అజాత శత్రువు అజయ్ సంస్మరణ సభలో పలువురి నివాళి 

సికింద్రాబాద్, ఏప్రిల్, 17:

గ్రానైట్ పరిశ్రమల యజమానుల సంఘానికి ఎనలేని సేవలు అందించిన విన్నకోట అజయ్ కుమార్ క్రమశిక్షణ గల వ్యాపారి అని పలువురు వక్తలు కొనియాడారు. వ్యాపార రంగంలో ఎవరినీ నొప్పించకుండా.. అందరితో సఖ్యతగా మెలిగిన అజాత శత్రువు

అనిపించుకున్నాడని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు విన్నకోట అజయ్ కుమార్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు పలువురు ప్రముఖులు హాజరై, అజయ్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించారు. మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు, వివిధ నామినేట్ సంఘాల చైర్మన్లు పల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, అల్లం నారాయణ, వీరమళ్ల ప్రకాష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఎ. వి. రంగనాధ్, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), గ్రానైట్ అసోసియేషన్ ప్రముఖులు సి. హెచ్. శంకర్, రాయల నాగేశ్వరరావు, యలమద్ది శ్రీనివాసరావు, పారా నాగేశ్వరరావు, తుళ్లూరు కోటేశ్వరరావు, తమ్మినేని వెంకట్రావు, పుసులూరి నరేందర్, మిడ్ వెస్ట్ రాఘవరెడ్డి, అజయ్ బాబు, ఉప్పల వెంకటరమణ, హరిప్రసాద్, మున్నూరు కాపు సంక్షేమ సంఘం నాయకులు పుట్టం పురుషోత్తం, కొండ దేవయ్య, రౌతు కనకయ్య, ఆకుల గాంధీ, శెట్టి రంగారావు తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు అజయ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!