కె. టి.ఆర్. చేతుల మీదుగా బి.ఆర్.యస్ పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయ శంకుస్థాపన

నేటిధాత్రి వరంగల్ తూర్పు

వరంగల్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గం లోని రంగశాయి పేట ఆర్టీఏ జంక్షన్ వద్ద శుక్రవారం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటి శాఖ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు విచ్చేసి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలు, మహిళలు కేటీఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు. డివిజన్ల నుండి ముఖ్య కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జిల్లాకే తలమానికగా ఉండబడే ఈ ప్రాంతంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలో కొత్త బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథి బి.ఆర్.యస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ తో పాటుగా జిల్లాకు చెందిన రాష్ట్ర గ్రామపంచాయతీ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, మరియు బి.ఆర్. యస్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరూరి రమేష్ తో పాటు, స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ , స్థానిక ఎం.పీ పసునూటి దయాకర్ తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు మరియు ప్రజాప్రతినిధులు, వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు,కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!