`అధికారం కోసం అడ్డదారులు?
` నేటిధాత్రి చీఫ్ ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో బిజేపివి నీతి లేని రాజకీయాలంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
` నిలకడ లేని రాజకీయాలు?
` నమ్మకం లేని సొంత పాలనలు?
` ప్రజాతీర్పు అభాసుపాలు?
` రాజ్యాంగ ఉల్లంఘనలు?
` నైతికతకు తిలోదకాలు?
` అధికారమే లక్ష్యంగా పోకడలు?
` ప్రజాస్వామ్య పరిహాసాలు?
` ప్రజా సంక్షేమం పట్టని పాలనలు?
` అధికారం నిలబెట్టుకోవడం కోసం దొడ్డి దారులు?
` గతంలో బిహార్ లో..
` తర్వాత కర్ణాటకలో..
`మొన్ననే మేఘాలయలో…
`తాజాగా మళ్ళీ మహారాష్ట్రలో…
` ఇప్పటికే ఎక్ నాధ్ షిండేతో…
`మళ్ళీ కొత్తగా ఎన్సీపితో..
`ఛీఛీ అంటున్న జనం!
`ఇక బిజేపి పతనం ఖాయం?
హైదరబాద్,నేటిధాత్రి:
ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కాంక్షించాలి. వారి కోసం పనిచేయాలి. ప్రజలకు మెరుగైన సదుపాయల కల్పన కోసం శ్రమించాలి. ప్రజాభ్యున్నతి కోసం పాటు పడాలి. ప్రజల మీద భారం పడుకుండా చూసుకోవాలి. వారికి మెరుగైన సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తుండాలి. ప్రజావసరాలు ఎప్పటికప్పుడు తీర్చుతుండాలి. ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయల కల్పన జరుగుతూ వుండాలి. దేశానికి అన్నం పెట్టే రైతును కాపాడుకోవాలి. వారికి మెరుగైన ప్రోత్సాహకాలు అందించాలి. పేదలకు అండగా నిలవాలి. వారి ఆకలి తీర్చాలి. ఇలా చెప్పుకుంటూ ఒకటికాదు, రెండు అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. వాటన్నింటినీ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సంపూర్ణంగా నిర్వహిస్తుందా? అంటే క్షణం కూడా తడబాటు లేకండా చెప్పాల్సిన పేరు తెలంగాణ ప్రభుత్వం. కేవలం ఒక్క తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన అందుకు నిదర్శనం. దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శం. కాని కేంద్రాన్ని పాలిస్తూ, అనేక రాష్ట్రాలలో అడ్డదారిలో అధికారంలోకి వచ్చి, దొడ్డిదారిన పాలన చేస్తూ బిజేపి ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏదైనా చేశారా? అని చెప్పుకోవాల్సివస్తే, కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అందుకే ఈ తొమ్మిదేళ్లలో ఏం చేశారంటే బిజేపిలో అందరూ చెప్పే ఒకేమాట…ఎప్పుడూ చెప్పుకునేది ఒక్కటే…ఇప్పటికీ, ఎప్పటికీ చెప్పుకొని పబ్బం గడుపునేది ఒక్కటే మాట.. అదే కరోనా సమయలో దేశంలోని పేదలను ఉచితంగా రేషన్ ఇచ్చామని చెప్పుకోవడం బాగా అలవాటు చేసుకున్నారు. కరోనా సమయంలో మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా ఇదే జరిగింది. ప్రజలను ఆదుకోలేక పోతే ప్రభుత్వాలు ఎందుకు? ఈ మాత్రం కూడా బిజేపి నేతలకు సోయి లేదు. మన ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతి నెల తెలంగాణలో వుంటున్న పేదలందరికీ నెలకు రూ.1500 అందజేశారు. ప్రజల ఎక్కడైతే తిరస్కరిస్తారో అక్కడే మళ్లీ దొడ్డిదారిన అక్కడే బిజేపి అధికారంలోకి రావడం వంటి అప్రజాస్వామ్య రాజకీయాలు సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మధ్య ప్రదేశ్లో కాంగ్రెస్లోకి అధికారంలోకి వచ్చింది. కమల్నాధ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాది కూడా గడవకముందే దాన్ని కూల్చి మళ్లీ బిజేపి అధికారంలోకి వచ్చింది. