కడుపు నింపుతున్న *కన్నతల్లి* ఫౌండేషన్

* పేద ప్రజల సేవలో వ్యవస్థాపక అధ్యక్షులు

* ‘కొండ’ అంత ప్రేమతో పేదల ముందుకు

*ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు,అధికారులు

వరంగల్ సిటి నేటిధాత్రి

యావత్ ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న మహమ్మారి కరోనా ఎవరి నోట విను కరోనా అలాంటిది కరోనా భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా వరంగల్ పేద ప్రజలు కార్మికులు పని చేస్తే కానీ కుటుంబాన్ని పోషించని స్థితిలో ఉన్న ప్రజానీకానికి కడుపు నింపటానికి ముందుకొచ్చింది కన్నతల్లి ఫౌండేషన్ అనతి కాలంలోనే ఎనలేని సేవలు చేసి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తన ఖాతాలో వేసుకున్న ఘనత కన్నతల్లి ఫౌండేషన్ ది ఎన్నో ఒడిదుడుకుల మధ్య కష్ట నిష్టూరాలకోర్చి స్థాపించి సేవలు చేస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతున్నారు కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండమీది రాజన్ బాబు సేవే పరమావధిగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో పేదల ఆకలి తీర్చే దిశలో పనిచేస్తున్నారు కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు 2019 లో స్థాపించి సంవత్సరం లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించిన ఘనత కన్నతల్లి ఫౌండేషన్ దే అని చెప్పొచ్చు స్థాపించిన నాటినుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ మొదలుకుని మెగా హెల్త్ క్యాంపులు విద్యార్థులకు శుభ్రంగా ఉండాలని చేతులు శుభ్రంగా కడుగుకోవాలని తెలుపుతూ ప్రజల్లో వివిధ రకాలుగా అవగాహనలు కల్పిస్తున్న కన్నతల్లి ఫౌండేషన్ అధ్యక్షులను అధికారులు నాయకులు అభినందిస్తున్నరు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్బంగా రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటలతో ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉంటారని ఆటలతో పాటు మేధస్సు పెంచే విధంగా వివిధ రకాల వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి విద్యార్థులలో చైతన్యం నింపారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా కోవిడ్ వైరస్ తో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులను చూసి చలించిపోయిన కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రోడ్ల పై కూరగాయలు పండ్లు అమ్ముకునే వారికి గ్లౌస్ లు మాస్క్ లు పంపిణీ చేశారు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు భోజన ఏర్పాట్లు చేసి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు నగరంలోనే కాక గ్రామాల్లో పోలీస్ అధికారుల పిలుపు మేరకు ఆత్మకూరు మహమ్మద్ గౌస్ పల్లి గ్రామంలో పేద ప్రజలకు భోజన ఏర్పాట్లు చేసి వారి కడుపు నింపారు. అదేవిధంగా కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వారి ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని మాస్క్ లు సానీటైజర్ ఎండలో పనిచేసే సిబ్బందికి నీళ్ల బాటిల్స్ అందించి వారి దాహార్తిని తీర్చారు. వరంగల్ నగరంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలను కట్టడి చేస్తున్న కమిషనరేట్ పరిధిలో వివిధ కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మాస్కులు అందించారు.గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న సానిటరీ సిబ్బందికి అల్పాహారాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ వారి ఆకలి తీర్చిన ఘనత కన్నతల్లి ఫౌండేషన్ కే దక్కుతుంది. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఒక కరపత్రాన్ని తూర్పు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనుదినం పేద ప్రజలకు మాంసాహారం,బిర్యానీ, టమాటా,ఆలు కుర్మా, వివిధ రకాల రుచికరమైన భోజనం అందిస్తూ వారి ఆశీర్వాదాలు పొందుతున్నారు.ఇటు రాజకీయ నాయకులతో పోలీస్ అధికారులతో పారిశుధ్య కార్మికులతో కరోనా వైరస్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న అదికారులతో మమేకమై అనుదినం ప్రజలకు సేవలు చేస్తున్న కన్నతల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండమీది రాజన్ బాబు సేవలు ఆమోఘమైనవని చెప్పవచ్చు. ఆంద్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పేద ప్రజలకు సేవలు చేస్తున్నవారికి ఒక్కడు తానై తానే ఒక్కడై ప్రజా సేవలో తరిస్తూ మొదటిసారి ప్రజా సేవకులకు వివిధ రకాల అవార్డులు ఇచ్చిన ఘనత కన్నతల్లి ఫౌండేషన్ ది అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికి పేద ప్రజలకు అనునిత్యం సేవలు చేస్తూ కరోనా కష్ట కాలంలో డాక్టర్లు ప్రాణాలను కాపాడినట్టు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేసినట్టు, పారిశుద్ధ్య కార్మికులు పరిసరాలు శుభ్రంగా ఉంచినట్టు, కన్నతల్లి పేదవారి కడుపు నింపుతుంది. అని కన్నతల్లి వ్యవస్థాపక అధ్యక్షులు కొండమీది రాజన్ బాబు తెలపడం పేద ప్రజల పాలిట వరమని అనుకోవాలి కన్నతల్లి ఫౌండేషన్ సేవలు ఆమోఘమని వివిధ వర్గాల ప్రజలు బహిరంగంగానే చర్చించుకోవటం చాలా ఆనందంగా ఉందని అధికారుల సహాయ సహకారాలతో మున్ముందు పేద ప్రజానీకానికి సేవలు చేస్తూ ఇంకా ముందుకు వెళ్తానని కొండమీది రాజన్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *