చందుర్తి:నేటిధాత్రి చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన రాణవేణి గణేష్ హత్య కేసులో నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు పోలీసులు… రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రాణవేణి గణేష్ ను రెండు రోజుల క్రితం నర్సింగాపూర్ లో బంధువుల ఇంట్లో కారం పొడి చల్లి గొడ్డలితో కత్తితో అతికిరతకంగా నరికి చంపిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకొని వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారి ఎదుట హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు… మృతి చెందిన గణేష్ భార్య స్వప్నను ప్రేమ వివాహం చేసుకొని మానసికంగా శారీరికంగా చిత్రహింసలు పెట్టి వేధించడంతో పాటు మరో కొంతమంది మహిళలతో అక్రమ సంబంధమే గణేష్ హత్యకు దారితీసిందని డీఎస్పీ నాగేంద్ర చారి వివరాలను వెల్లడించారు.. హత్య జరిగిన రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించడంలో చందుర్తి సీఐ కిరణ్ కుమార్ ను డీఎస్పీ అభినందించారు… డిఎస్పి నాగేంద్ర చారి మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పమన్నారు ..
నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు
