చేర్యాల నేటిధాత్రి…
జనగామ నియోజకవర్గన్నీ రెండు ముక్కలుగా విడదీసి, ఈ ప్రాంత అస్తిత్వమును ఆత్మగౌరవాన్ని, దెబ్బతీసే విధంగా పాలన కొనసాగిస్తూ ఈ నాలుగు మండలాల పరిస్థితి అవిచ్చినంగా ఆ శాస్త్రీయంగా విభజించి, రెండు రెవిన్యూ డివిజన్లో కలిపారు. గత కొన్ని రోజుల నుంచి ప్రజా ఉద్యమం నడుస్తుంటే, ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా, సొంత ప్రయోజనాలకు పోతూ, ప్రజాభివృద్ధి చేస్తున్నానీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు టికెట్టు రాకపోవడంతో జనగామ చౌరస్తాలో అర్ద నగ్న ప్రదర్శన దిగిన ఎమ్మెల్యే, ఈ ప్రాంత ప్రజల కోసం ప్రగతి భవన్ ముందు ఎందుకు పోరాటం చేస్తాడో చెప్పాలని జేఏసీ కోరుకుంటుంది. కావున ఈ నాయకుడిని మార్చి ఇంకో నాయకుడికి అభ్యర్థిత్వాన్ని ఇచ్చినంత మాత్రాన ప్రజల బాధలు సమస్య పోతాయా, కావున ప్రభుత్వం స్పందించి, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని, ప్రజలు కోరుతున్నారని వారన్నారు,