నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే…. డి సి పి

మల్కాజిగిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా),
8 మే (నేటిధాత్రి):

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రెడ్ జోన్
లో ఉన్నందున కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన డి సి పి రక్షిత మూర్తి,ఈ సందర్భంగా వ్యాపారులకు నిర్మాణ రంగ సంస్థ యజమానులకు లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించారు, ఇంట్లో నుండి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని మాస్క్ లేకుండా ఎవరైనా బయట తిరిగితే 1000 రూపాయల జరిమానా విధిస్తాము అని అన్నారు, నిర్మాణ రంగ సంస్థ కు సంబంధించి వారి వద్ద ఉన్న కూలీల తోనే నిర్మాణం చేపట్టాలన్నారు బయటి ప్రాంతం కూలీల కు అనుమతి లేదన్నారు
ఐటీ రంగానికి సంబంధించి 33 శాతం ఉద్యోగస్తులు మాత్రమే విధులు నిర్వహించే విధంగా చూసుకోవాలన్నారు
ఉద్యోగస్తులకు వ్యక్తిగత వాహనాలు కాకుండా సంస్థ బస్సులు ఉపయోగించుకోవాలని కోరారు,సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్నందున వ్యాపారులు ఉద్యోగస్తులు సాయంత్రం 6 లోపు పనులు ముగించుకొని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *