అన్నకు నోటి దూల` తమ్ముడిది నెరవేరని కల!?

చిరు చేరడం కల్ల…మెగా రాజకీయం డొల్ల?

అభిమానులు నిప్పుల్లో దూకాలా?

నాగబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు?

అభిమానులంటే అంత అలుసైపోయారా?

ఆ కుటుంబాలకు గర్భశోకాలు మిగుల్చుతారా?

ఎవరైనా అభిమాని పవన్‌ కోసమంటూ అఘాయిత్యం చేస్తే? ఎవరు భాధ్యులు?

నాగబాబు బుసలు` పవన్‌ రుసరుసలు..

పుస్తకాలు చేతిలో పట్టుకుంటే చరిత్ర తెలియదు!

జగన్‌ పాలన ఎమర్జెన్సీనీ తలపిస్తే పవన్‌ పోరాటమేది?

అయితే ముగ్గురం, లేకుంటే ఇద్దరం…ఒంటరి పోరు చూద్దాం!?

లెక్కలేని, లెక్కకందని పవన్‌ రాజకీయ లెక్కలు!

సినిమా ప్రమోషన్‌ కు తప్ప, బైటకు రారు…?

రాజకీయాలు చేసి, జనాన్ని ఉద్దరిస్తారా?

ఇప్పటికైనా జనం ఓట్లేందుకు వేయడం లేదో అర్ధం కాకపోతే కష్టం?

తెర మీద రంగుల కల, రాజకీయాల్లో నెరవేతుందా?

ఆంధ్రదేశాన్ని ఏలే కలుందని మీకు మీరనుకుంటే కాదు… జనమనుకోవాలి?

ఇంకా నయ్యం…ఒంటికి మంటెట్టుకోవాలనలేదు…అభిమానులంటే అంత అలుసైపోయారా? మీకోసం నిప్పుల్లో దూకాలా? మీరు రాజకీయాలు చేసి, గెలిచి పదవులు పొంది, పాలన సాగిస్తారా? ఆ కుటుంబాలకు గర్భశోకాలు మిగిల్చుతారా? సిగ్గుండాలి…మాట్లాడడానికి…అందుకే జనం జనసేనకు ఓట్లు వేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించినట్లున్నారు. ఏదైనా మాట్లాడే మందు ముందూ, వెనక ఆలోచించుకొని మాట్లాడాలి. జనంలో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అంతే కాదు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. నోరుంది కదా…అని, ఎది చెప్పినా వింటారు కదా? అని నోటి నుంచి రాకూడని మాటలు మాట్లాడితే ఈ మాత్రం కూడా రాజకీయాలకు పనికిరాకుండా పోతారు. ఇది ముందు తెలుసుకోవాలి. అసలే రాజకీయాల మీద నాగబాబుకు అవగాహన శూన్యమన్నది వింటున్నదే…? అన్న అలా…తమ్ముడు ఇలా…నాగబాబు బుసలు కొట్టినట్లు మాట్లాడుతున్నాడు. తమ్ముడు తనేదో చరిత్రకు సాక్ష్యమన్నట్లు మాట్లాడుతున్నాడు. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది 1975లో …ఎత్తేసింది 77లో…ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా, జనం ఏది చెబితే అది నమ్ముతారా? అసలు ఆనాడు అన్ని వర్గాల ప్రజలు ఏకమయ్యారా? అన్ని పార్టీలు కలిశాయా? ఇప్పుడు అలాంటి తరుణం ఎదురైందా? అదే నిజమైతే ఆనాడు ఎంతోమంది ఎమర్జెన్సీ నిరసిస్తూ పోరాటాలు చేశారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగావున్న వెంకయ్యనాయుడు కూడా ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు…మరి 2008 లో రాజకీయం మొదలు పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు ఎన్ని సార్లు జనం కోసం పోరాటాలు చేశారు. ఎన్ని సార్లు జైలుకు వెళ్లారో ఒక్కసారి చెప్పగలరా? మాటలు కాదు చెప్పాల్సింది…చేయాల్సింది ఉద్యమాలు…ప్రసంగాలు కాదు…ప్రజలంటే ప్రాణాలకు తెగించి పోరాడాలి. చంద్రబాబు పాలనలోనైనా ఓసారి పవన్‌ రోడ్డెక్కినట్లు జనానికి గుర్తుంది…మరి ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డిది అరాచకపాలనే అయితే,ఒక్కనాడు పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు రోడ్డెక్కలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? భయమా? ఇది జనం అడుగుతున్న మాటే…? ఎన్నికల సమయం అనగానే ఎగరేసుకొని రావడం, నాలుగు రోజులు కనిపించడం మాయమైపోవడం ఇది పవన్‌ కళ్యాణ్‌ కు అలవాటైన నాటకమే…. తెలుగు ప్రజలకు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయం ఏమిటో ఇప్పటికే ఎంతో అర్ధమైపోయింది. పవన్‌ కళ్యాణ్‌ ప్రజల్లోకి వస్తున్నారంటే సినిమా పూర్తయినట్లు…దాని ప్రమోషన్‌లో భాగంగా రాజకీయాలు చేస్తున్నట్లు అన్నది ఎప్పుడో తెలిసిపోయింది. అంతకనాన్నా ఏమీ వుండదని ఎప్పుడో స్పష్టమైంది. ఇప్పుడుకొత్తగా పవన్‌ కళ్యాణ్‌ చెప్పాల్సింది లేదు…జనం వినాల్సిందేమీ లేదు… ఆణిముత్యాలు చెప్పడానికి ఏమీ లేదు…నమ్మడానికి అసలైన రాజకీయం పవన్‌ దగ్గర లేనే లేదు…? ఇది జనం అనుకుంటున్న మాట. 

