ఈనెల 11న సగర సంఘం ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ
వాళ్ల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు గంగుల, శ్రీనివాస్ గౌడ్
నేటిధాత్రి హైదరాబాద్
తెలంగాణ సగర (ఉప్పర) సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఈనెల 11న భూమి పూజ జరగనుంది ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ లు ఆవిష్కరించారు కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఉదయం తొమ్మిది గంటలకు శంకుస్థాపన జరుగుతుంది అనంతరం బహిరంగ సభ ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ అస్కాని మారుతి సాగర్ వెల్లడించారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆత్మగౌరవ భవన ట్రస్ట్ చైర్మన్ అస్కాని మారుతి సాగర్, తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సాగర్, ప్రధాన కార్యదర్శి గోరక్క సత్యం సాగర్, బంగారు నరసింహ సాగర్, పురుషోత్తం సాగర్, విజయేంద్ర సాగర్, రవి సాగర్, వెంకట స్వామి సాగర్, తిరుపతయ్య సాగర్, కృష్ణ సాగర్, ఉదయ సాగర్, దయాసాగర్, రామకృష్ణ సాగర్, శ్రీ రాములు సాగర్, సీతారాం సాగర్, లతోపాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు