జెడ్పీ ఛైర్మన్,బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంఛార్జి లింగాల కమల్ రాజు నాయకత్వాన ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ మధు,విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కోటేశ్వరరావుతో కలిసి అతిథిగా హాజరయ్యారు
ఈ కార్యక్రమానికి మహిళలు,యువత పాటు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ
మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా జనరంజక పాలన కొనసాగుతున్నదని, తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు.ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలోని వనంవారి కిష్టాపురంలో జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యాన శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ బీడువారినట్లు ఉండేదని, కేసీఆర్ పాలనలో ఇప్పుడు పాడిపంటలతో కళకళలాడుతున్నదని చెప్పారు.దండుగ అనుకున్న వ్యవసాయాన్ని కేసీఆర్ ఆచరణలో పండుగ చేసి నిరూపించారని కొనియాడారు.ఒకటేమిటి ఈ తొమ్మిదేళ్ల అనతి కాలంలోనే తెలంగాణ అన్ని రంగాలలో ఊహించని విధంగా అభివృద్ధి చెందిందని,ఈ ఫలాలు, సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరాయని వివరించారు.దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆసరా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు,ఒంటరి మహిళలు,గీత,నేత,బీడి కార్మికులకు 2,016 రూపాయల చొప్పున, వికలాంగులకు 3,016 రూపాయల చొప్పున పింఛన్లు అందిస్తున్న విషయాన్ని రవిచంద్ర గుర్తు చేశారు.ఈవిధంగా కేసీఆర్ సమర్థవంతమైన పాలనలో కొనసాగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాల వాళ్లు తెలుసుకుని,చూసి బీఆర్ఎస్ లో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని, కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరమని భావిస్తున్నారని వద్దిరాజు వివరించారు.ఈ సమ్మేళనంలో విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటరమణ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మహిళలు,యువతతో పాటు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై భారత్”, “జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్”అంటూ గులాబీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.