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు దేశంలో ఎక్కడా, ఎప్పుడూ చూడలేదు. నీతి లేని రాజకీయాలు, చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, ధర్మాన్ని వల్లిస్తూ, సెంటిమెంటు రాజకీయాల మీద కాలం గడుపుకుంటున్న బిజేపి పతనం ఖాయం అంటున్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి. నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయ అస్ధిరతను బిజేపి ఎలా ప్రేరేపిస్తుందో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడిరచి, బిజేపిని తూర్పారపట్టారు. ఆ విషయాలు..వివరాలు ఆయన మాటల్లోనే…
నిలకడ లేని, విలువలేని తనంతో బిజేపి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోంది. ప్రజలను ఎల్లకాలం మోసంతో నమ్మించలేరు.ఎల్ల కాలం వంచించలేరు. ప్రజలు ఎంతో చైతన్య వంతులు. ఈసారి దేశ ప్రజలు బిజేపికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. ఎందుకంటే తాజాగా మహారాష్ట్రలో చిల్లర రాజకీయాలను బిజేపి సాగిస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసి, కూటమి ప్రభుత్వాన్ని కూల్చి, శివసేను నుంచి ఏక్నాధ్షిండేను లాగేసుకొని, ప్రజలు తిరస్కరించినా అధికారం చేపట్టింది. ఎన్నటికైనా ఏక్నాధ్ షిండేతో ఇబ్బందే అన్న ఆలోచనకు వచ్చి, మళ్లీ ఎన్సీపితో బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే నీతిమాలిన రాజకీయాలు మేం ఎలాంటి పరిస్ధితులలోనైనా కొనసాగిస్తామని బరితెచించి చేస్తున్నారు. గతంలో మధ్య ప్రదేశ్లో బిజేపిని ప్రజలు ఓడిరచారు. కాంగ్రెస్ గెలిచింది. ఏడాది గడవకముందే అక్కడ కాంగ్రెస్ను చీల్చి జ్యోతిఆదిత్యాసిందియాను బిజేపి వైపు తిప్పుకొని, మళ్లీ బిజేపి అధికారంలోకి వచ్చింది. ఇంత నీతిమాలిన చర్యలు ఎక్కడైనా వుంటాయా? త్రిపురలో అదే చేశారు. మేఘాలయాలో ఎన్నికల ముందు ఏ పార్టీనైతే తిట్టిపోశారో అదే పార్టీతో చేతులు కలిపి, అధికారం పంచుకుంటున్నారు. కర్ణాటకలోనూ అలాగే వ్యవహరించారు. ఇలా గోవాలో మెజార్టీ సీట్లురాకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని అధికారం చేపట్టారు. బిహార్లో కూడా ఈ ఫార్ములాను అమలు చేయాలనుకున్నారు. కాని నితీష్ తెలివిగా బిజేపికి దూరమయ్యారు. తన పదవి పదిలం చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి వేలుపెట్టని రాష్ట్రం లేదు. పశ్చిమ బెంగాల్లో అక్కడి ప్రభుత్వాన్ని దింపేసేందుకు కుట్ర చేసినా, ప్రజలు తిరిగి మమతా బెనర్జీవైపు నిలవడంతో ఆగిపోయారు. అయినా ఎంతో మంది ఎమ్మెల్యేలను బిజేపిలో చేర్చుకున్నారు. పంజాబ్ను ఏలేద్దామనుకున్నారు. కాని కుదరలేదు. డిల్లీని గెవలేక, రెండుసార్లు బొక్క బోర్లా పడి ప్రభుత్వ సంస్ధలను చేతిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని చూస్తున్నారు. ఇదా దేశం కోసం, ధర్మం కోసం నిలబడం అంటే? రాజకీయాలను ఎంతో పవిత్రంగా నిర్వహించాల్సిన తరుణంలో విలువలు దిగజారిన బిజేపి నేతల్లో చేతుల్లో పడి రాజకీయాలు విలవిలలాడుతున్నాయి.
