కేయూ క్యాంపస్
కాకతీయ యూనివర్సిటీ లో పి.హెచ్.డి కేటగిరి-2 అడ్మిషన్ లలో జరిగిన అవినీతి అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని చేస్తున్న నిరాహారదీక్ష లకు స్పందించకుండా నిరంకుశ పాలన కొనసాగిస్తున్న వి.సి రమేష్, రిజిస్ట్రార్ శ్రీనివాసరావు వైఖరి నిరసిస్తూ వారి చిత్రపటాలకు కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్య కేంద్రంలో పిండ ప్రధానం చేశారు మంగళవారం. అనంతరం విద్యార్థులు అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి.హెచ్.డి కేటగిరి-2 అడ్మిషన్లు జరిగిన అవినీతి అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై వారు వి.సి,రిజిస్ట్రార్ కుట్రలు చేసి హన్మకొండ సి.పి మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించడాన్ని నిరసిస్తూ గత 14 రోజుల నుంచి చేస్తున్న దీక్షలకు వి.సి, రిజిస్ట్రార్ ల నుంచి ఎటువంటి స్పందన లేదని యూనివర్సిటీ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వంనకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వెంటనే ఈ విధానాన్ని మార్చుకోవాలని తెలిపారు. వి.సి,రిజిస్ట్రార్ అమరహై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.14వ రోజు నిరాహార దీక్షలు ఉదయం పార్ట్ టైం లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సోల్తీ కిరణ్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కే.యూ జాక్ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్ జాక్ నేతలు గుగులోతు రాజు నాయక్, మేడ రంజిత్ కుమార్,బొట్ల మనోహర్, మాచర్ల రాంబాబు, అంబాల కిరణ్, అరేగంటి నాగరాజు,మట్టెడ కుమార్,మొగిలి వెంకట్ రెడ్డి, విజయ్ ఖన్నా, ఎండి పాషా, నిమ్మల రాజేష్, బానోతు లకుపతి, గట్టు ప్రశాంత్ గౌడ్, కాయిత నాగరాజు, మంగలపెళ్లి హస్సేన్ వందలాది విద్యార్థులు పాల్గొన్నారు.
కే యూ వి సి, రిజిస్టార్ చిత్రపటాలకు పిండ ప్రదానం
