గల్ఫ్ జేఏసి రామడుగు మండల కార్యవర్గం ఎన్నిక

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గల్ఫ్ జేఏసీ రామడుగు కార్యవర్గం ఎన్నిక జరిగిందని కరీంనగర్ గల్ఫ్ జేఏసీ జిల్లా అధ్యక్షులు చిలుముల రమేష్ తెలియజేశారు. రామడుగు మండల గల్ఫ్ జేఏసీ అధ్యక్షులుగా రామడుగు శేఖర్, ఉపాధ్యక్షులుగా అరెపల్లి కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా గజ్జెల నవీన్ కుమార్, సాంస్కృతిక కార్యదర్శిగా కలిగేటి పార్శరాములు, కార్యవర్గ సభ్యులుగా అరెపల్లి ఆంజనేయులు, జెట్టిపెల్లి శ్రీనివాస్, రామడుగు పర్శరాములను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు చిలుముల రమేష్ కు ధన్యవాదాలు తెలిపుతూ, గల్ఫ్ కార్మికుల సమస్యలకు పరిష్కారం దిశకు తమ వంతుగా ప్రయత్నం చేస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!