చేర్యాలలోమహాత్మ జ్యోతిరావు ఫూలే గారి 197వ జయంతి

చేర్యాల నేటిధాత్రి

చేర్యాలలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా చేర్యాల అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ సంక్షేమ సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు ఫూలే దంపతులు భారతదేశ మొట్టమొదటి సంఘసంస్కర్తలని పేర్కొన్నారు. ఈ దేశపు మూలవాసులను బానిసలుగా చేసిన విధానాన్ని మహాత్మ జ్యోతిరావు ఫూలే గారు తూర్పారాబట్టారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు గారు చేసిన పోరాటం చేసిన విధానాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముస్తాల నాగేశ్వరరావు,జి. బాబు, మల్లిగాడు శ్రీనివాస్.మల్లిగారి బాబు.లింగం, రామగళ్ళ నాగరాజు భూమిగారి దామోదర్ , నవ జీవన్. కర్రొల విజయ్.నరేష్ ఎర్రోళ్ల రమేష్ , చుంచు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!