then UPA2 government to put her step backward. Sensing this TRS under the leadership of KCR played its own politics. This time TRS retained the self-confidence of Telangana. Entire Telangana society remains in anger against Congress leaders those who kept quite when Centre warned against granting single rupee to Telangana. During 2008 by-elections then Chief Minister Y.S. Rajasekhar Reddy used a word against the opposition leader KCR. This raised anger among the Telangana people against Congress party. Now entire Telangana stood behind KCR. Finally in 2014 the long standing dream Telangana achieved. KCR became the Chief Minister and brought welfare government. Even then also Chandrababu Naidu tried to purchase MLAs to topple the government. Then KCR played a strategic role and became successful in eliminating the two parties from Telangana. Like this he cleared the way for the formation of ‘Golden Telangana’. Now by launching ‘BRS’ he is moving forward for making ‘Golden India’.

He is tireless leader…unopposed fighter

He is the ray of enlightenment… Kalvakuntla Chandrasekhar Rao

-He put at stake against time

-For the sake of Telangana people, he stood in front to fight

-He is the united voice of backward classes

-He began his journey in single but being the leader of Telangana movement won the hearts of crores of people.

-He wrote new chapter in the history of Telangana

-He is the heart beat of Telangana

-He gave a shape to Telangana movement and transformed it like wildfire

-He never cared any obstacle and moved forward like brave warrior

-Every farmer in the state never forgets the benefit caused by KCR.

-KCR is born for a cause…ideal leader.

HYDRBADH,NETIDHATHRI : He became the heart beat of Telangana. Every heart, soul in Telangana followed him under his mesmerising leadership. His powerful thought about Telangana, finally transformed him as a tireless leader to fight to achieve separate state. He who has the capacity to move with strong will and won’t put his step backward and will never care for any obstacle. Even all the ways closed down, he won’t relinquish his will. Such a leader is KCR. Finally he achieved his goal of separate state that never expected by any leader or intellectuals belongs to erstwhile Andhra Pradesh. 

In his journey, he fought against the time, political opponents and became successful in bringing all Telangana people to fight against a single cause.

 He made all the people to raise slogans like ‘Jai Telangana’. He stood for Telangana people; he fought against the discriminate rule which is the main reason for the backwardness of Telangana. He successfully installed the idea of Telangana among the people and made them to move forward to achieve this cause. Finally all the people felt there is no alternative other than formation of Telangna. This is the greatest achievement made by KCR during the separate state movement. The enthusiastic response received from the people made him to dare enough to reach the edge of death. He was able to turn every heart and soul of rural Telangana to fight against the cause of separate state. Like this he became the object of terror to those who are against the cause.

He made agitation and politics as two weapons to achieve Telangana. 

His ability to move all the people towards the agitation and political tactics he played simultaneously yield fruitful results in the form of support from all party leaders. He compelled the other party leaders to extend their support to this agitation. Like that KCR finally able to clear the tearful eyes of Telangana people. With his punch words in Telangana dialect very much attracted the rural mass. This tactics made him to reach the hearts of Telangana masses. He explained them in detail how Telangana is being suffered in the rule of Andhra people and how injustice caused by them to this region. In order to protect the existence of Telangna he fought relentlessly. Now he is considered as the father of Telangana and another Gandhi of the state.

His heart filled with sorrow when observed the troubles faced by the Telangana masses.

 He looked how the people are migrating to other states to eke out their lives. Those people who are confined to work in coal mines and their miserable life made him to realise that only achieving the state will make them to get rid of such problems. He observed how Telangna transforming like desert without receiving single drop of water. State has full of recourses. But they have not made useful to people. Number of farm wells in Telangana became defunct. There was no proper power supply. Adding these troubles, even removing the silt in the wells there was no water. All these problems faced by the people well understood by KCR during his agitation. After achieving Telangana, he first concentrated on removing the silt in the tanks in the villages. He gave continuous free power supply to farmers. Under Mission Kakatiya he filled all the tanks with water in the villages. He took steps to giver drinking water to every household. 

Like that KCR created history and made his life as history.

In this history every page is most important. His every movement turned into history. Now formation of Bharat Rastra Samithi (BRS) also becomes history. Like that creating history is possible only to KCR. History can’t be created by every leader like KCR. He built Kaleswaram Project which is a record. Almost all dry area in Telangana came under this project’s catchment area. With the help of this project Telangana transformed like rice bowl of India. Not only irrigation projects, KCR also concentrated on welfare schemes. Raitu Bandhu, Dalita Bandhu like welfare schemes have been very much attracted the leaders of other states. Central Government along West Bengal, Jharkhand and Andhra Pradesh like states have been implementing the welfare schemes in the line of Raitu Bandhu. Like this Raitubandhu became a role model in entire country. This has been a greatest achievement of KCR. Now our beloved Chief Minister began to implement Raitu Bima. Now he announced ‘Girijana bandhu’ for tribal people. KCR heart always beat for the down trodden people. Now CM Kalvakuntla Chandrasekhar Rao implementing the ‘kalyana-lakshmi’ scheme in which financial assistance is being given to those poor families. With all these qualities, KCR became kind and generous leader towards poor people. Really speaking Telangana is fortunate enough to have such a great Chief Minister.

Farmer is king!

Farmer is king!

Trend setter KCR never foiled the trust of farmers who kept on him. Immediately after coming to the power he transformed almost entire land in Telangana into wet lands and retained the trust of farmers laid on him. An average Telangana farmer struggled a lot to get water for his farm land. Hide and seek monsoons turned the life of the farmer into measurable. There is no single day that farmer felt happy by looking into his field. Transforming the tearful of eyes of Telangana farmer into tears of joy was remained as dream. But now the situations fully changed. KCR strongly felt that ‘Golden Telangana’ is only in the joyful faces of farmers. This cause made him to fight for separate state. He wants to make the farmer as king! So he decided to transform each village with green fields. To achieve this every village is needed to provide with irrigation water facility throughout the year. Major irrigation in Telangana depends on wells and boars. So after coming to the power, the first thing he has done is filling the tanks in the villages. When the water is available in sufficient enough for irrigation, that will become great asset to the farmers. KCR also really wanted this. Once, everybody expressed doubt on achieving Telangana. Now those people in full of joy after looking into the state that transformed into rice bowl of the country. Now every village in Telangana filled with luminous joy and pleasure. If a leader becomes the ruler who fought for the cause of farmers and how he transforms the lives of peasants, Telangana remains a best example for this. By successfully completing the Kaleswaram project, really KCR became ‘Bhagiratha’. The farming lands once remain in dry for lack of water, now rejoicing with sufficient water. They are giving rich yields to farmers and causing self confidence in their faces. KCR has been implementing welfare schemes which became the role model of our country. Previously those farmers migrated to other cities like Bombay, now under the glorious rule of KCR, returned back to their fields. The villages once remain vacant due to migrations, now looks in festive appearance. The welfare scheme ‘Raitu Bandhu’ which is brain child of KCR, really transformed the life of peasants who had been struggling for investment. Under this scheme the amount deposited in the accounts of farmers has been given great financial strength to farmers till now who remain in doldrums. Now the days has gone which totally dependent on monsoons. After sowing the seed, every day farmers used to look into the sky for rain for water. There was no guarantee of rain and the loans that borrowed always made the farmers to fear of their future. Lack of proper power supply also added to their troubles. In these circumstances they were unable to water their crops properly in required time. This was also one of the causes for the measurable situation of Telangana peasants. But now the situation has been totally changed. 24×7 free power supply has been providing to the farmers. At present tanks in the villages are filled with full of water. This made the boars and wells to have sufficient water throughout the year. With all these facilities raised the confidence among the Telangana farmers. During the united rule, even irrigation ministry was formed; there was no proper allocation of budget. If Telangana leader made Mister for this branch, he was helpless to do anything due to lack of funds. That was the situation prevailed then. Now River Godavari waters are flowing throughout the state. Chain system of tanks are now with full of water throughout the year, made the agriculture as dependable profession. Previous governments took the steps to strike off the loans of the farmers, but in vain. At present under ‘Raitubandhu’ Government is providing financial assistance for investment purpose. This caused to raise confidence among the farmers on agriculture profession. Most of the farmers get rid of the loans from the local money lenders as well as from banks. Even they took the loans from the banks, the quantity is greatly reduced. At the same time farmers are able to repay their loans in mean time. These are the benefits caused by ‘Raitubandhu’. After implementing this scheme farmer suicides are totally stopped in the state.

The Telangana Government appointed number of agriculture extension officers to give proper advices to the farmers on which crops to be grown. Redgram and mirch crops recorded highest yield last year is the best example for the steps taken by the government. Now the flourishing farmers in Telangana are happy under the rule of KCR. Since eight years of rule, KCR faced number of challenges. After successfully overcoming them he made the state as ‘Bangaru Telangana’.

తొలి అడుగైనా, మలి అడుగైనా… ఎప్పుడైనా ఎన్నికలతోనే సమాధానం

ఉద్యమానికి ఎన్నికలు జోడిరచిన పోరాటం…

`ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమం ఒక అధ్యాయం..

` కేసిఆర్‌ నాయకత్వం చరిత్రకు సంకేతం.

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎన్నికలంటే భయంలేదు. ఉద్యమమైనా, రాజకీయమైనా ఒక్కటే. ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలంటే ఎన్నికలే వేధిక. విద్యార్థి రాజకీయాలు కూడా ప్రత్యక్ష్యంగా చూసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎన్నికలు కొత్తకాదు. విజయాలకు తిరుగులేదు. ఆ మూడక్షరాలే విజయతీరాలు. ఎప్పుడూ పంతమే. ప్రత్యర్థులను కట్టడి చేసే వ్యూహమే. ఒకనాడు ఆయన తెగువే ఆయన ఎమ్మెల్యే కావడానికి కారణమైంది. ఉద్దండైన మదన్‌మోహన్‌ మీదే ఆయన విజయం సాధించడమే ఆయన ఆత్మస్థైర్యానికి నిదర్శం. తెలుగుదేశంలో వున్న కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన, విలక్షణమైన వ్యక్తిత్వంతోనే ఆయన ముందుకుసాగారు. తెలుగుదేశంపార్టీలో కార్యకర్తలకు దిశానిర్థేశం చేసే పాత్రనే ఎక్కువ కాలం పోషించారు. దాంతో అనర్ఘలమైన వాగ్థాటితోపాటు, లోతుగా ఏ విషయాన్నైనా విశ్లేషించగల సామార్థ్యం ఆయన సొంతం. అదే తెలంగాణ ఉద్యమాన్ని ఆయన భుజాన వేసుకునేంత తెగునను కనబర్చింది. ఎండిన తెలంగాణ, గొస పడుతున్న తెలంగాణ, కన్నీటి చుక్కలు తప్ప, నీటి చుక్కలు ముద్దాడని తెలంగాణ పల్లెల పొలాలు బీడులై పల్లెర్లుతో కనిపిస్తుంటే ఆయన గుండె తరుక్కుపోయేది.

 పారే సెలయేరును చూస్తే కంట్లో కన్నీరు కనిపించేంది.