           అయితే ముగ్గురం, లేకుంటే ఇద్దరం…తప్పదనుకుంటే తప్ప… ఒక్కరమా? ఇదేం దిక్కు మాలిన ఫార్ములానో పవన్‌ కళ్యాణ్‌ కు తప్ప మరెవరికీ అర్ధంకానిది. 2008 నుంచి రాజకీయాలు చేస్తూ, 2022 వచ్చినా ఒంటరి పోటీకి భయపడే పార్టీ జనం కోసమేమి నిలబడుతుంది? జనానికి ఏం న్యాయం చేస్తుంది? 2014 ఎన్నికల్లోనూ జగన్‌కు అధికారం రావొద్దని కలిశారు. ఏం జరిగింది. ముగ్గురం కలిస్తే వెంకన్న స్వామి నామాలు అని భహిరంగంగానే ప్రకటించారు. కాని గెలిచి ఏం చేశారు. పంగనామాలు పెట్టారనే కదా! ప్రజలు 2019లో జగన్‌కు తిరుగులేని మెజార్టీనీ కట్టబెట్టారు. ప్రతిపక్షం వాసన లేకుండాచేశారు. పవన్‌ కళ్యాణ్‌ రెండు చోట్ల నిలబడ్డా ఓడిరచారు. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. అయినా నిలబడ్డారు ఫరవాలేదని అందరూ అనుకున్నారు. కాని పవన్‌ది అదే మాట..మళ్లీ అదే బాట….మేం ముగ్గురం వస్తాం…సింగిల్‌ సింగిల్‌గా రాం…ఇదే కదా! నినాదం…ఈ మాత్రం దానికి రాజకీయాలు ఎందుకు? ఎన్నికల నాడు కలిస్తే చాలదా? బిజేపి, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి, 2014లో గెలిచారు. అమరావతి రాజధాని అన్నారు. కేంద్రం నుంచి ప్రధాని వచ్చారు. ఏం తెచ్చారు…? తెచ్చిందేమిటో…పవన్‌కు తెలుసు…అదే మహాభాగ్యమనుకున్నారు. సరే…ఆవేశమో! కోపమో! కాని జనం మేలు కోరే నాయకుడిగా గుర్తింపు కోసమో! పాపం పవన్‌ పాచిపోయిన లడ్డూలన్నారు. జనంతో కలిసి పోరాటం చేస్తారని అందరూ అనుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా అవే మాటలు చెప్పారు. చెగువేరా? అన్నారు…మహాత్మాబాపూలే …మార్గ నిర్ధేనం అన్నారు…ఆఖరకు ఉత్తర ప్రదేశ్‌ వెళ్లి…మాయావతీ ఆశీస్సులు తీసుకున్నారు..! ఏమైంది!! మళ్లీ బీజేపికి సై అన్నారు…మోడీకి జై కొట్టారు…ప్రత్యేక హోదా అన్న పదం ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా నోటి నుంచి రాకుండా చూసుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే నాకేంటి? ఇవ్వకపోతే నాకేంటి? అనుకున్నారు…నేనొక్కడినే ఎందుకు బద్‌నాం కావాలని ఆ ముక్కే మర్చిపోయారు…? ఇప్పుడు మళ్లీ ఒక్కటౌతామంటున్నారు..ఏకమై ఎన్నికలకు వెళ్తామంటున్నారు..! ఈసారి ప్రత్యేక హోదా అన్న ఆ ఒక్క ముక్క తప్ప అన్నీ మాట్లాడుతున్నారు… జనానికి నామాలు పెట్టడం ఒక్క జనసేన వల్ల అయ్యేలా కనిపించడం లేదు…అందుకే మళ్లీ పొత్తుతోపోతే తప్ప, తలెత్తుకోలేమన్నది పవన్‌కు తేలిపోయింది. 

