ఆత్మ గౌరవానికి ప్రతీక సర్వాయి పాపన్న

కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కేసముద్రం మండలంలోని అర్పణపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కల్లుగీతా కార్మిక మండల అధ్యక్షుడు బబ్బరు ఉప్పలయ్య మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ వీరత్వానికి,పరక్రమానికి ప్రతిక అని అన్నారు.ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోవడానికి వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి పాపన్న పోరాడిన తీరు గొప్పదని అన్నారు.సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం గా నిర్వహించి,బడుగు బలహీన వర్గాల నాయకత్వాని సమూచితంగా గౌరవించుకుంటుందని అన్నారు.అణచివేత వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని బబ్బరు ఉప్పలయ్య స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అర్పణ పల్లి గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు గంధం వెంకన్న,కుల పెద్దమనిషి గంధసిరి బుచ్చి రాములు,గంధం సంతోష్, గంగపురపు వెంకన్న,బబ్బురు వెంకటమల్లు,బొమ్మగాని ఎల్లయ్య,గంధసిరి విజేందర్,గంధసిరి ఏకాంబరం,కామగోని సాంబయ్య,మారగాని యాకాంబరం తదిరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!