 ఆ నీటి జాడలు మా తెలంగాణ మాగాణాన్ని తడిచేయకుండా పారుతుంటే కేసిఆర్‌ హృదయం చలించిపోయేది. అందుకే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కడైనా నీటి జాడలు పరుగులు తీస్తుంటే, మా తెలంగాణ పొలాల్లో కూడా పారమ్మా అంటూ ఆ నీళ్లలో పైసలు వేస్తూ వెళ్లేవారట. నిజంగా ఒక ప్రాంతం మీద ఇంత మక్కువ వున్న నేతలు దేశ చరిత్రలోనే బహు అరుదు. తన రాజకీయాలు, తన అవసరాలు అనుకునే రాజకీయాలు చూస్తున్న ఈ రోజుల్లో కూడా తన నేల గురించి తపన పడే ఏకైక భూమి పుత్రుడుగా ఆయనను ఎంతో మంది కీర్తిస్తున్నారు. భూమి అన్నా, పంటలన్నా ఆయనకు ఎంతో ఇష్టం. పచ్చని పొలాలు చూస్తూ కాలం గడపం అంటే ఇష్టం. ఇష్టంగా సాగు చేయడం, కష్టంతో పండిన పంట అనుకున్నంత చేతికి రాకపోయినా, సాగును మానని సగటు ఆసామి కేసిఆర్‌. భారత దేశ వ్యవసాయమే ప్రకృతితో ఆడే జూదం లాంటిదని చదివే విద్యార్థులకు, వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ అన్న స్థాయి తెలంగాణకు తీసుకురావాలన్న కసి నుంచి మొదలైన ఆలోచనే తెలంగాణ పోరాటం. 2000 మొదలైన మొదటి అడుగు, పారే నీటిని తెలంగాణకు మళ్లీంచే వరకు ఆగలేదు. తెలంగాణలో ఓ కాలేశ్వరం వస్తుందని ఎవరూ ఊహించలేదు. పల్లెలు వలస వెళ్తుంటే, గ్రామాలు ఖాళీ అవుతుంటే, బొంబాయి, బొగ్గుబాయి, అప్పులు చేసి దుబాయి వెళ్లే తెలంగాణ ప్రజలు మళ్లీ తెలంగాణలోనే వుండాలంటే, వారి జీవితాల్లో వెలుగులు నిండాలంటే, పల్లెలన్నీ పచ్చని రంగును పూసుకోవాలంటే, ప్రతి వ్యక్తి రైతుగా మారి, మళ్లీ తమ మాగాణంలో బంగారం పండిరచాలంటే తెలంగాణ రావాలి. నిధుల దోపిడి, నియామాల కట్టడి జరగాలి. తెలంగాణకు వచ్చే ప్రతి పైసా తెలంగాణకే ఖర్చు కావాలి. తెలంగాణలో పుట్టిన ప్రతి యువకుడికి తెలంగాణలోఉద్యోగం రావాలి. పరాయి పాలన పోవాలి. అని 2000 నాడు ఎమ్మెల్యే పదవిని వదిలి, తెలంగాణ రాష్ట్ర సమితికి 2001 ఎప్రిల్‌లో అంకుర్పాణ చేసి, కాలుకు బలపం కట్టుకొని ఆరోజే ఊరూరు తిరిగారు. ఆ సమయంలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్యమానికి మిలితం చేసి, తాను రాజీనామా చేసి, సిద్ధిపేట ఉప ఎన్నికలకు వెళ్లి బరిగీసి కేసిఆర్‌ నిలిచారు. ఎలాగైనా కేసిఆర్‌ను కట్టడి చేయాలని చాలా మంది చూశారు. కాని ఎవరి తరం కాలేదు. ఆయన ఉద్యమ ప్రస్థానంపై అనేక రాళ్లేశారు. తెలంగాణ తీసుకురాకపోతే తనను రాళ్లతో కొట్టండని కేసిఆర్‌ చెప్పారు. అనుకున్నట్లుగానే ఆయన తన ఉద్యమాన్ని రాజకీయాలకు మిలితం చేసి, కొత్త తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇదే అప్పట్లో ఒక రకంగా సంచలనమే అయినా, ప్రత్యర్థి పార్టీలు పుబ్బలో పట్టి, మగలో మాయమౌతుందన్నారు. కాని అన్ని పార్టీలను మాయం చేసి, 2018లో తనకు ఎదరే లేదని నిరూపించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తెలంగాణ అన్న పదాన్నే అసెంబ్లీలో నిషేధించారు. వెనుకబడిన ప్రాంతమన్నారు. కాని వెనుకబడేసిన ప్రాంతమంటూ గొంతెత్తిన కేసిఆర్‌, తన స్వీయ తెలంగాణ రాజకీయ అస్థిత్వానికి పునాలువేసి, తెలంగాణ కోసం ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకోసంవెళ్లారు. ప్రజల్లో రాజకీయ చైతన్యమే తెలంగాణ సాధనకు ఉపయోగపడుతుందని కేసిఆర్‌ బలంగా నమ్మారు. అయితే తెలంగాణ కోసం పార్టీలు పెట్టి, నట్టెట ముంచివారిని కళ్లతో చూసిన తెలంగాణ సమాజం కేసిఆర్‌ను పూర్తిగా నమ్మడానికి కూడా కొంత కాలమే పట్టిందని చెప్పాలి. 2004 ఎన్నికల్లో అప్పటికే తెలంగాణ తీర్మాణాన్ని డిల్లీకి పింపిన కాంగ్రెస్‌తో జతకూడి, తెలంగాణ సాధన సాగించే వ్యూహాన్ని నిర్మించారు. దాంతో తెలంగాణలో 54 సీట్లలో పోటీ చేసి, 26 సీట్లు సాధించారు. అయితే ఓ వైపు తెలంగాణ కోసం కేసిఆర్‌ ఎక్కే గడప, దిగే గడపలాగా సాగుతుంటే, కొంత మంది తమ స్వార్థం కోసం నమ్మి మంత్రి పదవులు కూడా అందేలా చేస్తే, ఉద్యమానికి ద్రోహం చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ మొదటికే మోసం చేసేలా వుందని గ్రహించిన కేసిఆర్‌, నాటి కాంగ్రెస్‌తో తెగదెంపులకే సిద్ధమయ్యారు. అంటే ఆయన తెలంగాణకోసం ఎంత అంకితభావంతో వున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో నాటిమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌నాయకుడు ఎం. సత్యనారాయణ విసిరిన సవాలను స్వీకరించి, కరీంనగర్‌నుంచి లోక్‌సభకు ఎన్నికైనా కేసిఆర్‌ రాజీనామా చేశారు. మళ్లీ ఎన్నికల్లో వెళ్లారు. ఆయనను ఓడిరచేందకు సమైక్యరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌, మంత్రులందరినీ రంగంలోకి దింపినా, రెండు లక్షల మెజార్టీతో గెలిచి, కేసిఆర్‌ నిలిచారు. తెలంగాణ ప్రజల్లో వున్న ఆత్మవిశ్వాసాన్ని ఆయన గుండె నిండా నింపుకొని, పదహారు మంది ఎమ్మెల్యేలతో ఆయన రాజీనామాలు చేయించి, ఒంటరిపోరుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. అయితే నాడు వచ్చిన ప్రజాతీర్పుతో కొంత ఇబ్బందిపడ్డ కేసిఆర్‌, ఏ ఉద్యమైనా, రాజకీయామైనా, ఎత్తుపల్లాలు సహజమే. మన అంకితభావాన్ని మరింత నింపుకొని ముందుకుసాగాలని నిర్ణయించుకొని, ఒక అడుగు వెనక పడ్డంత మాత్రాన మడమ తిప్పనిన మరోసారి బరిగీసి నిలిచారు. అయితే తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుతో ఆయన తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుతూనే వచ్చారు. 2009లో ఆయన ఇక కేసిఆర్‌ చచ్చుడా, తెలంగాణ వచ్చుడా అన్నంత నిర్ణయం తీసుకున్నారు. ఆమరణ నిరసనకు దిగారు. 2009 డిసెంబర్‌లో చేసిన నిరాహార దీక్షతో కేంద్రం దిగిరాక తప్పలేదు. తెలంగాణ ప్రకటించక తప్పలేదు. అయినా తెలంగాణకు అంత సులువుగా వదులుకునేందుకు నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు సిద్దపడలేదు. పైగా రాదనుకున్న తెలంగాణ ప్రకటన వచ్చినా, కాంగ్రెస్‌,తెలుగుదేశం నాయకుల్లో కదలిక రాలేదు. నాడు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించి, తెలంగాణకు అడ్డుపడిన సీమాంధ్ర నేతల ఒత్తిడితో, వెనక్కు తగ్గిన నాటి యుపిఏ 2 ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా మరోసారి తెలంగాణలో తెరాస రాజీనామాలు చేసి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. మళ్లీ ఆత్మాభిమానంతో నిలిచి గెలిచింది. కాని ఒక్కపైసా కూడా తెలంగాణకు ఇవ్వమంటే నోరు మెదపని కాంగ్రెస్‌నాయకులను చూసిన తెలంగాణ సమాజం రగిలిపోయింది. తెరాస 2008లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ నాటి తెరాస పక్షనేతను పట్టుకొని, నాటి సమైక్య ముఖ్యమంత్రి వైఎస్‌ రాజేంద్ర తలెక్కడ పెట్టుకుంటారని అన్న మాటలు తెలంగాణ ప్రజల్లో ఉద్యమాన్ని నింపింది. పోరాటం కేసిఆర్‌ పోరాటానికి అండగా నిలబడిరది. సకల జనులంతా కోట్లాది మంది కేసిఆర్‌లు అయ్యారు. ఎక్కడికక్కడ ఆ నాలుగేళ్ల కాలమంతా ఎక్కడ చూసినా తెలంగాణనినాదమే. ఆ పదమే గెలిచింది. ఆ జెండా కేసిఆర్‌తో ఎగిరిగింది. 2014లో తెలంగాణ ప్రకటన రానేవచ్చింది. ఆ ఎన్నికల్లో తెరాస విజయం సాధిసాధించింది. కేఆర్‌ను ముఖ్యమంత్రిని చేసింది. సంక్షేమ పాలనను అందించింది. అయినా సీయతెలంగాణలో కూడా రాజకీయ ఎత్తుడగలు, చంద్రబాబు లాంటి నాయకుడి రూపంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యహరాలు తప్పలేదు. పాలనపై నిత్యం ఏదో ఒక అడ్డంకిని సృష్టించిన కాంగ్రెస్‌కు మరోసారి తలెత్తుకోకుండా చేసి, సందు దొరికితే దూరుదామనుకుంటున్న తెలుగుదేశానికి తెలంగాణలో ఇప్పటికే నూకలు లేకుండా చేసిన, కేసిఆర్‌ ముందస్తుకు వెళ్లి, తెలంగాణ మురిసేలా విజయాన్ని మూట గట్టుకున్నారు. భవిష్యత్తు తెలంగాణకు బంగారు తెలంగాణ చేసేందుకు వున్న అడ్డంకులను ఏరిపారేశాడు. తన నాయకత్వానికి ఎదరులేదని మరోసారి నిరూపించారు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌తో దేశంలో స్వర్ణ కాంతులు తేచ్చేందుకు రాజకీయ అడుగులు వేస్తున్నారు.

అలుపెరగని యోధుడు… సాటిలేని ధీరుడు.

`తెలంగాణ చ్కెతన్య కిరణం కేసిఆర్‌.

`కాలానికి ఎదురీధిన యోధుడు.

`తెలంగాణ జాతి కోసం…జాగృతి కోసం బరిగీసి నిలిచిన నాయకుడు.

`సబ్బండ వర్గాల ఐక్యతా రాగం కేసిఆర్‌.

`ఒక్కడుగా మొదల్కె, కోట్లాది గొంతుకైన ఉద్యమ కెరటం కేసిఆర్‌.

`తెలంగాణకే నూతన అధ్యాయం లిఖించాడు.

`తెలంగాణ విముక్తికోసం ప్రాణాలు ఫనంగా పెట్టాడు.

`తెలంగాణ గుండె చప్పుడే కేసిఆర్‌.

`జ్వలించే ఉద్యమ స్వరూపం కేసిఆర్‌.

`అలలాంటి అవరోధాలు..కడలి లాంటి ఎదురు తెన్నులు ఎదుర్కొన్నాడు.

` రైతు కదలించిన ఉద్వేగమే కేసిఆర్‌.

`కేసిఆర్‌ కారణజన్ముడు…ఆదర్శప్రాయుడు.

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

చలించే హృదయం స్పందిస్తుంది. స్పందిచే మనసు ఆలోచిస్తుంది. ఆలోచించే విధానం దారి వెతుకుతుంది. లక్ష్యం నిర్ధేశించుకొని, గమ్య వైపు అడుగులు వేస్తుంది. విజయం సాధిస్తుంది. జెండా ఎగురుతుంది. అందుకు పట్టుదల, నిర్విరామ కృషి, వెనకడుగు వేయని తత్వం నిండుగా వున్నవారు ఎంతటి లక్ష్యాన్న్కెనా ముద్డాతారు. ఆచరణలో ఎన్ని అవరోధాలు ఎదురైనా అవలీలగా ఎదుర్కొంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గుండె ధ్కెర్యం చెదరరు. దారులు మూసుకున్నా వెనకడుగువేయరు. నిధోరధకాలను ఎదరించి నిలబడారు. విజేతగా నిలుస్తారు. అలాంటి విజేత ముఖ్యమంత్రి కేసిఆర్‌. 

