శాయంపేట నేటి ధాత్రి:
ప్రభుత్వ రంగ సంస్థలైన భారతీయ జీవిత బీమా ఏజెంట్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించడమే కాక, గ్రాట్యూటీ, టర్మ్ ఇన్సూరెన్స్ పెంచడంపై ఎల్ఐసి ఏజెంట్స్ సంగ్ (బిఎల్ఐఏఎస్) అధ్యక్షులు పిన్నింటి సంపత్ రావు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఎల్ఐసి ఏజెంట్ల గ్రాట్యువిటి 3 లక్షల నుండి 5 లక్షల కు, టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ 25 వేల నుండి 15 లక్షల స్థాయికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఏజెంట్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ ఏడాది అధిక వర్షాలతో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయిందని, ఏజెంట్లకు ఫ్లడ్ అడ్వాన్సులు ఇవ్వాలని కోరారు. పాలసీదారుల ప్రీమియం ఇంట్రెస్ట్ రేట్ ను తగ్గించాలని, పాలసీల లోను పై ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ లో పాత పద్ధతులను కొనసాగించాలని, కొత్త మార్పులతో పాలసీదారులకు, ఏజెంట్లకు నష్టపరిచే మార్పులను తొలగించాలని సంపత్ రావు కోరారు.