మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా…
అత్యాధునికమైన హంగులతో నిర్మాణం.
భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్.
పాఠశాల నిర్మాణ దాత, అక్షర ప్రధాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి.
కామారెడ్డి జిల్లాలో మరో అద్భుతమైన మరో పాఠశాల నిర్మాణం కానున్నది. అక్షర ప్రధాతగా కీర్తి గడించిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం జరుగుతోంది. గురువారం కామారెడ్డి రెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతల మీదగా రామారెడ్డి మండలంలోని రెడ్డి పేట గ్రామంలో ఘనంగా భూమి పూజ నిర్వహించారు.
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాల నిర్మాణం జరగనుంది. అయితే ప్రభుత్వం కేటాయించే నిధులకు తోడు తన సొంత నిధులతో అత్యాధునిక హంగులతో,
విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో, కార్పొరేట్ స్కూల్ ను తలదన్నేలా నిర్మాణం జరగనుంది. పాఠశాలకు సంబంధించిన మోడల్ కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ఇప్పటికే బీబిపేటలో ఓ పాఠశాల నిర్మాణం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి, వచ్చే తరానికి సరస్వతి నిలయాన్ని కానుకగా ఇచ్చారు. అది రాష్ట్రంలోనే పెద్ద చర్చనీయాంశమైంది. తాను చదువు కున్న స్కూల్ మరిన్ని తరాలకు విద్యా భోధనలు జరగాలని, రేపటి విద్యావంతమైన సమాజానికి బీబిపేట ఆదర్శంగా నిలవాలని సుభాష్ రెడ్డి కానుకగా ఇచ్చారు. ఇప్పుడు రెడ్డి పేటలోనూ మరో పాఠశాల నిర్మాణానికి ముందుకొచ్చారు. ఆయన విద్యాలయాల నిర్మాణంలో చూపిస్తున్న చొరవను అందరూ అభినందిస్తున్నారు.