రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఐనవోలు(వర్ధన్నపేట)నేటిధాత్రి:రైతుల సంక్షేమమే
ప్రభుత్వ లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తున్నదని నందనం పిఏసిఏస్ వైస్ చైర్మన్ తక్కల్లపేల్లి చందర్ రావు అన్నారు.గురువారం మండలంలోని పెరుమాల్లగూడెం గ్రామంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ విధానంలో సంస్కరణలు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పాటు పడుతున్నారని అన్నారు. రైతులందరూ ఒకే రకమైన పంటలు చేయడం వలన డిమాండ్ లేక గిట్టుబాటు ధర లభించడం లేదని చందర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పిడుగు రజిత, ఎఇవో సరేష్ రైతులు పాలొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *