ఒకరిపై ఒకరు నూరుతున్న కారాలు మరియాలు?
నేతల మధ్య పెరుగుతున్న దూరాలు?
తగ్గుతున్న ఎమ్మెల్యేల ప్రాధాన్యతలు?
బహిరంగంగానే నేతల అసంతృప్తి వ్యాఖ్యలు?
బండి పాదయాత్ర పత్రికా ప్రకటనల్లో లేని ఆ ఇద్దరు నేతలు?
అట్టహాసమంతా పాత తరం నేతలతోనే మొదలు?
రఘునందన్, ఈటెలను కావాలనే పక్కన పెడుతున్నట్లు వార్తలు…
కొత్తగా వచ్చిన వారు పడుతున్న ఇబ్బందులు…!
పైకే ముసిముసి నవ్వులు..లోన రుసరుసలు, గుసగుసలు!
లేదు లేదంటే ఏదో లొల్లి వున్నట్లే…కాదు..కాదంటే ఏదో కయ్యం జరుగుతున్నట్లే…వద్దు వద్దంటే ఏదో వాదం ముందుకొచ్చినట్లే…రాను రానంటే దూరం..దూరం జరుగుతున్నట్లే…పిలుపు లేదు, పిలిచే వాళ్లు లేరంటే పొమ్మనలేక పొగపెడుతున్నట్లే…ఇవన్నీ చరిత్రలో అనేక మార్లు రుజువైనవే…ఇప్పుడు రాష్ట్ర బిజేపిలోనూ కనిపిస్తున్నవే…తాజాగా జనం వింటున్న మాటలు..నాయకులు అంటున్న మాటలు విశ్లేషిస్తే అర్ధమౌతాయి. రఘునందన్ రావును బండి సంజయ్ పాదయాత్రకు వెళ్తారా? అని అడిగితే రమ్మంటే వెళ్తాను…లేకుంటే లేదు…ఇది ముక్కుసూటిగా, ముక్తసరిగా చేసిన వ్యాఖ్య…అంతే కాదు పార్టీలో ప్రోటోకాల్ పాటించడం లేదన్న మాటలు కూడా ఆయన మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమే అన్నట్లు తాజగా బండి సంజయ్ పాదయాత్ర ప్రకటనల్లో నిజంగానే రఘనందర్ రావు, ఈటెల రాజేందర్ పోటోలు కనిపించలేదు. ఇక ఈటెల, బండి సంజయ్ విషయంలో కూడా పోరు ఎప్పటినుంచో నడుస్తుందనే వారు కూడా వున్నారు. ఈటెల రాజేందర్ బిజేపిలో చేరి నియోజకరవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు. అదే సమయంలోనూ బండి సంజయ్ పాదయాత్ర షురువైంది. దాంతో ఈటెల కాలుకు ఇబ్బంది ఎదురైంది. ఆయన పాదయాత్రకు కొంత కాలం బ్రేక్ పడిరది. ఎట్టకేలకు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అంతా తానై, అన్నీ తానై గెలిచొచ్చిన ఈటెలకు పార్టీలో ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఇది బండి సంజయ్కు ఇబ్బంది కరంగా మారిందని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బండి సంజయ్ మీడియాతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొందరు నేతలు సిఎం అభ్యర్ధులమంటూ పరోక్ష సంకేత ప్రచారం సాగుతున్నట్లు వివాదరం రేపారు. తెలంగాణ బిజేపిలో తాను సిఎం అభ్యర్ధిని కాదన్నారు. పనిలో పనిగా ఎవరూ సిఎం అభ్యర్ధి అన్నది నిర్ణయించేది డిల్లీ పెద్దలని గుర్తుచేశారు. అంటే పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు, ఈటెల రాజేందర్, సినియర్ బిసి నేత లక్ష్మణ్ను కూడా ఉద్దేశించి అన్నట్లే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా కొందరు నేతలు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని నాయకులకు తన వెంట తిప్పుకుంటున్నారన్న మాట కూడా గుర్తు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఈటెలపై పరోక్ష వ్యాఖ్యలు బండి చేసినట్లు కూడా ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు. తన టిక్కెట్టే కన్ఫామ్ కాలేదని బండి సంజయ్ కొత్త లెక్కలు ముందేశారు. ఈసారి బిజేపిలో ఆరు నెలల ముందే టిక్కెట్లు ప్రకటించొచ్చు…అని ఈటెల అన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆదిలోనే బండి సంజయ్ తుంచేశారని అంటున్నారు.
ఇదిలా వుంటే పదవులు వచ్చే వరకు ఒక రకంగా, వచ్చాక మరో రకంగా నాయకుల తీరు మారుతుందంటే ఇదే మరి. రఘునందన్కు దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించడానికి బండి సంజయ్ చేసిన వినూత్నమైన ప్రచారం చేశారు. రాజకీయ ప్రచారంతో బిజేపి మార్కు చూపించారు. ఎన్నిక దగ్గర పడుతున్న వేళ బండి సంజయ్ పోలీసులు తననేదో చేసినట్లు చేసిన హడావుడి చేశారు. రఘనందర్ రావుకు గెలుపుకు మరింత మార్గం వేశారు. పైగా అదే రోజు బిజేపి శ్రేణులు తెరాస ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్మీద దాడికి యత్నించడం వంటవి కూడా చేశారు. వీటన్నింటికి బండి సంజయ్ చేసిన ఎత్తుగడలో భాగమే…అలా దగ్గరుండి రఘనందర్ను గెలిపించుకునే ప్రయత్నం చేసిన బండి సంజయ్ చేశారు. అలాంటిది బండి సంజయ్ తనకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదంటూ, మంత్రి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆధిపత్య పోరు అన్నది మొదలైందన్న సంకేతాలు అందరూ అందిస్తున్నట్లే లెక్క…
ఇక టిఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగి, ఆ నీడను చూసి మరింత పెరగాలనుకున్నారు ఈటెల. ఆయనకు బిజేపిలో దక్కుతున్న ప్రాధాన్యత ఎంతటిదో తేలిపోయిందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మగౌరవంతో వున్నారా? గతంలో ఆత్మగౌరవం ఆయనకు లభించిందా? అన్నది కూడా ఆయన మననం చేసుకుంటున్నట్లు కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే కొంత కాలం గడిస్తే, ఈటెల రాజేందర్ను నియోజకవర్గ ప్రజలు కూడా మర్చిపోయే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల ఈటెల తన నియోజకవర్గ నేతలతో ఇతర జిల్లాల పర్యటన విషయం చర్చించారట. అది పార్టీ పెద్దలకు చేరడంతో అలాంటివి బిజేపిలో కుదరవని తేల్చిచెప్పారట. పైగా బండి సంజయ్ పాదయాత్ర వున్నందున ఏ నాయకుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, అది పార్టీమీద ప్రభావం చూపుతుందని తెలియజేశారట. దాంతో ఈటెల ముందర కాళ్లకు బంధం పడ్డట్టైందంటున్నారు.
గాలిలో మేడలు కట్టి, ఆకాశంలో పందిరెయడం అంటే ఎంత నిజమో! భవిష్యత్తులో తెలంగాణలో బిజేపి అధికారంలోకి వస్తుందనేది కూడ అంతే నిజం అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గాలిలో ఎవరూ మేడలు కట్టలేరు. ఆకాశంలో ఎవరూ పందిరేయలేరు…తెలంగానలో బిజేపి అధికారం అన్నది కూడా అంతే…అంటున్నారు. నేతల మధ్య సఖ్యత లేదు. ఆధిపత్య ధోరణికి అడ్డూ అదుపు లేదు. నాయకుల మధ్య సరిగ్గా మాటలు లేవు. అంతా ఒక్కటే అని పైకి చెప్పుకున్నంతా మాత్రాన సరిపోదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లే వుంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పే మాటలకు, చేసే చేతలుకు పొంతన లేదని చాలా మంది గుర్రుగానే వున్నారు. గతంలో వరి వేయండని పదే,పదే చెప్పి రైతులను రెచ్చగొట్టాడు. కేంద్ర పెద్దలతో మాట్లాడి కొనిపిస్తామన్నాడు? ఆఖరుకు ధర్నా చౌక్లో గోధుమలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. అంటే వారికి చిత్తశుద్ది ఎంత వుందనేది ఇక్కడే తేలిపోయింది. ప్రజలంటే వారికి ఎంత గౌరవమో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో ఏ ఒక్క మూల కూడా పండని గోధమ కోసం కొట్లాడుడేంది? వరి కొనాలంటూ రాష్ట్రంలో కొట్లాడుడేంది? బిజేపిలో ఎవరికైనా అర్ధమౌతోందా? తప్పుడు నిర్ణయాలు, దుండుడుకు చర్యలు పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చిపెడతాయని చెప్పడంలో సందేహం లేదు. పైగా బండి సంజయ్ పాదయాత్ర వల్ల పార్టీకి ఏం ఒరుగుతుందో…అన్నదానికి ప్రాతిపదికే లేదు. ఏం చెప్పదల్చుకున్నారో కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. గతంలో పాదయాత్ర చేసి, పచ్చని పంటపొలాల్లో ఆగి రైతులతో మాట్లాడుతూ వచ్చారు. పొలాల దగ్గర బోర్ల దగ్గర నీళ్లు తాగుతూ ఫోటోలు దిగారు. అది టిఆర్ఎస్కు ఎంతో మేలు చేసింది. ఇప్పుడు బండి సంజయ్ యాత్రతోపాటు కల్లాల దగ్గరకొచ్చినా, వరి కొనుగోలు కేంద్రాలు సందర్శించినా అది టిఆర్ఎస్కే లాభం చేకూరుతుంది. అసలు తెలంగాణలో ఏం అమలు కావడం లేదని చెప్పాలనుకుంటున్నారో కూడా బిజేపికి క్లారిటీ లేదు. ఒక వేళ బిజేపి అధికారంలోకి వస్తే కొత్తగా ఏమిస్తారో అన్నదానిపై కూడా బిజేపిలో చర్చే లేదు. ఎంత సేపు మేమే..అనుకుంటే సరిపోదు..మీరే అని జనం అనాలి. ఓట్లేయాలి. ఇప్పటిదాకా ఉనికే లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అసలు పట్టే లేదు. వచ్చేస్తాం…పాలిస్తామంటే సరిపోతుందా? తెలంగాణ పల్లెలు నమ్ముతాయా? చూద్దాం…!!