కాలానికి ఎదురీదిన యోధుడు…

ప్రజల్లో చ్కెతన్య రగిల్చిన చాణక్యుడు. ఎదురొచ్చిన వారిని రాజకీయంగా ఎదుర్కొన్న ధీరుడు…తెలంగాణ సాధనలో అందరినీ ఏకతాటి మీదకు తెచ్చిన ఉత్తేజితుడు…తెలంగాణ కల గన్నాడు. అందరినీ ఏకం చేశాడు. ముక్కోటి తెలంగాణ వాసుల చేత జ్కె తలంగాణ అనిపించాడు. జనం నినదించేలా చేశాడు…ప్రతి ఒక్కరూ జ్కె తెలంగాణ నానాదం నామస్మరణ చేసేలా చేశాడు. తెలంగాణ జాతి కోసం..తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ వెలుగు కోసం, పీడిత పాలనుంచి విముక్తి కోసం బరిగీసి నిలిచాడు. సకల జనులను తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేశాడు. సబ్బండ వర్గాల ఐక్యతా రాగంతో జ్కె తెలంగాణ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా నినదించేలా చేశాడు. అతనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒక్కడుగా మొదల్కె, కోట్లాది మంది గొంతుకలయ్యాడు…లక్షలాది మంది పోరాట యోధులను తయారు చేశాడు…ఉద్యమ ఆకాంక్ష నింపాడు. తెలంగాణ ఏర్పాటే శరణ్యమన్న భావన అందరిలో రగిలించాడు. తెలంగాణ చరిత్రకే నూతన అధ్యాయం లిఖించాడు. తన కీర్తిని శాశ్వతం చేసుకున్నాడు. తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను సైతం ఒడ్డేందుకు సిద్దపడ్డాడు. చావు నోట్లో తలపెట్టి, తెలంగాణ సాధించాడు. తెలంగాణ అన్నది సంధితో సాధ్యం కాకపోతే సమరమే అని ముందు నుంచే ప్రజలను సన్నద్దం చేశాడు. కడలి తరంగం అంతరంగమై అలలలాంటి తెలంగాణ ఆవేశాన్ని ఉద్యమంగా మలిచాడు. జనం గొంతుకలో కేసిఆర్‌ అనే నామస్మరణ కూడా జత చేశాడు…పిడికిలెత్తి తాను నినదిస్తూ, ప్రతి ఒక్కరి చేత తెలంగాణ జపం చేయించాడు. తెలంగాణ గుండె చప్పుడు ఉద్యమానికి తోడు చేశాడు. పల్లె ప్రజల ఊపిరిని తెలంగాణ ఉద్యమానికి ఆయువు చేశాడు. తెలంగాణ సాధనే లక్ష్యమై, ఉద్యమ శ్రీకారంలో అభిమన్యుడ్కె గెలిచి, నిలిచిన సింహస్వప్నం కేసిఆర్‌. 

 రాజనీతి అన్నది ఒకరు నేర్పితే నేర్చుకునేది కాదు… చెబితే అబ్బేది కాదు. మనసులో వుండాలి. 

జనం కోసం ఆలోచించే వ్యక్తిత్వం మెండుగా వుండాలి. ఈ తరం నేతల్లో జ్కె తెలంగాణ అన్నది గుండెల నిండా నింపుకున్న ఏకైక నేతగా, ఒక్కడ్కెన నేతగా గుర్తింపు పొందాడు. జనం కోసం తన అడుగులు ఉద్యమం వైపు సాగించాడు. చలించే హృదయంలో జ్వలించేదే ఉద్యమ స్వరూపం. కడలి ఎదురొచ్చినా, అలలు అడ్డుపడినా ఆగనిది పోరాటం. అందుకే కన్నీరుపెడుతున్న తెలంగాణ గోసకు విముక్తి ప్రసాదించాడు. తన ఉద్యమ స్వరూపాన్ని తెలంగాణ యాసకు జోడిరచాడు. జనంలో మమేకమైన మాటలు చెప్పాడు. సమయాను కూలంగా పాటలు కూడా కై కట్టాడు. జనానికి నచ్చే విధంగా నచ్చ చెప్పాడు. తెలంగాణ పడుతున్న వేదన, ఆవేదన, తిప్పలు తన మాటాల్లో తూటాల్లా పేల్చాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరంతరం ప్రజలకు వివరిస్తూ వచ్చాడు. తెలంగాణ అస్ధిత్వాన్ని కాపాడుకోవడం కోసం, తెగించి కోట్లాడిన ధీరుడు. అహింసాయుతపోరాటం నడిపి, మరో స్వాతంత్య్రం సంగ్రామ విజేతశీలిగా కేసిఆర్‌ కీర్తింపబడ్డాడు. అభినవ గాంధీగా, తెలంగాణ పితగా పిలువబడుతున్నాడు. 

 బతుకు జీవుడా అని కాలం వెల్లబుచ్చుతున్న తెలంగాణ సమాజాన్ని చూసి తల్లడిల్లిన మనసు కేసిఆర్‌ది.

  ఆకలికి కూడా లెక్కలేసుకొని బతుకుతున్న తెలంగాణ సమాజాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాయకుడు కేసిఆర్‌. జనం బొంబాయికి వెళ్లి కూలికో, బొగ్గుబాయిలో బతుకులు బలికో అన్నట్లు బతుకుల దారి కోసం వెలుతున్న వలసలను చూసి గుండె చెరువైపోయి తెగించి జ్కె తెలంగాణ అన్నాడు. కంటి నుంచి కారే కన్నీరు కూడా గుండెల దాకా చేరకముందే ఆవిరైపోతున్న రైతన్న కష్టం చూసి చలించిపోయాడు. ఎడారిగా మారుతున్న తెలంగాణ మాగాణ మట్టివాసనలేకుండా,నీటి చుక్క జాడ లేకుండా నెర్రెలు బారిన పొలాలను చూసి కుమిలిపోయాడు. ఎద్దులేని ఎవుసం చేస్తున్న రైతులు కదిలించిన ఉద్వేగమే కేసిఆర్‌. నీటి కటకటలు తీరక, ఎండిన బావుల్లో చుక్క కనిపిస్తుందా? అని తొంగి చూస్తే బావుల్లో కన్నీళ్లు పడని కాలమది. పూడికల మీద పూడికలు తీయించినా, చుక్క కానరాని గడ్డు రోజులవి. గుక్కెడు మంచి నీటి కోసం నడి నెత్తిన బిందెలు ఎత్తుకొని ముళ్లు గుచ్చుకుంటున్నా, నొప్పిని భరిస్తూ కడివెడు నీళ్లు మోసుకొచ్చుకున్న తల్లులును చూసి తెలంగాణ విముక్తి కోసం నడుం బిగించాడు. ఉద్యమ కాలం నాడే చెరువుల మరమ్మత్తులు మొదలుపెట్టాడు. తెలంగాణ తెచ్చి, మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం తెచ్చాడు. ప్రతి చెరువు నిండాలి. ప్రతి ఇంటికి మంచినీరందాలి. ఏ ఆడపడుచు బిందె పట్టుకొని బ్కెటకు వెళ్లకుండా చేశాడు. మిషన్‌ భగీరధతో ఇంటింటికీ సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నాడు. చరిత్రలో ప్రతి ఉద్యమ నాయకుడికి ఒకే చరిత్ర వుంటుంది.

కేసిఆర్‌ జీవితమే ఒక చరిత్ర.

 ప్రతి పేజీ ఒక చరిత్రే..ఉద్యమ చరిత్ర…తెలంగాణ సాధన చరిత్ర…బంగారు తెలంగాణ నిర్మాణ చరిత్ర…ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చరిత్ర. ఇది ప్రపంచంలో ఏ నేతకు దక్కని అరుద్కెన గౌరవం. అది నిలుపుకున్న కేసిఆర్‌ తెలంగాణకే వరం. రైతన్నకు కన్నుల నిండా కనిపించే నీటి జాలు చూపించాడు. తెలంగాణ పుడమి తల్లికి జలాభిషేకం చేశాడు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో తెలంగాణకు నీటి గోస తీర్చాడు. గడప గడపకు సంక్షేమాన్ని మోసుకెళ్తున్నాడు. తెగించి కొట్లాడిన చేతులతోనే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నాడు. సమసమాజ నిర్మాణం సాగిస్తున్నాడు. తెలంగాణలో కరంటు వెలుగులు నింపాడు. రెప్పపాటు కూడా విరామం లేని కరంటు సరఫరా చేస్తున్నారు. రైతులకు కూడా ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాడు. రైతులకు రైతుబంధు అందిస్తున్నాడు. రైతు భీమా కూడా అందేలా చేస్తున్నాడు. దళితులకు దళిత బంధు అమలు చేస్తున్నాడు. గిరిజనులకు గిరిజన బంధు ప్రకటించాడు. కదలించే హృదయం…చలించే మనసు రెండూ కేసిఆర్‌కు వున్నాయి. అందుకే సంక్షేమ రాజ్య నిర్మాణం చేస్తున్నాడు. తెలంగాణలను అన్ని రంగాల్లో మందుంచుతున్నాడు. కన్నీరు తుడిచే కరుణామయ మూర్తిగా కళ్యాణ లక్ష్మి అమలు చేస్తూ, ప్రతి ఇంటికి పెద్దకొడుకై ఆసరా అందిస్తున్నాడు. అండగా వుంటున్నాడు. అందుకే కేసిఆర్‌ కారణ జన్ముడు… ఆదర్శప్రాయుడు…!

