భూకబ్జాలు కప్పిపుచ్చుకునేందుకే పెయిడ్ ఆర్టికల్స్  

గండ్ర కోట సుధీర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి

 పార్టీ నుండి తక్షణమే తొలంగిచాలి

సంక్షేమ పథకాలను ఆసరా చేసుకుని అక్రమ వసూలు

 పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఎంపిపి భర్త

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కేంద్రంలో గాడిలో పెడుతున్న గండ్ర కోట అనే శీర్షికతో నేటి రోజున పెయిడ్ ఆర్టికల్ రాయించుకొని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న గండ్ర కోట సుధీర్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్న విషయంలో పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్న ములుగు మండల కమిటీ మరియు ప్రజా ప్రతినిధులు ఒక ఎంపీపీ భర్త అయ్యుండి తన స్వలాభం కోసం తాను చేస్తున్న భూకబ్జాలను మరియు ఇతర సొంత పనులను ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం పత్రికలను వాడుకొని పత్రికలకు పెయిడ్ ఆర్టికల్స్ కు డబ్బులు ఇస్తూ పార్టీ పరువును దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్న సుదీర్ పై పార్టీ క్రమశిక్షణ చర్యల కింద షోకాస్ నోటీసులు ఇచ్చి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ములుగు మండల పార్టీ కమిటీ మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఏకగ్రీవంగా తీర్మానించి జిల్లా అధ్యక్షునికి నేటి రోజున సుదీర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది.

       

 

 

పార్టీ నుండి తక్షణమే తొలంగిచాలి 

సంక్షేమ పథకాలను ఆసరా చేసుకుని అక్రమ వసూలు 

పార్టీ ప్రతిష్టానం దెబ్బతీస్తున్న ఎంపిపి భర్త 

భూకబ్జాలను కప్పిపుచ్చుకునేందుకే పేడ్ ఆర్టీకల్స్ 

ఆరోపణలు చేస్తున్న మండల నాయకత్వం 

 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆసరా చేసుకుని మండలంలోని పలువురికి పథకాలను వర్తింపచేస్తానని అక్రమ వసూళ్లకు పాల్పడుతూ పార్టీ ప్రతిష్టతను దెబ్బతీస్తున్న ములుగు ఎంపిపి గండ్రకోట శ్రీదేవి భర్త సుధీర్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలతో సహా ప్రజలను మబ్యబెడుతూ మద్య వర్తులను ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ములుగు జిల్లా కేంద్రంలోని పలువురు అమాయకుల భూములను కబ్జా చేసి ప్రజలకు తెలియకుండా పత్రికల్లో పేడ్ ఆర్టికల్ వ్రాయించకుంటున్నారని అన్నారు. పార్టీ క్రమ శిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుండి తక్షణమే తొలగించాలని ఆయన అన్నారు. భార్య పదవిని అడ్డుపెట్టుకుని భూ బాదితులను పోలీసుల సహాకారంతో, తన ప్రైవేట్ వ్యక్తులతో భయబ్రాంతులకు గురి చేస్తూ యధేచ్చగా భూ కబ్జాలకు పాల్పడుతూ పార్టీ పటిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. పార్టీ జిల్లా నాయకత్వం ఈ విషయాన్ని పరిశీలించి క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో ములుగు మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు పోరిక విజయ్ రామ్ నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు భూక్య పాప నాయక్ , ఎంపీటీసీలు గొర్రె సమ్మయ్య,లాల్, మాచర్ల ప్రభాకర్, అరెందుల రాధిక- కుమార్ లు, సర్పంచులు పంచోత్కుల పల్లి సర్పంచ్ మాలోతు రవీందర్ , జాకారం సర్పంచ్ దాసరి రమేష్, నర్సింగారావు, మదనపల్లి సర్పంచ్ రామ్ నాయక్, ఇంచర్ల మోరే రాజన్న,రామచంద్రపూర్ హట్కర్ కల్పన రూప్ సింగ్, మరియు మండల యూత్ ప్రెసిడెంట్ బైకాని సాగర్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రాజా హుస్సేన్, మండల బీసీ సెల్ అధ్యక్షులు మామిడి అశోక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చుంచు వెంకటేష్,మండల ఎస్టీ అధ్యక్షులు వాంకుడోత్ రాందాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బల్గురి నవీన్, పైడిమల్ల గోపికృష్ణ,మాధం సాగర్, సురేందర్, భద్రయ్య, పార్టీ ముఖ్య నాయకులు తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *