నా భూమి నాకు ఇప్పించండి

దేశరాజుపల్లి గ్రామ రైతు ఆవేదన

రామడుగు నేటిథాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేశరాజుపల్లి గ్రామానికి చెందిన వెల్ముల బీరయ్య అలియాస్ గడియారాల బీరయ్య మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబరు: 462లో మొత్తం పదిహేను ఎకరాల పది గంటల భూమి ఉండాలి. కానీ నేడు అట్టి సర్వే నెంబరులో పదిహేడు ఎకరాల పైచిలుకుగా నమోదయింది. గ్రామ సర్పంచిపై అభియోగం చేసిన ఒగ్గరి లింగయ్యకు, మాకు, గ్రామ సర్పంచ్ లకు అట్టి సర్వే నంబరులో భూమి ఉంది. వాస్తవానికి ఈసర్వే నంబరులో ఒగ్గరి లింగయ్యకు నాలుగు ఎకరాల పదిహేను గుంటలు కొనుగోలు చేశాడు. అందులో నుండి ఎకరం ముపై గుంటలు ఇతరులకు విక్రయించి ఉన్నాడు. పహానిలో మార్పులు చేసుకుంటూ ధరణి లోపాలను ఆసరాగా చేసుకుని తను డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని తనకు ఐదు ఎకరాల పైబడి భూమి ఉన్నదని తెలుపడం తప్ప మిగిలిన ఎటువంటి భూమికి ఆధారం లేదు. వాస్తవానికి అతనికి రెండు ఎకరాల ఇరవై ఐదు గుంటలు మాత్రమే ఉండాలి. ఇదే విషయమై మేము గ్రామ ప్రజలు సమక్షంలో గత పది సంవత్సరాలుగా సమావేశం ఏర్పాటు చేస్తే రాక పోగా అట్టి పెద్ద మనుషులని నేను చనిపోతారని బెదిరింపుల గురిచేసి చేస్తున్నాడు. కావున ఈ విషయంలో మండల రెవెన్యూ అధికారులు రికార్డులను సరిగా పరిశీలన చేసి న్యాయం చేయాలని కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!