రైతు రాజ్యం…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నమ్మకమన్న పదం ఎంత బలమైందో, కేసిఆర్‌ పాలన అంత స్వర్ణయుగమైందని చెప్పడానికి ఎలాంటి సందేహంలేదు. తెలంగాణ ఏర్పాటుతోనే పీడిత ప్రజల కష్టాలు,కన్నీళ్లు తీరుతాయని నమ్మి, బలమైన ఆకాంక్షతో, బరువైన ఆశయంతో, పట్టుదలను సమాజానికి నింపి, ముందుండి నడిచి, సాధ్యమా అన్న పదాన్ని నిఘంటువులో లేకుండా చేసేలా తెలంగాణ సాధించిన ధీరుడు కేసిఆర్‌ చేతిలో పాలనతో తెలంగాణ మాగాణం బంగారమైపోయింది. పసిడి సిరులు పండేందుకు ఎదరు చూస్తోంది. నీటి జాడలు లేక, నెర్రలు బారి, కడుపులోనుంచి తన్నుకొచ్చే దు:ఖంతో కంటినిండా నీరును నింపుకొని, ఒలికించినా, పచ్చి జాడలేకుండాపోయిన, పొలాలు చూసి కుమిలిపోయిన రైతన్న కళ్లలో ఆనందభాష్పాలు రాలి ముత్యాలయ్యేంతగా మురిసిపోయే రోజులొచ్చాయి. ఎద్దుఏడ్చిన ఎవుసం అన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తెలుసు. అందుకే ఎవుసం సాగాలి. పండగ కావాలి. రైతు రాజు కావాలన్నదే కేసిఆర్‌ కల. అసలు తెలంగాణ సాధనే రైతుకోసం. పొలంకోసం. పచ్చని పల్లెకోసం. పచ్చని పాడిపంటలకోసం. మొత్తంగా నీటికోసం. ఆ కల జాలువారేలా ప్రతి ఊరు చెరువు ఎండాకాలంలో కూడా నిండి పొలాలకు పారుతుంటే, రైతుకు అంతకన్నా ఆనందమేముంది. కేసిఆర్‌కు అంతకన్నా సంతోషమేముంది. తెలంగాణ ఎలా వస్తుంది అన్న వారు, తెలంగాణ వస్తే ఏమైతదన్నవారు ఇప్పుడు చూసి ఆనందపడుతున్నారు. గర్వపడుతున్నారు. చిమ్మచీకట్లు కమ్మేసే పల్లెలు చూసిన తెలంగాణ ప్రజలకు పల్లె వెలుగులు చూసి మురిసిపోతున్నారంటే ఇంతకన్నా ఆనందమేముంది. ఒకటా రెండా, నాలుగేళ్లకాలంలో ఉద్యమకారుడు పాలకుడైతే పాలన ఎంత స్వర్ణమయమో, కాలం స్వర్ణయుగమో చరిత్రే తనను తాను మురిసిపోతోంది. పారే నీరు చూసి, పొలాల్లోకి రాకుండాపోతున్నాయే అని కళ్లనుంచి కన్నీరులొలి, కడుపలో దు:ఖం తన్నుకుంటూ వస్తుంటే, పెదవులు అదిమి పట్టుకొని, ఎర్రబడుతున్న కళ్లను తూడ్చుకుంటూ, నా తెలంగాణ పొలాలు ఈ నీటితో తడుస్తాయో అని కలలుకన్న కేసిఆర్‌, ఆ కలలు నిజం చేసే దేవుడయ్యాడు. అపర భగీరధుడయ్యాడు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పల్లెలు పచ్చని వనాలై, వర్రెలనుంచి నీటి జాలులు వారి, పొలాలు నిండే రోజులు రానున్నాయి. ఎన్నికల మందు ఇచ్చిన హమీలే కాదు, ప్రతి పేదకు అండగా, తోడుగా నిలిచే పథకాలు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ ఫలాలు అందిస్తూ, అందరిలోనూ చిరునవ్వును చూసేందుకు సాగుతన్న పాలన కేసిఆర్‌ది. నీరు లేక ఎవుసం సాగక, ఎండే పంటలు చూసిగుండెలు బాదుకోవడం కాన్న, బొంబాయి పోయి బతకడం మేలనుకొని, ఊళ్లు ఖాళీ చేసి, వలసలు పోయిన తెలంగాణ పల్లెలు మళ్లీ కళకళలాడి, ఊరుకు చేరుకున్న జనం సంబరాలు చేసుకుంటున్నారు. ఎవుసం చేసుకుంటే చాలు అనుకుంటున్నారు. రైతు బంధు పథకంతో ఏటా రైతుకు పెట్టుబడి రెండు పంటలు ఇస్తుంటే, ఇక ఎవుసం రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. తెలంగాణ భావి తరాలకు ఆదర్శం. తెలంగాణ వస్తే ఏమౌతుందని ప్రశ్నించిన వారికి సమాధానం. మన దేశంలో వ్యవసాయమంటేనే వాతావరణంతో జూదంలాంటింది. మన చేతుల్లో లేనిది. ఆరుగాలం కష్టించాలన్నా డబ్బు కావాలి. పంటలు పండిరచాలన్నా డబ్బుకావాలి. తీరా పంట చేతికొస్తుందన్న నమ్మకం లేని పని వ్యవసాయం. నీళ్లులేకపోతే, మబ్బులెప్పుడుపడతాయా అని ఎదురుచూడాల్సిన స్థితి. తొలకరితోనే చిరునవ్వు నవ్వుకొని, అప్పులు చేసి, భూమి దున్ని, విత్తనాలు, ఎరువులు కొని, సాగు చేయడమే తెలంగాణ రైతుకు తెలిసింది. నీరు వుండదని తెలిసినా, ఆశతో సాగించేదే తెలంగాణ వ్యవసాయం. ఆ కాలం పోయింది. నీరు లేదన్న బాధ లేదు. విత్తనాల కొరత లేదు. ఎరువుల కోసం పడిగాపులు పడాల్సిన పని లేదు. క్యూలైన్లలో ఎండలో నిలబడాల్సిన పనిలేదు. పోలీసుల లాఠీ చార్జిలు లేవు. దళారీ వ్యవస్థ అసలే లేదు. ఇక అప్పుకోసం రైతు ఎదురు చూడాల్సిన పని లేకుండా కూడాపోయింది. ఒక రైతు పాలకుడైతే, ఎవుసం బాధ తెలిస్తే, ఆ సహృదయుడు రైతు పక్షానే ఆలోచిస్తే అది తెలంగాణ ప్రభుత్వమౌతుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అవుతాడు. రైతు మురిసే కాలం వచ్చేసింది. వేలకు వేలు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన పని లేదు. తెలంగాణ ప్రభుత్వమే ఏటా ఎనమిది వేలు ఎకరాకు పెట్టుబడి అందిస్తోంది. విత్తనాలు, ఎరువులు, భూమి దున్నకానికి పనికొచ్చేలా ఆదుకుంటోంది. కరంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియిని కాలంనుంచి రెప్పపాటు కరంటు పోని రోజులు తెచ్చింది కేసిఆర్‌. చీకటి రోజులు చూసిన తెలంగాణ ప్రజలకు పగటి పూట వెలుగులు నింపే కాలం వస్తుందని ఎవరూ ఊహించలేదు. అందుకే తెలంగాణ కావాలన్నది. నిన్నటి రోజుల్లో కరంటు లేక ఎండే పంటలు, చేతికొచ్చే సమయానికి సకాలంలో నాణ్యమైన విద్యుత్‌ అందక, నీరందక పంటలు ఎండిపోవడమే చూసిన కళ్లతో, 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ వచ్చింది. ఆరుగంటల పాటు నిరంతర విద్యుత్‌ కావాలంటే కూడా ఇవ్వని రోజులనుంచి, నిరంతరం కరంటు రైతుకు అందుబాటులోకి వచ్చింది. ఎండిన బావులు, అడుగంటిన భూగర్భజాలలు, గంటపాటు నిరంతరంగా నీరందంచలేని బోర్లు, పంటలు ఎండిపోతుంటే, చూసి తట్టుకోలేక ఎన్ని బోర్లు వేసినా చుక్క కానరాక, రైతు కంట కన్నీరు మిగిలిన రోజులనుంచి, తెలంగాణ పల్లెల్లో నీటి కాలువలు. ఇదీ నేటి తెలంగాణ. వానలు కరిస్తేగాని చెరుల్లోకి చుక్క చేరని కాలంనుంచి, ఏడాది పొడవునా, చెరువుల్లో నీరు చూస్తున్న కాలం. ఇదంతా ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పం. ఆయన చలించిన వైనం. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సాగిన తెలంగాణ ఉద్యమంలో మొదటి ప్రాధాన్యతలో వున్న నీటికోసం ఆయన పడిన తాపత్రయం రైతుల కళ్లలో ఆనందాన్ని నింపుతోంది. తెలంగాణ పల్లెల్లో వెలుగులు నింపుతోంది. రైతు బంధు పథకం వచ్చాక, రైతుకు రొక్కం చేతికొచ్చాక, వ్యవసాయం మీద భరోసా పెరిగింది. ఆనందం తాండవమాడుతోంది. పల్లెలు తొలకరి కోసం ఎదరు చూస్తున్నాయి. బంగారుతెలంగాణకు బాటలు పడుతున్నాయి. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు నవ్వని రాజ్యం బాగుపడదని సామెత. కాని తెలంగాణలో రైతు నవ్విన రాజ్యం వచ్చింది. ఎవుసం చేయలేక, ఊరు విడిచి వెళ్లలేక, కడుపు కట్టుకొని బతకలేక నరకయాతన పడి, వలసలు వెళ్లి బతికిన తెలంగాణ రైతన్నల రాకతో పల్లెలు మురుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో చిన్న నీటి పారుదల పేరుతో రూపాయి బడ్జెట్‌ లేని శాఖలు ఏర్పాటు చేసి,తెలంగాణ ఎమ్మెల్యేను మంత్రిని చేసి, ఇదే తెలంగాణకు పండగ పో అన్న చరిత్ర గతానిది. కాని నేడు తెలంగాణలో ఎటు చూసిన ప్రాజెక్టుల నిర్మాణాలు. పారుతున్న జలాలు.నిండుతున్న చెరువులు. ఏడాదంతా పారుతున్న గోదారి జాలాలు. గొలుసు కట్టు చెరువులు ఒకదాని తర్వాత ఒకటి నిండుతూ, భూగర్భజలాలు పెంచుతూ, పొలాలకు నీరుచేరుతోంది. పొలాలు ధాన్యాగారాలౌతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తులు పెరిగుతున్నాయి. గిట్టుబాటు ధరలు అందుతుండడంతో రైతు మోములు నవ్వులు విరబూస్తున్నాయి. వీటన్నింటికీ తోడు రైతులు తొలకరితో మురిసినా, ఎవుసం చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేక, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి, మోస పోకుండా, ప్రభుత్వమే వారికి పెట్టుబడిని నగదు రూపంలో అందించి ఆసరాగా నిలుస్తోంది. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం కావొచ్చు. దేశంలోఎక్కడా ఏ రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమంగురించి ఆలోచన చేసి వుండకపోవచ్చు. రైతు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకొని ఓట్లు అడుక్కొని గెలిచి, రైతును నట్టెట ముంచి పాలకులను చూసిన తెలంగాణ ప్రజలు మొదటి సారిగా రైతుకు ఆర్థిక భరోసాను కూడా కల్పించిన ప్రభుత్వాన్ని కొత్తగా చూస్తున్నారు. కళ్లనిండా ఆశలను పెంచుకుంటున్నారు. వడ్డీకి వడ్డీ చక్రవడ్డీల పేరుతో ఇచ్చిన అప్పును పంట చేతికి రాగానే ముక్కు పిండి వసూలు చేసుకునే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మూలంగా ఆరుగాలం శ్రమించి పండిరచిన పంట కళ్లకద్దుకొని చూసుకునే అవకాశం రైతుకు దక్కేది కాదు. పైగా సరైన గిట్టుబాటు ధర రాక, పాత అప్పు తీరక, మళ్లీ కొత్త అప్పుచేసి, మళ్లీ ఎవుసం చేస్తేగాని తెల్లారని రోజులు అవి. ఎవరికైనా ఆశ వుంటుంది. ఒకరైతుల ఒక పంట పండిరచి, ఎంతో కొంత లాభాలు ఆర్జించిండని తెలిసినా,కనీసం అప్పులు తీర్చుకున్నాడని తెలిసినా, అదే పంటను తాను వేసి, అప్పులు తీర్చుకుందామని ఆశపడిన రైతు ఆశలు అడియాసలై, ధరలు పడిపోయి, పంటలు ఎండిపోయి బతుకు మీద విరక్తికలిగి తనువు చాలించిన రైతులు ఎంతో మంది వున్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తొద్దని ఏఏ కాలాలలో , ఏఏ భూముల్లో ఎలాంటి పంటలు పండిరచాలో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, వుండేందుకు పెద్దఎత్తున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి, గత ఏడాది తెలంగాణలో కందులు, మిర్చి సాగు ప్రోత్సహించడంతో రికార్డు స్థాయి ఉత్పత్తులు వచ్చాయి. రైతుల ఇంట సిరులు నిండాయి. రైతు శ్రేయో రాజ్య భావనకు అర్థం ఇదే. రైతు రాజ్యానికి నిదర్శనమిదే. రైతే రాజు అన్న పదానికి అర్థం ఇదే. రైతే దేశానికి వెన్నెముక అంటే ఇదే. బంగారు తెలంగాణ అంటే ఇదే. దేశానికి ఆదర్శవంతమైన పాలన అంటే కేసిఆర్‌దే. రైతు మెచ్చిన రాజ్యం నిర్మాణమయ్యిందే తెలంగాణ. రేపటి చిరునవ్వుల కాంతి తెలంగాణ. రైతు ఇంట సిరుల పంట తెలంగాణ. బంగారుతెలంగాణ.పండగై, భరోసా, రైతు ఇంట సిరుల పంటలై, ఇంటికి వెలుగులౌతాయనడంలో సందేహంలేదు. ఎనమిదేళ్ల ప్రస్థానంలో అనేక సవాళ్లు, అనేక మలుపులు ఎదురైనా, ఎదురొడ్డి నిలుస్తూ, సంక్షేమానికి ఊపిరిపోస్తూ, నిలుస్తున్నా పాలనకు ప్రజలనుంచి కేసిఆర్‌కు జేజేలు, బంగారు తెలంగాణకు బాటలు పడ్డాయి.

బిఆర్‌ఎస్‌ ఒక చారిత్రక అవసరం: మంత్రి హరీష్‌ రావు.

`బిజేపి అసమర్థ విధానాలపై దేశమంతా రాజకీయ పార్టీల తిరుగుబావుటా

`బిజేపిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.

`ఖమ్మం సభతోనే బిఆర్‌ఎస్‌ సక్సెస్‌.

`టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ, బిఆర్‌ఎస్‌ తొలి సభ నా పర్యవేక్షణలో జరగడం అదృష్టం.

`నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు రావుతో హరీష్‌ రావు. 

`ఒకే వేధిక మీద ఐదారు జాతీయ పార్టీలు. ముఖ్యమంత్రులు.

`ఇటీవల కాలంలో అరుదైన ఘట్టం.

`కేసిఆర్‌ నాయకత్వంతోనే ఇదంతా సాధ్యం.

`బిజేపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ విఫలం.