రాజ్యాంగ ఉల్లంఘనలు యదేచ్చగా సాగిస్తున్నారు. ఎలాగైనా తెలంగాణ రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలని, దేశ రాజకీయాల్లోకి ఒక ప్రభంజనంలా దూసుకువస్తున్న బిఆర్ఎస్తో భవిష్యత్తులో నష్టమని గ్రహించి, బిజేపి పెద్దలు కుట్రలు మొదలుపెట్టారు. డిల్లీ ప్రభుత్వంలో లేని స్కీమ్లో స్కామ్ను తెరమీదకు తెచ్చి, తెలంగాణకు లింకులుపెట్టి దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారు. ఇది బిజేపికి ఏమాత్రం మంచిది కాదు. అంతే కాదు బిజేపి శ్రేణులు కూడా దేశమంతా ఆలోచించాల్సిన అసవరం వుంది. దేశమంతా విస్తరించిన బిజేపిని ఇద్దరు నేతలు, ఇద్దరు పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దారాదత్తం చేస్తూ, బిజేపికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందుల పాలు చేస్తున్నారు. రాష్ట్రాల సర్కారులను కూలుస్తున్నారు. ప్రజలు బిజేపి పేరు చెబితే చీకొట్టేలా చేస్తున్నారు. మొత్తంగా తిన్నింటి వాసాలు ఇద్దరు నేతలు లెక్కబెడుతున్నారు. తమ ఇష్టాను సారం వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకొని, ఇతర సీనియర్లను చిటికిన వేలు మీద ఆడిస్తున్నారు. సొంత బిజేపి నేతలనే నమ్మకుండా, సొంత నిర్ణయాలు,ఏకపక్ష నిర్ణయాలతో ఎవరికీ వాయిస్లేకుండా చేస్తున్నారు. పార్టీపరంగా బిజేపిని వుంచుకుంటారో? తుంచుకుంటారో? ఎవరికీ అసవరం లేదు. కాని ప్రజలను ఇబ్బందుల పాలు చేసే రాజకీయాలు బిజేపి చేస్తుంటే బిఆర్ఎస్ ఊరుకోదు. తాజాగా మహారాష్ట్ర రాజకీయాలలో బిఆర్ఎస్ దూసుకుపోతోంది. పెద్దఎత్తున మహారాష్ట్రలోని పలు రాజకీయ పార్టీల నేతలు, యువకులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్లో చేరుతున్నారు. బిజేపిపతనం బిఆర్ఎస్తోనే మొదలౌతుంది. మహారాష్ట్ర నుంచే బిజేపిని తరిమికొట్టే యజ్ఞం మొదలౌతుంది. త్వరలో కర్నాటక రాజకీయాలతో బిజేపి ఉనికి మీద దెబ్బ పడడం మొదలౌతుంది. నోట్ల రద్దు నుంచి మొదలు ప్రజలను నానా రకాల ఇబ్బందులు పెడుతూ వస్తున్న బిజేపి పతనం అంచుల్లో వుంది. బిజేపి శకం త్వరలో ముగుస్తుంది. ఇంతకాలం ఎంతో కొంత చెప్పుకోవాడానికైనా వుండేది. ఇక బిజేపిఅనే పార్టీ వుండేదని చరిత్ర చెప్పుకునే కాలం త్వరలోనే వస్తుంది. ఇదే సత్యం..ఇదే తధ్యం.