గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

రామయంపేట (మెదక్)నేటి ధాత్రి:

అంగన్వాడి టీచర్లు వర్కర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూస్తామని అంగన్వాడి సూపర్వైజర్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూసివేసిన అంగన్వాడి కేంద్రాలను తాళాలు తీసి గర్భిణి బాలింతలకు అంది పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. అంగన్వాడి టీచర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు రామయంపేటలో తాళాలు వేసిన అంగన్వాడి కేంద్రాలను తెరవడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!