` బిజేపి అరాచక పాలనపై దేశమంతా వ్యతిరేకత.

`బిజేపి చెప్పిందొకటి చేస్తున్నదొకటి

`వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారు.

`రైతును గోస పెడుతున్నారు. 

`ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం.

`బిజేపి పాలనలో సామాన్యుడు నలిగిపోతున్నాడు

`ఎనమిదేళ్ళలో తెలంగాణ సాధించిన అధ్భుత ఫలితాలపై దేశ వ్యాప్త చర్చ.

` అందుకే బిజేపి యేతర పార్టీల ఐక్యత కేసిఆర్‌ తోనే సాధ్యం. 

`ఖమ్మం నుంచే బిఆర్‌ఎస్‌ శంఖారావం.

` బిజేపి కి ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్సే…

`బిజేపికి వణుకు మొదలైంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. ఈ రోజు అద్భుతమైన ఘట్టం ఆవిష్కరింపబడుతోంది. దేశంలో కొత్త రాజకీయ శక్తిగా అవతరించనున్న బిఆర్‌ఎస్‌ సభ గురించే దేశమంతా చర్చిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో బిజేపికి వ్యతిరేకంగా ఇలాంటి సభ జరగలేదు. బిజేపి కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే వేధిక ఏర్పాటు కాలేదు. అది తెలంగాణ కూడా తెలంగాణ నుంచి ఏర్పాటు కావడం శుభసూచకం. బిఆర్‌ఎస్‌ సభ చరిత్ర సృష్టిస్తుంది. కేసిఆర్‌ నాయకత్వం దేశానికి దిశా నిర్దేశం చేసే తరుణం ఆసన్నమైందంటున్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావుతో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు… స్పెషల్‌ డిస్కషన్‌…హరీష్‌ రావు మాటల్లో…

ప్రజల గురించి తెలిసిన నాయకుడే వాళ్లను అర్థం చేసుకుంటాడు.

 వాళ్ల సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తాడు. వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాడు. కొత్త తరం ఆవిష్కరణలు చేస్తాడు. ప్రజలు పడే ఇబ్బందులకు చలించిపోతాడు. ప్రజల కష్టాలకు మార్గం అన్వేషిస్తాడు…అలా తెలంగాణ గోసను చూసి, తెలంగాణ సమాజం పడుతున్న వెతలు చూసి ఆనాడు చలించిన నేత కేసిఆర్‌… తెలంగాణ సాధించి ప్రజలకు బహుమానంగా ఇచ్చాడు. తెలంగాణ అభివృద్ధి బంగారు తెలంగాణ కు బాటలు వేశాడు. తెలంగాణ సస్యశ్యామలం చేశాడు. అన్ని రంగాలలో తెలంగాణ ను ముందుంచాడు. ప్రగతికి తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌ చేశాడు. సంక్షేమ సారధిగా మన్ననలు అందుకుంటున్నాడు. తెలంగాణ అభివృద్ధి దేశమంతా కావాలని ప్రజలే అడిగేలా చేస్తున్నాడు…అదీ కేసిఆర్‌ అంటే…అదీ నాయకుడంటే…చరిత్ర తిరగ రాయాలన్నా కేసిఆరే… చరిత్ర సృష్టించాలన్నా కేసిఆరే…చరిత్ర గతిని మార్చాలన్నా కేసిఆరే..!

బిజేపి అసమర్థ విధానాలపై దేశమంతా రాజకీయ పార్టీల తిరుగుబావుటా ఎగురవేస్తున్నాయని చెప్పడానికి ఖమ్మంలో జరిగే బిఆర్‌ఎస్‌ సభ నిదర్శనం. …

దేశంలో వున్న అనేక రాజకీయ పార్టీలు బిజేపి అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. ఇతర రాజకీయ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేసి, బిజేపి తిరుగులేని శక్తిగా మారాలని చూస్తోంది. మరో వైపు తీవ్ర ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. బిజేపి ఎనిమిదేళ్ల పాలనలో దేశంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిజేపిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. ఏ ఒక్క రాష్ట్రం, ఓ ఒక్క ప్రాంతం కూడా సంతోషంగా లేదు. పూర్తిగా బిజేపి ఆధిపత్య రాజకీయాల కోసం తప్ప ప్రజా సంక్షేమ రాజకీయాలు వదిలేసింది. 

ఖమ్మం సభతోనే బిఆర్‌ఎస్‌ సక్సెస్‌. 

దేశంలో ఇటీవల కాలంలో బిఆర్‌ఎస్‌ ఖమ్మం సభ రాజకీయాలలో అపురూప ఘట్టం. ఖమ్మం సభ వేధికగా బిఆర్‌ఎస్‌ శంఖారావం పూరిస్తోంది. బిజేపిని గద్దె దించడమే లక్ష్యంగా బిజేపి యేతర పార్టీలను కూడగట్టడంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ సఫలీకృతులయ్యారు. బిఆర్‌ఎస్‌ దేశ రాజకీయాలలో సంచలనం నమోదు చేస్తుంది. ఎనిమిదేళ్లలో తెలంగాణ అనేక అధ్భుతాలు ఆవిషృతమయ్యాయి. తెలంగాణ సాధించుకున్నాక జరిగిన అభివృద్ధిని చూసి దేశమే అబ్బురపడుతోంది. మా రాష్ట్రాలలో కేసిఆర్‌ లాంటి నాయకుల నాయకత్వాలు వుంటే బాగుండు అనుకుంటున్నారు. తెలంగాణ లో అమలౌతున్న సంక్షేమ పథకాలు మా రాష్ట్రాలలో ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు. అందుకే బిఆర్‌ఎస్‌ తో కలిసి నడిచేందుకు దేశంలోని అనేక రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయి.

టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ, బిఆర్‌ఎస్‌ తొలి సభ నా పర్యవేక్షణలో జరగడం అదృష్టం.

 కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ జెండా ఎత్తుకున్న నాడు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఆనాటి తొలి సభ ఏర్పాట్లు నా పర్యవేక్షణలోనే జరిగాయి. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ తొలి సభ ఏర్పాటు పర్యవేక్షణ బాధ్యతలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాకే అప్పగించారు. అందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సభల నిర్వహణ బాధ్యతలు నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఒకే వేధిక మీద ఐదారు జాతీయ పార్టీలు. 

ముఖ్యమంత్రులు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సందర్భం లేదు. చాలా కాలం తర్వాత ఒక చారిత్రక ఘట్టం ఆవిషృతం కానున్నది. ఒకే వేదికపై ఐదారు జాతీయ రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు వేధిక పంచుకోవడం అంటేనే బిజేపి పతనం ఇక్కడి నుంచే మొదలైనట్లు లెక్క. అందరూ కలిసి బిజేపి వ్యతిరేఖ గళంతోపాటు, భవిష్యత్తు దేశ అవసరాలు, ప్రజా సంక్షేమం పై ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. బిఆర్‌ఎస్‌ కు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి సంఫీుభావం తెలియజేసేందుకు వస్తున్నారు. ఇంతకన్నా గొప్ప సందర్భం ఇటీవల కాలంలో లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలపై దేశంలోని అనేక రాజకీయ పార్టీలు ప్రభావితమయ్యాయి. కేంద్రం నుంచి కనీస సహకారం లేకున్నా ఎమనిదేళ్లలో అద్భుతాలు సృష్టించిన కేసిఆర్‌ దేశానికి ప్రధాని అయితే ఈ పథకాలన్నీ దేశ వ్యాప్తంగా అమలు చేయగలరనే నమ్మకం వారిలో కలిగింది. అందుకే కదలివస్తున్నారు. ప్రజలు తరలిరానున్నారు. ఇటీవల కాలంలో అరుదైన ఘట్టం. కేసిఆర్‌ నాయకత్వంతోనే ఇదంతా సాధ్యమౌతోంది. ఇలా అన్ని రాజకీయ పార్టీలను 

బిజేపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ విఫలం.

 దేశంలో కాంగ్రెస్‌ పార్టీ నానాటికీ ప్రాభవం కోల్పోతోంది. ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమౌతోంది. బిజేపి అరాచక పాలనపై దేశమంతా వ్యతిరేకత కనిపిస్తున్నా కాంగ్రెస్‌ ప్రజలకు చేరువకాలేకపోవడం మూలంగా బిజేపి ఒంటెద్దుపోకడలు పోతోంది. బిజేపి చెప్పిందొకటి చేస్తున్నదొకటి. దేశంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్య పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో నింపాల్సిన ఉద్యోగాలు ఇవ్వడం లేదు. పైగా వాటన్నింటినీ ప్రైవేటు పరం చేయడం జరుగుతోంది. 

వ్యవసాయ రంగాన్ని బిజేపి కేంద్ర ప్రభుత్వం భ్రష్టు పట్టించింది.

 దేశంలో వ్యవసాయ రంగానికి మంచి రోజులు తెస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన బిజేపి ఆది నుంచి రైతు వ్యతిరేక విధానాలనే అనుసరిస్తోంది. రైతును గోస పెడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం. బిజేపి పాలనలో సామాన్యుడు నలిగిపోతున్నాడు. 

తెలంగాణకు బిజేపి తీరని అన్యాయం చేసింది.

 రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు మంజూరు చేయలేదు. జాతీయ ప్రాజెక్టులు తమ విధానంలో లేవని చెప్పి, బిజేపి పాలిత రాష్ట్రాలలో ప్రాజెక్టులకు అనుమతినిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని ఎన్ని సార్లు అడిగినా ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కుదరదన్నారు. గిరిజన యూనివర్శిటీ ఇవ్వలేదు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ గుజరాత్‌ కు తరలించుకుపోయారు. ఐటిఐఆర్‌ ఇవ్వలేదు. తెలంగాణ కు బిజేపి చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 

ఎనమిదేళ్ళలో తెలంగాణ సాధించిన అధ్భుత ఫలితాలపై దేశ వ్యాప్త చర్చ. అందుకే బిజేపి యేతర పార్టీల ఐక్యత కేసిఆర్‌ తోనే సాధ్యం. 

ఖమ్మం నుంచే బిఆర్‌ఎస్‌ శంఖారావం. బిజేపి కి ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్సే…దేశంలో బిజేపికి ప్రత్యామ్నాయ శక్తి అవసరం వచ్చింది. దేశ ప్రజలు బిజేపి పాలనలో ఆగమౌతున్నారు. ముఖ్యంగా రైతాంగం అనేక బాధలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు అదను చూసి అమలు చేసేందుకు కాచుకొని కూర్చున్నది. అలాంటి దుర్మార్గమైన చట్టాలు దేశ రైతులకు గుది బండలు కావొద్దంటే ప్రజలు బిఆర్‌ఎస్‌ ను అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రజలు ఎంతో విజ్ఞులు. దేశంలో ఏం జరుగుతుందో గమనిస్తూనే వుంటారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బిజేపిని ఇంటికి పంపాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. బిఆర్‌ఎస్‌ వారికి ఆశా కిరణంగా కనిపిస్తోంది. అందుకే దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు కూడా బిఆర్‌ఎస్‌ కలిసి నడవాలని అనుకుంటున్నాయి. ఇది ఎంతో ఆహ్వానించదగ్గ పరిణామం. 

బిజేపికి వణుకు మొదలైంది.

 తెలంగాణలో ఉద్యమం మొదలుపెట్టిన నాడు ఎంతో మంది ఎన్నో మాట్లాడారు. అప్పటి ప్రభుత్వాలు అనేక నిర్భందాలను కూడా పెట్టింది. ఇప్పుడు కూడా బిజేపి చేస్తున్న అరాచకం మన కళ్లముందు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తుందో చూస్తూనే వున్నాం. బిఆర్‌ఎస్‌ ను ఎలాగైనా నిలువరించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఐటి, ఈడిలను వినియోగిస్తున్నారు. భయపెట్టిస్తున్నారు. కానీ ఇలాంటి ఎన్నో చూసి, తెలంగాణ సాధించిన కేసిఆర్‌ బిజేపి దుష్ట పన్నాగాలకు భయపడతాడా? అనుకున్న లక్ష్యం సాధించకుండా కేసిఆర్‌ ఎప్పుడూ నిష్క్రమించలేదు. విశ్రమించలేదు. విస్మరించలేదు. విరామం తీసుకోలేదు. అలుపెరగని పోరాటం చేయడంలో కేసిఆర్‌ తర్వాతే ఎవరైనా… అది బిజేపి నేతలకు అర్థమయ్యే రోజులు దగ్గరలోనే వున్నాయి. కేసిఆర్‌ రాజకీయ చాణక్యం ఎంత గొప్పదో త్వరలోనే చూస్తారు.