                 సింహం సింగిల్‌గా వస్తుందని గతంలోనే చెప్పి గెలిచింది వైసిసి. అదే డైలాగ్‌ సినిమాలో చెప్పి, రాజకీయాల్లో పాయిపోయిది జనసేన. ఒక్కసారి ఒంటరిగా పోవడంతో ఏం జరిగిందో కళ్ల ముందు పెట్టుకొని, మళ్లీ ఒంటరి పోరు అన్నది కలలో కూడా పవన్‌ ఊహించలేకపోతున్నాడు. పంతానికి పోతే, వైసిసి సవాలకు రెచ్చిపోతే గత ఫలితాలే పునరావృతం అన్నది పవన్‌కు తెలుసు. అందుకే వైసిపి వాళ్లు రెచ్చగొట్టినా మేం రెచ్చిపోం…ఒంటరిగా కలలో కూడా ఎన్నికల బరిలో దిగమంటున్నారు. ఇదిలా వుంటే ఇన్నేళ్లైనా నాగబాబుకు రాజకీయం అంతుపట్టడమే కాదు, ఒంటపట్టడం లేదన్నది మరోసారి రుజువైంది. మొన్న జరిగిన మా ఎన్నినకల్లోనే మాట నెగ్గించుకోలేకపోయారు….కనీసం పంతం నెగ్గించుకోలేకపోయారు…తన ప్యానల్‌లను గెలిపించుకోలేకపోయారు….కాని అభిమానులు పవన్‌ చెబితే నిప్పుల్లో దూకాలట…! 

                   నాగబాబు మాట వింటే చిన్నప్పటినుంచి చూస్తున్న చింతకాయను కొత్తగా ఇదేం కాయ వంకటింకరగా వుందన్నట్లుంది. నాలుగు పైసలు చేతిలో లేని నాడు నాగబాబు ఏం మాట్లాడాడో జనానికి తెలుసు? తన కుమారుడు సినిమా ఆడియో రిలీజ్‌కు పవన్‌ రాకపోతే అభిమానులు గగ్గోలు పెడుతుంటే, వారేదో బానిసలైనట్లు వారిని తిట్టారు..అభిమానులను చీదరించుకున్నారు…ఇప్పుడేమో! అన్న అభిమానులు, తమ్ముని అభిమానులు ఒక్కటి కావాలంటున్నాడు? అప్పుడు పవన్‌ రాలేదన్నందుకు తిట్టిన మీరే, ఇప్పుడు పవన్‌ కోసం అభిమానులు ఏదైనా చేయాలా? ప్రజలకు సేవ చేయడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చారా? లేక జనాన్ని వాడుకొని, వారిని నిప్పుల్లో తేసేయడానికి వచ్చారా? వారి ప్రాణాలతో చెలగాటమాడాలనుకుంటున్నారా? కొంత మంది అమాయకులు మీ మాట విని, ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు భాధ్యులు…అన్న చేసేవి తప్పులు…తమ్ముడు వేసుకునేవి లెక్కలు…ఇవేనా మీ రాజకీయాలు…అందుకే మిమ్మల్ని జనం నమ్మడంలేదు… పెద్దన్న చిరంజీవిని నమ్మలేదు…తమ్ముడు పవన్‌కు ఓట్లే వేయలేదు…చిన్నన్న నాగబాబు రాజకీయాలకే అసలు పనికి రాడు…అన్నది తన నోటితో తానే చెప్పుకున్నంత పనిచేశాడు…అభిమానుల క్షేమం కోరువాల్సిన నోటితో,నిప్పుల్లో దూకాలన్నప్పుడే రాజకీయాలు చేసే అర్హత ఆ కుటుంబం కోల్పోయింది…సినిమా లోకంలో…రంగుల ప్రపంచంలో…తెర మీద దేవతలం అన్నంతగా మైకంలో వుండేవారికి ఇంతకన్న విలువలేముంటాయి? పుస్తకాలు చదవగానే కాదు…వాటిలోని డైలాగులు చెప్పడం కాదు…నిజాన్ని చూడాలి…సమాజంలో బతకాలి…సినిమా వేరు..రాజకీయం వేరు…మనుషులుగా అందరం సమానంగా, సంతోషంగా, అరమరికలు లేకుండా, సమసమాజ స్ధాపన కావాలని కోరుకోవాలి. ఆచరించి చూపాలి. ఇప్పటికైనా నటన నేర్చుకున్నట్లే , రాజకీయం కూడా నేర్చుకొని చేయండి…విలువలు ఎలా వుండాలో తెలుసుకొని రండి…జనం వస్తున్నారు కదా? అదే రాజకీయం అనుకోకండి…దాన్ని రాజకీయం చేయకండి!! అని అభిమానులు కూడా అంటున్నారు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!