రూ.2 కోట్లతో నూతన గ్రామపంచాయతీ,మహిళ భవనాల నిర్మాణ పనులకు శంఖుస్థాపన…
గీసుగొండ మండలంలో శుక్రవారం రోజున పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు సుడిగాలి పర్యటన చేశారు.పర్యటనలో భాగంగా రూ.2 కోట్లతో బొడ్డుచింతలపల్లి, కొనాయిమాకుల,మనుగొండ, ఎలుకుర్తి,ఆనంతారం,సూర్యతండా,దస్రుతండా,హార్జ్యతండా, ఊకల్ గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలు,ఊకల్ గ్రామంలో మహిళ కమ్యూనిటీ భవనానికి శంఖుస్థాపన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఊకల్ గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
నియోజకవర్గంలో 49 కొత్త గ్రామపంచాయతీ భవనాలు మంజూరు కావడం జరిగింది.
-ఒక్కో భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేయడం జరిగింది.
-మహిళ కమ్యూనిటీ భవనాలు 35 మంజూరు చేసుకోవడం జరిగింది.
-ఒక్కో భవనానికి రూ.20 లక్షల నిధులు కేటాయించచడం జరిగింది.
-నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మహిళ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి కృషిచేస్తాను.
-కరోనా వల్ల రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురవ్వడం జరిగింది.
-అంతటి కష్ట కాలంలో సమర్ధవంతంగా పరిపాలన కొనసాగించి ప్రజల పక్షాన నిలిచిన ఘనత సీఎం కేసీఆర్ గారిది.
-గత 7 సంవత్సరాల క్రితం ప్రస్తుతం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలి.
-సీఎం కేసీఆర్ గారి సహకారంతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేస్తాను.
-ఈ రోజు 24 గంటల కరెంటు సరఫరా దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క మన తెలంగాణలో తప్ప.
-దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టి పారదర్శకంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారిది.
-గడ్డుకాలంలో ఉన్న రైతాంగానికి అండగా నిలిచి రైతులను అక్కున చేర్చుకొని వారి అభివృద్ధి కి కృషి చేస్తున్న ఘనత కేసీఆర్ గారిది.
-వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత కరెంటు,రైతుభీమా,రైతుబంధు,పంటపెట్టుబడి అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ గారేన్నారు.
-మహిళల అన్ని రంగాల్లో ముందుకు రావాలని వారిని ప్రోత్సహిస్తూ అండగా నిలిచి సొసైటీలో వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత బి.ఆర్.ఎస్. ప్రభుత్వానిదన్నారు.
-గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని నిధులలైన కేటాయించడానికి సిద్ధంగా ఉందన్నారు.
-ఈ అవకాశాన్ని సర్పంచులు సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధికి మరింత శ్రమించాలన్నారు.
-రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిగ్రామం అభివృద్ధిలో ఉరకలు పెడుతున్నాయి.
-తెలంగాణ రాష్ట్రానికిచ్చే నిధులు ఇవ్వకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుకుంటుందన్నారు.
-బీజేపీ నాయకులు గ్రామాలలోకి వస్తే గ్రామానికి ఏమిచేసారో చూపించాలని ప్రజలు నిలదీయాలన్నారు.
-నల్ల ధనం బయటికి తీస్తా అన్న ప్రధాని గారు ఇంతవరకు ఎందుకు చేయలేదు.
-జన్ ధన్ ద్వారా పేదల బ్యాoకు ఖాతాల్లో 15 లక్షలు జమచేస్తామన్న బిజెపి నాయకులు గ్రామాలలో తిరనివ్వకండి.
-బిజెపి పాలిత రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు లేవన్నారు.అమలు చేసే దమ్ముందా అని అడుగుతున్న.
-కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో త్వరలో ప్రారంభం చేసుకోబోయే కిటెక్స్ కంపెనీలో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
-ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సొసైటీ,మార్కెట్,రైతుబంధు,దళితబంధు చైర్మన్లు,కమిటీ సభ్యులు,బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు,మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.