బీఆర్ఎస్ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు

మైదానమంతా కలియతిరిగి బీఆర్ఎస్ నాయకులు, పోలీసు, ట్రాఫిక్ అధికారులకు సూచనలు చేసిన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు

బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఖమ్మం సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ఆదివారం ఉదయం పరిశీలించారు, పర్యవేక్షించారు.ఈనెల 18వ తేదీన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరుగుతుంది.ఈ సభకు ఉమ్మడి ఖమ్మం,పక్కనే ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచే కాక ఆంధ్రప్రదేశ్,చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు,శ్రేయోభిలాషులు 5 లక్షల మందికి పైగా హాజరు కానున్నారు.ఈ దృష్ట్యా బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గాను బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తున్నది.ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు గంటన్నరకు పైగా మైదానమంతా కలియతిరిగి స్టేజీ నిర్మాణం,వాహనాల పార్కింగ్,ఎల్ఈడీ స్క్రీన్స్,సీటింగ్ ఏర్పాట్లు,వీఐపీ, కళాకారులు, ప్రెస్ అండ్ మీడియా గ్యాలరీలు తదితర ఏర్పాట్లను ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు క్షుణ్ణంగా పరిశీలించారు.వారు సభ ఏర్పాటుకు సంబంధించిన మ్యాపును పరిశీలించి బీఆర్ఎస్ నాయకులు, పోలీసు, ట్రాఫిక్ అధికారులకు పలు సలహాలిచ్చారు,సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్సీ వెంట జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు,బీఆర్ఎస్ నాయకులు బెల్లం వేణు తదితరులు ఉన్నారు.

నకిలీ వంటనూనె మరియు బియ్యం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు

హనుమకొండ క్రైం నేటిధాత్రి           

నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠాకు చెందిన నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు 1 ఫోర్ వీలర్ (టాటా ఏ సి ఈ), 1 ద్వీచక్ర వాహనం, 1 నకిలీ వంటనూనె డబ్బ, 1 బియ్యం బస్తా, 24 ఖాళి బియ్యం బస్తాలు, 1 బియ్యం బస్తాలు కుట్టే మిషన్, 1 త్రాసు, 04 సెల్ ఫోన్లు మరియు 10 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, క్రిష్ణ జిల్లాకు చెందిన 1. పెట్ల దావీదు (35), పునాదిపహాడ్, కంకిపహాడ్ మండలం, 2. ఎరుగుల మహేష్ (26), కోడూరు మండలం, ౩. నిడమర్తి విజయ్ (32), కొలవిన్ను, కంకిపాడు మండలం, 4. తటుకురి రవి (25), కొలవిన్ను, కంకిపాడు మండలం చెందిన నిందుతులు.   

ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ టాస్క్ ఫోర్స్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన ఈ ముఠాలో సభ్యులు సులువు డబ్బు సంపాదించుకోవాలని నలుగురు ముఠాగా ఏర్పడి సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని విజయవాడ నుండి టాటా ఏ సి లో బయలుదేరి మార్గమధ్యంలో దొడ్డు బియ్యం కొని, వాటిని వారి వద్ద కల బియ్యం బస్తాలలో, మిషన్ ద్వార కుట్టి ఇవి సన్న బియ్యం అని నమ్మబలికి తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి, మొదట నిజమైన సన్న బియ్యం చూపించి, తరువాత వారి వద్ద కల దొడ్డు బియ్యం బస్తాలను తెలియకుండా ఇచ్చేవారు. ఇదేవిదంగా వీరు స్క్రాప్ షాప్స్ వద్దకు వెళ్లి కొత్తగా ఉండే వంటనూనె డబ్బాలు కొనుగోలు చేసి అందులో 12 లీటర్లు వరకు నీటితో నింపి, అందులో 3 పాకెట్స్ నూనెతో నింపేవారు. అట్టి వాటిని మా వద్ద ఒకటే డబ్బ మిగిలిఉంది, తక్కువ ధరకు ఇస్తాము అని నమ్మబలికి అమ్ముతుంటారు. ఇదే విధంగా మిల్స్ కాలనీ ఏరియాలో అమ్మగా, కేసు నమోదు అయినది. ఈ రోజు టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు నిఘాపెట్టి అట్టి ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం అయినది. ఈ ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏ సి పి డా. ఏం. జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్, వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఎస్సైలు నిసార్ పాషా, లవణ్ కుమార్ ఏ ఏ ఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ అశోక్, మాధవ రెడ్డి, స్వర్ణలత కానిస్టేబుళ్లు శ్యాం, సురేష్, నాగరాజు, నవీన్, రాజేష్,బిక్షపతి, లను అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అభినందించారు.

పని మంతుడు…గుణవంతుడు.

`హరీష్‌ సేవా భావం… పేదలకు వరం!

`ఎదురులేని నాయకుడు… పేదల దేవుడు.

`హరీష్‌ అడుగు…పార్టీకి గొడుగు.

`జెండా ఆవిష్కరణ నుంచి మొదలు…

`జెండా రెపరెపల దాకా అదే జోరు…

`ట్రబుల్‌ షూటర్‌ గా మంచి పేరు…

`ఉద్యమమైనా…పోరాటమైనా ఉరకలెత్తిస్తారు…

`పాలనలో సంక్షేమ ఫలాలందిస్తారు…

`పల్లె ప్రజల గుండెలకు దగ్గరయ్యారు…

`ఎండిన పల్లెల గొంతులు మిషన్‌ కాకతీయతో తడిపారు….

`కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం చేశారు…

`ఇప్పుడు తెలంగాణకు వైద్యం చేస్తున్నారు…

`వైద్యంలో తెలంగాణను అగ్రగామి చేస్తున్నారు…

`వైద్యంలో రంగంలో విప్లవం సృష్టిస్తున్నారు…

`ఆర్థిక గతిని పరుగులు పెట్టిస్తున్నారు.

`రాజకీయ రణమైనా…పాలనలో భాగమైనా శభాష్‌ అనిపించుకున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అంతే కాదు పని రాక్షసుడు అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. ఎందుకంటే పిలిస్తే పలికే నాయకుడు. సమాచారం అందిస్తే క్షణాల్లో స్పందింస్తాడు. పార్టీ అప్పగించిన పనిని విజయవంతం చేస్తాడు. ఉద్యమ కాలంలో కాలుకు బలం కట్టుకొని తిరిగి, ఊరూర తెలంగాణ ఉద్యమ చైతన్యం నింపాడు. నాయకుల్లో తెలంగాణ ఆవశ్యకత పెంచాడు. వారిలో జై తెలంగాణ నినాదం నింపాడు. వారి ఎన్నికల్లో అన్నీ తానై ప్రచారం చేశాడు. వారి గెలపులో కీలకభూమిక పోషిస్తూ వచ్చాడు. ఏ ఎన్నికైనా సరే తన భుజస్కంధాల మీద వేసుకొని, ఆ నాయకులను గెలిపించుకుంటూ వచ్చారు. పార్టీ బలం పెంచుకుంటూ పోయారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు బలమైన పునాదులు పడడంలో హరీష్‌రావు అహర్నిషలు శ్రమించారు. పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేశారు. అందుకే ట్రబుల్‌షూటర్‌ అంటారు. ప్రజలు అడిగింది చేసి పెడతాడు. ప్రజలకు ఆపద్భాందవుడుగా కనిపిస్తాడు. ఆత్మీయత కురిపిస్తాడు. అండగా వుంటాడు. నమ్ముకున్నవారికి దేవుడౌతాడు. వారిని కాపాడుకుంటాడు. భరోసా కల్పిస్తాడు. ఏ కష్టమొచ్చిందని ఎవరు వెళ్లినా ఆదుకుంటాడు. ఆపదలో వున్నారని తెలిస్తే అక్కడ వాలిపోతారు. ప్రజలకు చేరువగా వుంటారు. పేదలంటే ఎనలేని ప్రేమ, గౌరవం. ప్రజలంటే ఆయనకు ప్రాణం. ఆయనే సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్‌రావు. ప్రజలు ఆయన దగ్గరకు రావడానికి జంకరు. బంధువొచ్చినంత సంతోషంగా ఆయన దగ్గరకు వెళ్తారు. ఎక్కడా హంగూ, ఆర్భాటం వుండదు. సామాన్యులతో కలిసి కలివిడిగా వుంటాడు. దర్పం ఎక్కడా కనిపించదు. సామాన్యుడిలా ప్రజల మధ్యనే వుంటాడు. అందుకే ప్రజలు కూడా ఇంటి మనిషికి చెప్పుకున్నట్లే సమస్యలు చెప్పుకుంటారు. నిత్యం జాతరే…ప్రజలకు సేవ చేయడం హరీష్‌రావు అదృష్టంగా భావిస్తారు…హరీష్‌ రావు ప్రజా నాయకుడుగా దొరకడం సిద్దిపేట ప్రజలు తమ భాగ్యంగా చెప్పుకుంటారు. 

హరీష్‌రావు సేవా భావం గురించి సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి ఊరు చెబుతుంది.

 ప్రతి ఒక్కరూ చెబుతారు. అంతగా ప్రజలతో మమేకమై రాజకీయాలు చేసే నాయకులు చాలా తక్కువ. సిద్దిపేట నియోజకవర్గంలోని ఏ గ్రామ వాసి తన వద్దకు వచ్చినా గుర్తుంచుకొని పేరు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి ఆయనది. అందుకే చాలా మంది నేను ఫలానా చెప్పుకోవాల్సినంత అవసరం లేకుండానే వారి సమస్యలు తీర్చుతుంటారు. అందుకే పేదల దేవుడని అందరూ కొనియాడుతుంటారు. ఉద్యమ కాలంలో ఆయన వేసిన రాజకీయ అడుగులే బలమైన పునాదులుగా సేవా ప్రపంచం సృష్టించాడు. ప్రజా సేవకు అంకితమైన నాయకుడు హరీష్‌రావు అని కీర్తించబడుతుంటాడు. ఎప్పుడైతే తాను ఎమ్మెల్యే అయ్యాడో అప్పటినుంచి సిద్ధిపేటను అభివృద్ధిలో పరుగులుపెట్టించారు. ఓ వైపు ఉద్యమం, మరో వైపు అభివృద్ధి మంత్రంతో ఆయన అలుపెరగని ప్రయాణం సాగించాడు. ఉద్యమ కాలంలో ఓ వైపు తెలంగాణ అంతా తిరగాల్సిన పరిస్ధితి. మరో వైపు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఈ రెండూ ఏ కాలంలో నిర్వర్తించి, ప్రజల మన్ననలు పొందిన నాయకుడు హరీష్‌రావు. ఒకనాడు సిద్దిపేట కరువుతో అల్లాడిన ప్రాంతం. ఇప్పుడు సస్యశ్యామలానికి నిదర్శనం. ఎటు చూసినా నీళ్లే…ఎక్కడ కనిపించినా కాలువలే…పక్కనే రంగనాయక సాగర్‌ లాంటి రిజర్వాయర్‌ నిర్మాణం. ఒకనాడు సిద్దిపేట నియోజకర్గంలో పశువులకు కూడా మంచినీళ్లు అందలేని పరస్ధితి. కాని ఇప్పుడూ ఊరూరా పసిడిసిరుల రaరి…

తెలంగాణ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ సాగించిన ఉద్యమ యజ్ఞంలో ఆయనకు తోడుగా పడిన తొలి అడుగు హరీష్‌రావు.కేసిఆర్‌తో వుంటూ, కేసిఆర్‌ ఆదేశాలను విజయవంతం చేసిన నాయకుడు హరీష్‌రావు. ఎన్నికల సమయంలో హరీష్‌రావు పడిన కష్టం మాటల్లో చెప్పలేనిది. తన నియోజకవర్గంలో ప్రజలు తాను చేసిన అభివృద్దిని చూసి, ఓట్లేస్తారని బలంగా నమ్మిన నాయకుడు హరీష్‌రావు. తాను ప్రచారం చేయకపోయినా గెలస్తున్న ఏకైక నాయకుడు హరీష్‌రావు. ఆయన ఏ ఎన్నికల్లోనూ గల్లీగల్లీ తిరిగి ప్రచారం చేయరు. అలా ప్రజలు హరీష్‌రావును గుండెల్లో పెట్టుకున్నారు. ప్రతి ఎన్నికలోనూ గెలిపిస్తూ వస్తున్నారు. 2005 ఎన్నికల్లో ఆయన తొలి విజయం అందుకున్న నాటి మెజార్టీని ప్రతి ఎన్నికలోనూ పెంచుకుంటూ లక్షకు పైగా మెజార్టీ సాధిస్తూ, ప్రజల గుండెల్లో తన స్ధానం పదిలం చేసుకుంటన్న నాయకుడు హరీష్‌రావు. ఊరూర తెలంగాణ జెండా ఎగరేసినా, తనకు అప్పగించిన పాలనా పరమైన పదవులు నిర్వహించినా సక్సెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ హరీష్‌రావు. ఉద్యమమైనా, పోరాటమైనా ఉరకలెత్తించి, ప్రజల్లో తెలంగాణ భావన నింపడంలో హరీష్‌రావు పాత్ర గొప్పది. 

