
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల మున్సిపల్ పరిది 05 వ వార్డ్ నాగసాల దగ్గర నూతనంగా నిర్మించిన సింగిల్ విండో 2500 మెట్రిక్ టన్నుల గోదామ్ ప్రారంభోస్తవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి వర్యులు, మహబూబ్ నగర్ జిల్లా బి, ఆర్, ఎస్, పార్టీ అధ్యక్షులు, జడ్చర్ల శాసన సభ్యులు ఎమ్మెల్యే. లక్ష్మారెడ్డి హాజరై గోదామ్ ను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రమావత్ వాల్య నాయక్ , జడ్చర్ల సింగిల్ విండో చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ , జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నే గోవర్ధన్ రెడ్డి , జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ ,మండల రైతు సమన్వయ సమితి కమిటీ అధ్యక్షులు కొంగలి జంగయ్య , స్థానిక వార్డు కౌన్సిలర్ నవనీత కొండల్, ఏ ఎం సి డైరెక్టర్స్, పి, ఏ, సి, ఎస్ డైరెక్టర్స్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,మండల రైతులు, నాయకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.