 ఇక పాలన విషయానికి వస్తే ఆయన పరిపాలనా పరమైన పనుల్లో ప్రతి క్షణం పరిపూర్ణం.

 తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన చేసి సేవ అనన్య సామాన్యమైంది. ఏక కాలంలో అటు మిషన్‌ కాకతీయ, ఇటు ప్రాజెక్టుల నిర్మాణాలను సమన్వయం చేసుకుంటా ఆయన చూపిన చొరవ సామాన్యమైంది కాదు. తెలంగాణలోని సుమారు 46 వేల చెరువుల పునరుద్దరణ అన్నది ఒక యజ్ఞంలా చేపట్టి, మూడేళ్లలో చెరువులకు జలకళ తీసుకురావడం అన్నది సామాన్యమైన విషయంకాదు. ఇలాంటి పనులు అందరి వల్ల కాదు. ఇక కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం రాత్రిపగలు అన్న తేడాలేకుండా, ప్రాజెక్టు వద్దనే నిద్రలు చేసి, దగ్గరుండి పూర్తి చేయించిన నాయకుడు హరీష్‌రావు. ప్రపంచంలో అలా మనసుపెట్టి పనులు పూర్తి చేసిన నాయకుడు మరొకరు కనిపించరు అని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా వుంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మిషన్‌ కాకతీయ పనులు మొదలయ్యాయి. కాని హరీష్‌రావు తాను ఎమ్మెల్యేగా వున్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో శ్రమదానం పేరుతో తన నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో చెరువుల మరమ్మత్తులు దగ్గరుండి చేసిన ఏకైక నాయకుడు హరీష్‌రావు. అలా మిషన్‌ కాకతీయకు అడుగు పడిరది. ఆ తర్వాత తెలంగాణకు వరమైంది. ఎండిన పల్లెల గొంతులు మిషన్‌ కాకతీయతో పడిపారు. ఊరూరు పచ్చదనం వెల్లివిరిసేలా చేశారు. కాలువలు తవ్వించి మరీ చెరువులు నింపారు. ఎండా కాలంలో కూడా ఎక్కడా చెరువులు ఎండకుండా చూసుకున్నారు. నిత్యం నీటితో చెరువులు కళకళలాడేలా చేశారు. 

ఇప్పుడు తెలంగాణకు వైద్యం చేస్తున్నారు. మరో వైపు ఆర్ధిక పరిపుష్టిని సమన్వయం చేస్తున్నారు.

 తెలంగాణ వెనుకబాటులో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం శాపం. కాని ఇప్పుడు తెలంగాణ వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో హరీష్‌రావు చేస్తున్న ప్రయత్నాలు అనేక సత్పలితాలిస్తున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీల ఎర్పాటు ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే చాలా జిల్లా మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణ దశల్లో వున్నాయి. తెలంగాణలో అనేక జిల్లాలో వంద పడకల ఆసుపత్రుల నిర్మాణాలు జరిగాయి. మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. అటు ఆరోగ్య శ్రీతోపాటు, ఇటు ప్రభుత్వ వైద్యం కూడా పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. వరంగల్‌ లాంటి మహానగరంలో సుమారు 2వేల పడకల అత్యాధునికి సదుపాయాలా ఆసుపత్రి నిర్మాణం శరవేంగంగా జరుగుతోంది. హైదరాబాద్‌ చుట్టూ నాలుగు వైపుల నాలుగు అతి పెద్ద ప్రభుత్వాసుపత్రుల నిర్మాణం మొదలైంది. ఇక ప్రతి ఊరిలోనూ ఆసుపత్రుల ఏర్పాటు, నగరాల్లో బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసి, పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవడం జరిగింది. ఇదంతా కార్యదక్షత వున్న నాయకుడైన హరీష్‌రావు చొరవకు నిదర్శనం. ఆనాడు టిఆర్‌ఎస్‌ బలోపేతం చేసినా, ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను దేశవ్యాప్త విస్తరణకౖైెనా తొలి ప్రాధాన్యం హరీష్‌రావుకే…ఖమ్మం సభ భాధ్యతలు ఆయనకే…దటీజ్‌ హరీష్‌రావు…

రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా నూతన కలెక్టర్ కార్యాలయం. ప్రారంభించారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

కొత్తగూడెం కలెక్టర్ జిల్లా కార్యాలయాల సముదాయపు భవనం అంగరంగ వైభవంగా ప్రారంభించుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జడ్పి చైర్మన్ తదితర ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్ డా శాంతి కుమారి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆసాంతం దిగ్విజయంగా నిర్వహించుటలో సహకరించిన జిల్లా ప్రజా ప్రతినిధులకు, పాత్రికేయులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు అనధికారులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నూతన కలెక్టరేట్ భవనం అద్భుతంగా నిర్మించుకున్నారని ఎటుచూసినా పచ్చని వాతావరణ కనిపిస్తుందని సీఎం అభినందించడం చాలా సంతోషమని చెప్పారు. నేటి నుండి అన్ని శాఖలు ఒకే సముదాయంలోకి రానున్నాయని, తద్వారా జిల్లా ప్రజలకు సుపరిపాలన అందుబాటులోకి రానున్నదని చెప్పారు. అన్ని శాఖలు ఒకే సముదాయంలో ఉండటం వల్ల ప్రజలకు సేవలు మరింత చేరువ కానున్నాయని చెప్పారు. ప్రజలకు కూడా ఎంతో సౌలభ్యత ఉంటుందని, గతంలో వేరు వేరు చోట ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వల్ల ప్రజలు అన్ని శాఖలకు తిరగాల్సిన పరిస్థితి ఉండేదని నేడు అటువంటి అవసరం లేకుండా ఒకే సముదాయంలో ఉన్నందున వారి సమస్యలు పరిష్కరించడానికి సులువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించడానికి అవకాశం కలుగుతుందని జిల్లా ప్రజలకు కూడా ఎంతో సౌకర్యం ఉంటుందని తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే జిల్లా అధికారుల నివాస స్థలాలు కూడా నిర్మించుకున్నామని, జిల్లా అధికారులు నిరంతరం అందుబాటులో ఉండే అవకాశం ఉన్నదని ఇది ప్రజలకు ఎంతో అనుకూలతగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి అధునాతన అంగులతో సువిశాలమైనటువంటి భవనంతో పాటు పచ్చని చెట్లు, పూలవనంతో నిండి ఉన్నటువంటి కలెక్టరేట్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.కలెక్టర్ అనుదీప్ ఛాంబర్ లో పుష్పగుచ్చం అందేయడం జరిగింది 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

నూతనంగా ప్రారంభించిన కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ మరియు వనమా వెంకటేశ్వరరావు కలెక్టర్ ని తన ఛాంబర్ లో.సీట్లో కూర్చోబెట్టి పుష్పగుచ్చం ఇవ్వటం జరిగింది

ఒడిషా రాష్ట్రం నైనీ ఏరియాలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరన 

సింగరేణి ఎస్ సి, ఎస్ టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

సింగరేణి ఎస్ సి, ఎస్ టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ రోజు ఒడిషా రాష్ట్రంలోని, అంగుల్ జిల్లా, నైని ఏరియా సింగరేణి ఆఫీస్ నందు ఎస్ సి ఎస్ టి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నైనీ ఏరియా పి ఓ చౌదరి గారు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నైనీ బ్లాక్ సింగరేణి కి ఒక మణిహారం వంటిది అని చౌదరి తెలిపారు. సంవత్సరానికి పది మిలియన్ టన్నుల సామర్థ్యం గల నైనీ బ్లాక్ త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. సింగరేణి ఎస్ సి ఎస్ టి అసోసియేషన్ సభ్యులు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఈ జియాలజిస్ట్ చంద్రమౌళి, ఏజిఎం జియాలజి పంకజ్, మనేజర్ బ్రజేష్ కుమార్, ఎస్ ఈ (ఈ&ఎం) ముత్తువేల్, అసోసియేషన్ సభ్యులు కనుకుల తిరుపతి, ఎంవి రావు, ఇరుగురాళ్ళ శ్రీనివాస్, బందెల విజేందర్, పి.సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సకల హంగులు….అధునాతన సౌకర్యాలతో

ప్రారంభానికి ముస్తాబైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ నూతన భవన సముదాయపు భవనం … జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా

అందరికీ అందుబాటులో ఉండేలా కొత్తగూడెం నుండి పాల్వంచ వెళ్ళు జాతీయ రహదారి ప్రక్కన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌)

 సిద్ధం అయినట్లు చెప్పారు. ఈ భవనాన్ని 12వ తేదీ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాంఛనంగా ప్రారంభించనున్నారని చెప్పారు.

*26 ఎకరాల్లో ఐడిఓసి*

 నూతన జిల్లాలు ఏర్పాటు తదుపరి ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 26 ఎకరాల కె.ఎస్.ఎం స్థలంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం 56.50 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. ఐడీవోసి లొనే

 జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించినట్లు చెప్పారు.

 

*సకల హంగులు..*

 

IDOC లో 56 శాఖలకు గదులను నిర్మించారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల కోసం మూడు చాంబర్లను, విజిటర్స్‌ వెయింటింగ్‌ హాల్‌తో పాటు, ఇంటిగ్రేటెడ్‌ మీటింగ్‌ హాల్‌ను నిర్మించారని చెప్పారు. కలెక్టర్‌, ఇద్దరు అదనపు కలెకర్లు, పరిపాలనా అధికారి చాంబర్లను కేస్ట్‌ సీలింగ్‌ (సెంట్రల్‌ ఏసీ) చేశారు. సమీకృత సమావేశ మందిరాన్ని సైతం సెంట్రల్‌ ఏసీగా మార్చారు. జీ+2 పద్ధతిన నిర్మించిన కలెక్టరేట్‌లో అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. కలెక్టరేట్‌ పై భాగంలోకి చేరుకునేందుకు రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మాణామైన ఐ.డి.ఓ.సి భవనం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలువనుందని చెప్పారు.

ఈ మేరకు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లును పర్యవేక్షించారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు అన్ని శాఖల జిల్లా అధికారులు కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఐడీవోసికి హెలికాప్టర్ లో వస్తారని, పోలీసుల గౌరవ వందనం, ఐడీవోసి శిలా ఫలకం అవిష్కరణ, కలెక్టర్ ఛాంబర్ పరిశీలన తదుపరి జిల్లా అధికారులతో సమీక్ష, తదుపరి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు వారి వారి శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని చెప్పారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నిజంగా..బిజేపికి సినిమానే..నా?

`మంత్రి కేటిఆర్‌ అన్నట్లు జరనుందా?

`సెస్‌ ఎన్నికలలో బిజేపి ఎందుకు ఓడిపోయింది.

`రైతుల్లో బిజేపి స్థానం లేదన్నది స్పష్టమైందా?

`బిజేపి అతి విశ్వాసం మొదటికే వస్తుందా?

` టిడిపితో కలిస్తే తప్ప బిజేపికి మనుగడ లేదా?

`సామాన్యుల కష్టాలకు ధరల భారం కారణం కాదా?

`బిజేపి పాలిత రాష్ట్రాలలో ప్రత్యేకంగా అమలౌతున్న పథకం ఏమైనా వుందా?

`తెలంగాణలో అమలౌతున్న పథకం ఒక్కటన్నా బిజేపి అందిస్తోందా?

`సంక్షేమం విస్మరించిన బిజేపిని రాష్ట్రాలలో ప్రజలు నమ్ముతారా?

`టిడిపితో జతకట్టి నిండా మునుగుతారా?

`తెలంగాణ కనీసం సింగిల్‌ డిజిట్‌ సీట్లు వచ్చేనా?

`బిఆర్‌ఎస్‌ ను ఎదుర్కొనే నాయకులు బిజేపిలో వున్నారా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలోనే కాదు దేశంలో జరిగే అన్ని ఎన్నికలలో బిజేపికి సినిమా కనబడడం తప్పదా? సీనంతా మంత్రి కేటిఆర్‌ అన్నట్లు జరనుందా? సహజంగా మన దేశంలోనే కాదు, రాష్ట్రాలలో కూడా ఒకటికి, రెండుసార్లు ప్రజలు అధికారం కట్టబెట్టినా, మూడో సారి అధికారం ఇచ్చిన దాఖలాలు తక్కువ. కొన్ని రాష్ట్రాలలో మాత్రమే మూడు సార్లకు పైగా అధికారం ప్రజలిచ్చారు. కేంద్రంలో మాత్రం వరుసగా మూడు సార్లు ఒక్క జవహర్‌ లాల్‌ నెహ్రూ కాలంలో మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత వరుసగా ఎవరికీ మూడు సార్లు అధికారం ఇవ్వలేదు. ఇందిరాగాంధీకి కూడా ప్రజలు అలాంటి అవకాశం ఇవ్వలేదు. రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత జరిగిన ఎన్నికలలో అంతకు ముందు ఎవరికీ ఇవ్వని మెజారిటీ సీట్లు కాంగ్రెస్‌ కు వచ్చాయి. అయినా తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోయింది. ఆ తర్వాత కూడా నేషనల్‌ ఫ్రంట్‌ లాంటి ప్రభుత్వాలు నిలబడలేదు. తర్వాత పి.వి. నరసింహారావు ప్రభుత్వం కూడా ఐదేళ్లే పరిపాలన చేసింది. వాజ్‌ పాయ్‌ ప్రభుత్వం ఏర్పడినా నిలవలేదు. చివరికి భారత్‌ వెలిగిపోతోందని బిజేపి ఎంత ప్రచారం చేసినా ప్రజలు ఎన్డీయేను ఓడిరచారు. వాజ్‌ పాయ్‌ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వలేదు. కాకపోతే తర్వాత వచ్చిన యూపిఏ ప్రభుత్వం వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మొదటి సారి యూపిఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతుందని అనుకున్నారు. ప్రజలు కాంగ్రెస్‌ కు మెజారిటీ సీట్లు ఇచ్చినా మూడ్‌ ఆప్‌ నేషన్‌ దృష్ట్యా సోనియా గాంధీ ప్రధాని కాలేదు. మన్మోహన్‌ సింగ్‌ ను ప్రధానిని చేశారు. సోనియా గాంధీ చేసిన త్యాగం రెండోసారి కాంగ్రెస్‌ గెలవడానికి ఉపయోగపడిరది. సోనియా గాంధీ ప్రధాని కాలేదు. రాహుల్‌ గాంధీ ని ప్రధానమంత్రిని చేసే అవకాశం వున్నా చేయలేదు. కనీసం రాహుల్‌ గాంధీని క్యాబినెట్‌ లోకి కూడా తీసుకోలేదు. అయినా ప్రజలు కాంగ్రెస్‌ కు మూడోసారి అవకాశం ఇవ్వలేదు. ఇక తాజాగా బిజేపి కన్నా పవర్‌ పుల్‌ అయిన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజలు రెండు సార్లు అవకాశం కల్పించారు. అదేంటో గాని ప్రజలు ఆశించిన పాలన, ఊహించిన సంక్షేమం జరగడం లేదన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. మొదటి సారి ప్రధాని నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చాక ప్రజలు విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. ఏదో అద్భుతం జరుగుతుందని ఆశించారు. ఇంతలో నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేశారు. దేశమంతా హర్షించింది. దేశంలో నల్లదనం లేకుండా పోతుందని అనుకున్నారు. అంతే కాకుండా విదేశాలలో దాగి వున్న నల్ల డబ్బు దేశానికి వస్తుందనుకున్నారు. నోట్ల రద్దు మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. యాభై రోజులలో మార్పు చూస్తారని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. నిజంగానే ప్రజలు మార్పును చూడడం కాదు సమస్యలు అనుభవిస్తున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికీ జనం కోలుకోవడం లేదు. అయినా ప్రజలు భరించారు. మార్పుకు కొంత సమయం పడుతుందని ఎదురుచూశారు. ఇక ఆ తర్వాత దేశమంతా ఒకే పన్ను విధానం వల్ల దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అనుకున్నారు. అర్థరాత్రి వచ్చిన స్వతంత్రం, లాగా అర్థరాత్రి తెచ్చిన జిఎస్టీ మూలంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుందని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. నల్ల కుబేరులకు ఏమీ కాలేదు. చిన్న చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. మూత బడ్డాయి. ఉపాధి పోయింది. పారిశ్రామిక రంగం కుదేలైంది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేక మంది జీవితాలు వీధిన పడ్డాయి. అయినా ఏదో అద్భుతం జరుగుతుందని ప్రజలు అదే ఊహల్లో వుండి, మరోసారి బిజేపిని గెలిపించారు. అప్పుడు గాని పెనం మీద నుండి పొయ్యిలో పడ్డామని ప్రజలకు అర్థం అయ్యింది. పెరుగుతున్న ధరలు సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అందుకే బిజేపిలో కూడా కొంత కలవరం మొదలైంది. మళ్ళీ పాత పొత్తులను తెరమీదకు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. అయినా ప్రజలు నమ్ముతారన్న గ్యారంటీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇదీ దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు వేసుకుంటున్న అంచనా. 

ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బిఆర్‌ఎస్‌ ఎంతో బలమైన పార్టీ.

 ప్రజలు ఎంచుకొని, పెంచుకున్న పార్టీ. తెలంగాణ వచ్చిన నుంచి అప్రతిహతంగా సాగుతున్న పార్టీ. ఓటమి అన్నది లేని పార్టీ. అయితే ఈ మధ్య రెండు ఉప ఎన్నికలు బిజేపికి కలిసొచ్చాయి. అవి గెలవటానికి కారణం వేరు. గెలిచిన తీరు వేరు. పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ జీవితం వేరు. అవి కలిసొచ్చి బిజేపి గెలిచింది. అంతే అంతకు మించి ఏమీ లేదు. ఇటీవలే జరిగిన మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణ బిఆర్‌ఎస్‌ కు తిరుగు లేదని తేలిపోయింది. మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్స్‌ గా అభివర్ణిస్తూ సెస్‌ ఎన్నికలలో బిజేపి ఎందుకు ఓడిపోయింది. బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రాతినిధ్యం వహించే కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలో బిజేపి పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. ఇటీవల సిరిసిల్ల సెస్‌ ఎన్నికలలో బిజేపి ఎక్కడా బిఆర్‌ఎస్‌ కు పోటీ ఇవ్వలేదకపోయింది. అంటే చిన్న పిల్లలకు కూడా అర్థమౌతుంది. కానీ బిజేపి నేతలకు అర్థం కావడం లేదు. రైతుల్లో బిజేపికి స్థానం లేదన్నది స్పష్టమైందా?బిజేపి అతి విశ్వాసం మొదటికే వస్తుందా? ఎవరికైనా విశ్వాసం వుండాలి. అతి విశ్వాసం కొంప ముంచుతుంది. బిజేపిలో వ్యక్తి పూజ మరీ ఎక్కువౌతోంది. దేశంలో ఏ పార్టీలో అంత వ్యక్తి పూజ లేదు. ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో బండి సంజయ్‌ మాటలు మరీ విడ్డూరంగా వుంటాయి.

దేవుడన్నా మన మోడీ…పేదల దేవుడన్నా మన మోడీ అని కీర్తిస్తుంటాడు. వ్యక్తి గతంగా ప్రధాని మోడీ మీద బండి సంజయ్‌ కి ఎనలేని అభిమానం వుండొచ్చు. అయినా అది ప్రధాని కుర్చీలో మోడీ వుండడం వల్లనే అన్నది ఆయన మాటల్లో తొనికే భావన. నిజానికి ప్రధాని పీఠం మీద ఎవరున్నా బండి సంజయ్‌ వ్యాఖ్యలు అలాగే వుంటాయి. అంతే తప్ప అది మోడీ మీద వున్న ప్రేమ కాదని తేలిపోతోంది. అసలు సామాన్యులు బతకలేని పరిస్థితి సృష్టిస్తూ పేదల దేవుడు అని ఎలా కీర్తిస్తున్నారో అర్థం కాదు. అది వాళ్ల పార్టీ అంతర్గత వ్యవహారం అనుకున్నా, వ్యక్తి పూజ ప్రజాస్వామ్య రాజకీయాలలో సరైంది కాదు.

టిడిపితో కలిస్తే తప్ప మనుగడ బిజేపికి మనుగడ లేదా?

 తెలంగాణలో ఒంటరి పోరాటం చేయలేదు. ఎన్నికల బరిలో దిగలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఇప్పుడైనా తెలుగు దేశంతో జత కడితే తప్ప మనుగడ లేదు. ఆంద్రప్రదేశ్‌ లో కూడా అంతే. 2014లో టిడిపితో కలిసి పోటీ చేయడం వల్లనే ఓ ఐదు సీట్లు వచ్చాయి. తర్వాత ఒంటరి పోరుకు పోయి, బిజేపి బొక్కబోర్లా పడిరది. రాష్ట్ర రాజకీయాలలో కొన్ని అనూహ్య మార్పులే రెండు సీట్లు గెల్చుకోవడానికి కారణం. అంతే తప్ప అది బిజేపి బలం కాదు. ఆ పార్టీకి బలగం లేదు. క్షేత్ర స్థాయి యంత్రాంగం అసలే లేదు. వున్న నాలుగు జుట్లలో సఖ్యత లేదు. ఒకరికొకరు సహకారం లేదు. ఇవన్నీ ఇలా వుంటే తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పథకం బిజేపి పాలిత రాష్ట్రాలలో అమలు చేయడం లేదు. అధికారంలోకి వస్తున్నాం…వస్తాం అనుకుంటే సరిపోతుందా? దేశంలోని బిజేపి పాలిత రాష్ట్రాలలో తెలంగాణ లో అమలయ్యే పథకాలకంటే ఒక్క మంచి, కొత్త పథకం ఏదైనా వుందా? అసలు ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్లు ఎక్కడా ఇవ్వడం లేదు. ఇక్కడ ఇచ్చినంత ఇతర రాష్ట్రాలలో బిజేపి ఎందుకు ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత తక్కువ సమయంలో కట్టిన నీటి పారుదల ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలోనైనా కట్టారా? కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు వున్నాయా? ఏ ఒక్కటీ చెప్పుకోవడానికి లేదు. పైగా సంక్షేమ కార్యక్రమాల అమలును ఉచితాలుగా అవహేళన చేయడాన్ని ప్రజలు సమర్థిస్తారా? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దానం చేయడం ప్రజలకు తీరని అన్యాయం చేయడం కాదా? పేదలకు ఇచ్చిన చిన్న చిన్న రుణాలు మాఫీ చేయడానికి చేతులు రాని, కేంద్రం బడా బాబులకు పది లక్షల కోట్లు మాఫీ చేయడాన్ని ప్రజలు ఎలా ఆహ్వానిస్తారు. అధికారంలో వున్న బిజేపి సంక్షేమం విస్తరించింది. అలాంటి పార్టీని ఆయా రాష్ట్రాలలోనే కాదు తెలంగాణ ప్రజలు నమ్ముతారా? టిడిపితో జతకట్టి నిండా మునుగుతారా?తెలంగాణ కనీసం సింగిల్‌ డిజిట్‌ సీట్లు వచ్చేనా? బిఆర్‌ఎస్‌ ను ఎదుర్కొనే నాయకులు బిజేపిలో వున్నారా? అన్న అనుమానం అందరిలో వుంది. ఆ పార్టీలో కూడా వుంది. కాకపోతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. పగటి కలలుకంటోంది. ఇదే విషయం మంత్రి కేటిఆర్‌ చెబుతోంది…వినబడుతుందా!!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version